Rohit Sharma: రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది.
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది.
ముంబయి: ఐపీఎల్ ఆరంభానికి ముందు, మొదలయ్యాక అత్యంత చర్చనీయాంశం రోహిత్ను ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించడమే. సారథిగా అయిదు ట్రోఫీలు అందించిన రోహిత్ను తొలగించడం, హార్దిక్ పాండ్యను గుజరాత్ టైటాన్స్ నుంచి కొనుగోలు చేసి మరీ కెప్టెన్సీ అప్పగించడంతో పెద్ద వివాదమే చెలరేగింది. ఫ్రాంఛైజీ నిర్ణయంపై ముంబయి అభిమానులు భగ్గుమన్నారు. సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్వయంగా హార్దిక్ పాండ్యకు కూడా సెగ తప్పలేదు. అతడు ఒత్తిడికి గురయ్యాడు. మ్యాచ్ల సందర్భంగా ముంబయి అభిమానులే అతణ్ని గేలి చేశారు. కొందరు ముంబయి ఆటగాళ్లకు కూడా హార్దిక్కు పగ్గాలు అప్పగించడం ఇష్టం లేదన్న వార్తలొచ్చాయి. దీనిపై రోహిత్ శర్మ మాత్రం ఇప్పటివరకు పెదవి విప్పలేదు. కానీ కెప్టెన్సీ కోల్పోయిన అతడు ఇక ముంబయి ఇండియన్స్కు కొనసాగడన్న ఊహాగానాలు ఎప్పటి నుంచో సాగుతున్నాయి. అతడు ఫ్రాంఛైజీ మారడం ఖాయమన్నది చాలా మంది అభిప్రాయం. తాజాగా ముంబయి ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ వ్యాఖ్యలు రోహిత్ ముంబయిని వీడడం నిశ్చయమని చెబుతున్నాయి. రోహిత్ తన భవిష్యత్తును తానే చూసుకుంటాడని బౌచర్ వ్యాఖ్యానించాడు. ‘‘రోహిత్ భవిష్యత్తు గురించి పెద్దగా చర్చే జరగలేదు. ఈ సీజన్లో ముంబయి ఆఖరి మ్యాచ్ ముందు రోహిత్తో మాట్లాడా. కానీ అది సీజన్ను కాస్త సమీక్షించడానికే’’ అని అతడు అన్నాడు. ‘‘భవిష్యత్తు గురించి అడిగితే ‘టీ20 ప్రపంచకప్’ అని రోహిత్ చెప్పాడు. నేను తెలుసుకోవాలనుకున్నది అంతే’’ అని బౌచర్ చెప్పాడు. ‘‘రోహిత్ తన భవిష్యత్తు గురించి తానే ఆలోచించుకోగలడు. వచ్చే ఏడాది పెద్ద వేలం ఉంది. ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు?’’ అని అన్నాడు. వేలం గురించి బౌచర్ మాట్లాడుతున్నాడంటే.. రోహిత్ ముంబయిని వీడడం లాంఛనమేనని భావించవచ్చు. 37 ఏళ్ల రోహిత్ తనకు ఇప్పట్లో రిటైరయ్యే ఉద్దేశం లేదని, ఇంకొన్నాళ్లు క్రికెట్ ఆడతానని ఇప్పటికే స్పష్టం చేశాడు. మరి ఐపీఎల్లో అతడి ప్రయాణం ఎలా సాగుతుందో ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రస్తుతానికి ముంబయితో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. ఆ జట్టును వీడి మరో జట్టుకు ఆడే ఆలోచన అతడికి ఉందో లేదో తెలియదు. ఇటీవల తన స్నేహితుడు అభిషేక్ నాయర్తో మాట్లాడుతూ.. తనకు ఇదే చివరి ఐపీఎల్ అనే అర్థంలో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో అతడు ముంబయిని వీడితే మరో ఫ్రాంఛైజీకి ఆడతాడా..? ఐపీఎల్లో తన తర్వాతి ఇన్నింగ్స్ ఎక్కడ మొదలుపెడతాడో చూడాలి.
పాపం హార్దిక్... బౌచర్: అభిమానులు హార్దిక్ పాండ్యను గేలి చేయడం విచారం కలిగించిందని బౌచర్ అన్నాడు. అది స్టార్ ఆల్రౌండర్పై ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పాడు. ‘‘అలా గేలి చేయడం మంచిది కాదు. హార్దిక్కు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు విచారం కలిగింది. అలాంటి అనుభవం ఎదురైతే ఎవరికైనా బాధగానే ఉంటుంది’’ అని బౌచర్ అన్నాడు. ‘‘కొన్ని విషయాలు ఆటగాళ్లపై ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదు. అంతిమంగా అది జట్టును ప్రభావితం చేస్తుంది. బయటి పరిణామాలతో హార్దిక్కు కష్టంగా అనిపించి ఉంటుంది. డ్రెస్సింగ్రూమ్లో అతడికి చాలా మద్దతు లభించింది. ఆటగాళ్లు కూడా అతడికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆటగాడికి ఆ పరిస్థితులు కష్టమైనవే’’ అని చెప్పాడు. మైదానం బయటి విషయాలు జట్టుకు ఇబ్బందిగా మారినప్పుడు, జట్టు మేనేజ్మెంట్ వాటిపై దృష్టిపెట్టాలని బౌచర్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం