T20 World Cup: కప్పుతో ముగిస్తారా?
ఆ ఇద్దరు భారత క్రికెట్ జట్టు మూలస్తంభాలు. దాదాపు దశాబ్దన్నరగా టీమ్ఇండియా బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నారు. అత్యుత్తమ ప్రదర్శనతో దిగ్గజాలుగా ఎదిగారు. ఆ ఇద్దరి ఆటతీరు వేరు. వ్యక్తిత్వమూ వేరు. కానీ జట్టు విషయానికి వచ్చే సరికి విజయాల కోసం పోరాడటంలో వెనక్కి తగ్గరు.
ఆ ఇద్దరు భారత క్రికెట్ జట్టు మూలస్తంభాలు. దాదాపు దశాబ్దన్నరగా టీమ్ఇండియా బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నారు. అత్యుత్తమ ప్రదర్శనతో దిగ్గజాలుగా ఎదిగారు. ఆ ఇద్దరి ఆటతీరు వేరు. వ్యక్తిత్వమూ వేరు. కానీ జట్టు విషయానికి వచ్చే సరికి విజయాల కోసం పోరాడటంలో వెనక్కి తగ్గరు. ఆ ఇద్దరే.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ. ఇప్పటికే చెరో ప్రపంచకప్ సొంతం చేసుకున్న వీళ్లు.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్లో జట్టును గెలిపించడమే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. పొట్టి ఫార్మాట్లో ఈ ఇద్దరికీ ఇదే చివరి ప్రపంచకప్ అనే సంకేతాల నేపథ్యంలో టైటిల్తో ముగిస్తారా? అన్నది చూడాలి.
ఈనాడు క్రీడావిభాగం
టీ20ల్లో యువ రక్తాన్ని ఎక్కించే దిశగా టీమ్ఇండియా సాగుతోంది. అందుకే కోహ్లి, రోహిత్ కొద్దికాలంగా టీ20లకు దూరంగా ఉంటున్నారు. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఏడాది జనవరిలో అఫ్గానిస్థాన్తో సిరీస్లోనే తిరిగి ఆడారు. మధ్యలో 14 నెలల పాటు పొట్టి ఫార్మాట్లో జట్టుకు ప్రాతినిథ్యం వహించలేదు. అసలు ఈ టీ20 ప్రపంచకప్లో ఈ ఇద్దరు ఆడటంపైనా మొదట సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ కెప్టెన్గా రోహిత్ను, అనుభవజ్ఞుడైన ఆటగాడు కావడంతో కోహ్లీని జట్టులోకి తీసుకున్నారు. బహుశా ఈ ఇద్దరికీ ఇదే చివరి టీ20 ప్రపంచకప్ కావొచ్చేమో! 2026 టీ20 ప్రపంచకప్ సమయానికి రోహిత్కు 39, కోహ్లీకి 37 ఏళ్లు ఉంటాయి. ఆ తర్వాతి ఏడాదే (2027) వన్డే ప్రపంచకప్ ఉండటంతో.. దానిపై దృష్టి పెట్టి కోహ్లి, రోహిత్ టీ20ల నుంచి తప్పుకునే అవకాశాలున్నాయి.
రికార్డుల రారాజు: టీ20 ప్రపంచకప్కు కోహ్లి ఎంపికను కొంతమంది ప్రశ్నించారు. కానీ టీ20 ప్రపంచకప్ల్లో కోహ్లి ప్రదర్శన చూస్తే ఎవరూ ఈ మాట అనరు. 2012 నుంచి అయిదు టీ20 ప్రపంచకప్లు ఆడిన కోహ్లి అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. 25 ఇన్నింగ్స్ల్లో 81.50 సగటుతో 1141 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్రేట్ 131.30గా ఉంది. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమ్ఇండియాలో సభ్యుడైన కోహ్లి ఆ తర్వాత ఆటగాడిగా, కెప్టెన్గా మరో కప్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. 2014 టీ20 ప్రపంచకప్లో ఒంటిచేత్తో జట్టును ఫైనల్ చేర్చినా తుదిపోరులో నిరాశే ఎదురైంది. అప్పుడు 319 పరుగులు చేసిన కోహ్లి.. ఒక ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2021లో కెప్టెన్గా జట్టును గెలిపించలేకపోయాడు. 2022లోనూ అత్యధిక పరుగులు (296) చేసింది కోహ్లీనే అయినా అప్పుడు సెమీస్లోనే జట్టు ఓడింది. ఇలా టీ20 ప్రపంచకప్లో మెరుగైన గణాంకాలు ఉన్న కోహ్లి ఈ సారి జట్టుకు కప్ అందిస్తాడనే అంచనాలు మెండుగానే ఉన్నాయి. ఇటీవల ఐపీఎల్లో అతను చెలరేగడమే అందుకు కారణం. 741 పరుగులతో టాప్స్కోరర్గా నిలిచాడు. ఇదే ఊపును పొట్టికప్లోనూ కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు. కోహ్లి జట్టులో ఉంటే ఆ ఉత్సాహమే వేరు. బ్యాటింగ్, ఫీల్డింగ్లో రాణిస్తూ సహచరులకూ ప్రేరణగా నిలుస్తాడు. ఉత్తమ ప్రదర్శన చేసేలా వాళ్లలో స్ఫూర్తి నింపుతాడు.
నడిపించే నాయకుడు: ఇప్పటికే ఒకసారి టీ20 ప్రపంచకప్ (2007) ఖాతాలో వేసుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు రెండోదానిపై కన్నేశాడు. కెప్టెన్గా కప్ను అందుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు. పొట్టికప్ ఆరంభం నుంచి అన్ని ప్రపంచకప్ (8)లూ ఆడిన ఇద్దరు ఆటగాళ్లలో రోహిత్ ఒకరు. మరొకరేమో బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకిబ్. ఇంతటి అనుభవం ఉన్న రోహిత్ చివరిసారి టీ20 ప్రపంచకప్లో జట్టును టైటిల్ దిశగా నడిపించాలన్నది అభిమానుల కోరిక. 2022 టీ20 ప్రపంచకప్లో అతని సారథ్యంలో జట్టు సెమీస్ చేరింది. నిరుడు వన్డే ప్రపంచకప్లో ఫైనల్లో ఓడింది. టీ20 ప్రపంచకప్ల్లో రోహిత్ 36 ఇన్నింగ్స్ల్లో 963 పరుగులు చేశాడు. ఇటీవల ఐపీఎల్లో రోహిత్ ప్రదర్శన (417 పరుగులు) అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఒక్కసారి టీమ్ఇండియా జెర్సీ వేసుకుంటే రోహిత్ భిన్నమైన బ్యాటర్గా కనిపిస్తాడు. చివరగా ఆడిన అంతర్జాతీయ టీ20లో అఫ్గాన్పై అజేయ సెంచరీ (121) చేశాడు. ఓపెనింగ్లో ధనాధన్ ఆరంభాలను ఇస్తూ జట్టు భారీస్కోర్లకు పునాది వేసే పాత్ర అతనిదే. ఇక కెప్టెన్గా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వాడుకుంటూ.. జట్టు నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టాల్సి ఉంటుంది. ఈ ప్రపంచకప్లో మన జట్టు ఉత్తమంగానే ఉంది. ఈ ఆటగాళ్లను ముందుండి నడిపించాల్సిన బాధ్యత రోహిత్దే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి