World cup 2024: పొట్టి కప్పులో విరాట్ ఆడడా?
ఇటీవల వన్డే ప్రపంచకప్లో అదరగొట్టిన కోహ్లి.. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కోహ్లి భవిష్యత్ ఏంటీ?
టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అతడే. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల వీరుడూ అతడే. అతడి సగటుకు దరిదాపుల్లోకి వచ్చే ఆటగాడే లేడు. పొట్టి ఫార్మాట్లో అతని నిలకడ అమోఘం. ప్రస్తుతం ఫామ్ కూడా సూపర్గా ఉంది. కానీ వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్లో ఆ ఆటగాడు ఆడతాడా? అంటే కచ్చితంగా అవునని సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆ ఆటగాడే విరాట్ కోహ్లి. ఇటీవల వన్డే ప్రపంచకప్లో అదరగొట్టిన కోహ్లి.. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రోహిత్ సరే.. మరి కోహ్లి
2024 జూన్లో వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యమివ్వనున్నాయి. 2007లో ఆరంభ టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన తర్వాత టీమ్ఇండియా మరోసారి పొట్టి కప్పు సొంతం చేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే టీ20 ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలవాలనే పట్టుదలతో భారత్ ఉంది. అందుకే యువ రక్తాన్ని ఎక్కిస్తూ, దూకుడును అందిపుచ్చుకుంటూ జట్టును నిర్మించే దిశగా బీసీసీఐ సాగుతోంది. సీనియర్లను కాదని కుర్రాళ్లకు టీ20లకు అవకాశమిస్తోంది. మరోవైపు నిరుడు టీ20 ప్రపంచకప్ సెమీస్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తామే స్వయంగా పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉంటున్నారు. కానీ వన్డే ప్రపంచకప్లో జట్టును ఫైనల్ చేర్చిన నేపథ్యంలో వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్లోనూ కుర్రాళ్లను నడిపించాలని రోహిత్ను బీసీసీఐ కోరింది. దీనికి రోహిత్ ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇప్పుడిక టీ20ల్లో కోహ్లి భవితవ్యంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రపంచకప్లో ఆడే భారత టీ20 ప్రాధాన్య జట్టులో కోహ్లి పేరు లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై త్వరలోనే కోహ్లితో బీసీసీఐ చర్చించే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇషాన్ కోసమేనా?
సుదీర్ఘ కెరీర్లో కోహ్లి ఇప్పటివరకూ 2011, 2015, 2019, 2023 వన్డే ప్రపంచకప్లాడాడు. 2012, 2014, 2016, 2021, 2022 టీ20 ప్రపంచకప్ల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఉన్నాడు. కానీ కెప్టెన్గా ప్రపంచకప్ అందుకోలేకపోయిన అతను.. ఆటగాడిగా మరోసారి కప్పును ముద్దాడాలనే లక్ష్యంతో ఉన్నాడు. అయితే ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమితో ఆ కల తీరలేదు. దీంతో వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్తో చివరి ప్రయత్నం చేయాలని కోహ్లి చూస్తున్నాడు. కానీ అతనికి ఆ అవకాశం దక్కేలా లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కోహ్లి ఆడే మూడో స్థానాన్ని ఇషాన్ కిషన్కు కట్టబెట్టాలని జట్టు మేనేజ్మెంట్ చూస్తోంది. అందుకే ఆస్ట్రేలియాతో సిరీస్లో అతణ్ని మూడో స్థానంలో ఆడించింది. పొట్టి ప్రపంచకప్కు ముందు దక్షిణాఫ్రికాతో, అఫ్గానిస్థాన్తో టీమ్ఇండియా మూడేసి టీ20లు ఆడనుంది. ఈ మ్యాచ్ల్లోనూ మూడో స్థానంలో ఇషాన్నే ఆడించే అవకాశముంది. సఫారీతో సిరీస్కు కోహ్లి దూరంగానే ఉన్నాడు. కానీ ప్రపంచకప్కు మాత్రం కోహ్లీని దూరం పెడితే ఆ నిర్ణయం తీవ్ర విమర్శలకు తావిచ్చే అవకాశముంది. కోహ్లి ఫామే అందుకు కారణం. ఇటీవల వన్డే ప్రపంచకప్లో 765 పరుగులతో అతను అగ్రస్థానంలో నిలిచాడు. ఇక టీ20ల విషయానికి వస్తే అంతర్జాతీయ క్రికెట్లో 115 మ్యాచ్ల్లో 52.73 సగటుతో 4008 పరుగులతో నంబర్వన్గా కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనూ అత్యధిక పరుగులు (1141) సాధించిన ఆటగాడూ అతనే. జట్టులో 35 ఏళ్ల కోహ్లి ఉనికే వేరు. అతనుంటే జట్టులో ఉండే ఉత్సాహం వేరు. ఇప్పటికీ అతని పరుగుల ఆకలి తీరడం లేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్లో ఆడే అవకాశం దక్కినా అతను రాణిస్తాడని చెప్పొచ్చు. కానీ బీసీసీఐ మాత్రం కోహ్లి విషయంలో సానుకూలంగా లేదనే అంటున్నారు. ఒకవేేళ గొడవెందుకు అనుకుని కోహ్లి స్వయంగా టీ20ల నుంచి తప్పుకుంటాడా? లేదా అతణ్ని ఆడించేలా బీసీసీఐ తీరు మార్చుకుంటుందా? అన్నది వేచి చూడాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా