మోదీ సందేశంతో నిద్ర లేచా: గేల్... మేమూ గణతంత్రం జరుపుకుంటున్నాం: జాంటీ రోడ్స్
భారత ప్రధాని నరేంద్ర మోదీ సందేశంతో.. ఈ రోజు నిద్ర లేచానని వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ పేర్కొన్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా భారత ప్రజలకు అతడు శుభాకాంక్షలు...
ఇంటర్నెట్ డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ సందేశంతో.. ఈ రోజు నిద్ర లేచినట్లు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ పేర్కొన్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు అతడు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు గేల్ ఓ ట్వీట్ చేశాడు. ‘‘భారతదేశ ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత ప్రజలతో నాకున్న సన్నిహిత సంబంధాలను గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పంపిన సందేశంతో ఈ రోజు నిద్ర లేచాను’’ అని క్రిస్ గేల్ ట్వీట్లో పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్కి కూడా ప్రధాని నరేంద్ర మోదీ సందేశం పంపారు. అందులో భారతదేశ గణతంత్ర దినోత్సవ ఔచిత్యాన్ని వివరించారు. ప్రధాని పంపిన లేఖను జాంటీ రోడ్స్ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నాడు.
‘‘విదేశీయుల పాలన నుంచి స్వాతంత్ర్యం పొంది భారతీయులు 75 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న తరుణంలో.. ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఎంతో ప్రత్యేకం. ఈ నేపథ్యంలో భారత ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న మరికొంత మంది స్నేహితులకు కూడా నేను లేఖ రాస్తున్నాను. భవిష్యత్తులోనూ ఇలాగే సత్సంబంధాలు కొనసాగించాలని ఆశిస్తున్నాను. మీ కుమార్తెకి ‘ఇండియా జెన్నీ రోడ్స్’ అని పేరు పెట్టుకున్నారంటే.. మీకు భారత్పై ఉన్న అభిమానమెంతో అర్థమవుతోంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగేందుకు మీరే ప్రత్యేక రాయబారిగా ఉంటారని ఆశిస్తున్నాను’’ అని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ.. జాంటీ రోడ్స్ ఓ ట్వీట్ చేశారు. ‘మీ అభిమానానికి ధన్యవాదాలు నరేంద్ర మోదీ. భారత పర్యటనలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. వ్యక్తిగా ఎంతో ఎదిగాను. భారత ప్రజల హక్కులను కాపాడే రాజ్యాంగం ప్రాముఖ్యతను గౌరవిస్తూ.. మా కుటుంబ సభ్యులమంతా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జైహింద్’ అని జాంటీ రోడ్స్ ట్వీట్లో పేర్కొన్నారు.
టీమ్ఇండియా మాజీలు సహా ప్రస్తుత క్రికెటర్లు భారతీయులందరికీ ట్విటర్ వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, సచిన్ తెందూల్కర్, గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా తదితరులు విషెస్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!