మోదీ సందేశంతో నిద్ర లేచా: గేల్... మేమూ గణతంత్రం జరుపుకుంటున్నాం: జాంటీ రోడ్స్
భారత ప్రధాని నరేంద్ర మోదీ సందేశంతో.. ఈ రోజు నిద్ర లేచానని వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ పేర్కొన్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా భారత ప్రజలకు అతడు శుభాకాంక్షలు...
ఇంటర్నెట్ డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ సందేశంతో.. ఈ రోజు నిద్ర లేచినట్లు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ పేర్కొన్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు అతడు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు గేల్ ఓ ట్వీట్ చేశాడు. ‘‘భారతదేశ ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత ప్రజలతో నాకున్న సన్నిహిత సంబంధాలను గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పంపిన సందేశంతో ఈ రోజు నిద్ర లేచాను’’ అని క్రిస్ గేల్ ట్వీట్లో పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్కి కూడా ప్రధాని నరేంద్ర మోదీ సందేశం పంపారు. అందులో భారతదేశ గణతంత్ర దినోత్సవ ఔచిత్యాన్ని వివరించారు. ప్రధాని పంపిన లేఖను జాంటీ రోడ్స్ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నాడు.
‘‘విదేశీయుల పాలన నుంచి స్వాతంత్ర్యం పొంది భారతీయులు 75 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న తరుణంలో.. ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఎంతో ప్రత్యేకం. ఈ నేపథ్యంలో భారత ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న మరికొంత మంది స్నేహితులకు కూడా నేను లేఖ రాస్తున్నాను. భవిష్యత్తులోనూ ఇలాగే సత్సంబంధాలు కొనసాగించాలని ఆశిస్తున్నాను. మీ కుమార్తెకి ‘ఇండియా జెన్నీ రోడ్స్’ అని పేరు పెట్టుకున్నారంటే.. మీకు భారత్పై ఉన్న అభిమానమెంతో అర్థమవుతోంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగేందుకు మీరే ప్రత్యేక రాయబారిగా ఉంటారని ఆశిస్తున్నాను’’ అని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ.. జాంటీ రోడ్స్ ఓ ట్వీట్ చేశారు. ‘మీ అభిమానానికి ధన్యవాదాలు నరేంద్ర మోదీ. భారత పర్యటనలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. వ్యక్తిగా ఎంతో ఎదిగాను. భారత ప్రజల హక్కులను కాపాడే రాజ్యాంగం ప్రాముఖ్యతను గౌరవిస్తూ.. మా కుటుంబ సభ్యులమంతా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జైహింద్’ అని జాంటీ రోడ్స్ ట్వీట్లో పేర్కొన్నారు.
టీమ్ఇండియా మాజీలు సహా ప్రస్తుత క్రికెటర్లు భారతీయులందరికీ ట్విటర్ వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, సచిన్ తెందూల్కర్, గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా తదితరులు విషెస్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు