INDw Vs SLw: మహిళల ఆసియా కప్.. ‘లంక’ను కొట్టాలి.. ‘భారత్’ టైటిల్ పట్టేయాలి!
మహిళల ఆసియా కప్లో భారత్దే ఎప్పుడూ ఆధిపత్యం. ఏడు టైటిళ్లలో ఆరుసార్లు టీమ్ఇండియా కైవసం చేసుకొంది. తాజాగా ఏడో కప్ కోసం శ్రీలంకతో ఫైనల్ పోరులో తలపడేందుకు సిద్ధమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఏడాదిలో పురుష క్రికెటర్లు చేయలేని ఘనతను.. భారత మహిళామణులు సాధించే అవకాశం వచ్చింది. ఆసియా కప్లో భారత్ అదరగొట్టేసి ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. ఇదేంటి ఇప్పుడంతా పొట్టి ప్రపంచకప్ మేనియా కదా.. ఆసియా కప్ ఎక్కడొచ్చిందని కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఇది మహిళల ఆసియా కప్.. టైటిల్ కోసం శ్రీలంకతో భారత్ శనివారం (అక్టోబర్ 15న) తలపడనుంది. ఈ క్రమంలో ఇరు జట్లలో ఆధిక్యం ఎవరు..? బలాలు ఏంటనేవి చూద్దాం..
లీగ్ దశలో ఒక మ్యాచ్ మినహా.. (అదీ పాక్పై టీమ్ఇండియా ఓడింది) అన్ని మ్యాచుల్లోనూ గెలిచి సెమీస్కు చేరుకొన్న టీమ్ఇండియా ఇక్కడా ఆధిపత్యం ప్రదర్శించింది. థాయ్లాండ్ను భారత్ చిత్తు చేసేసింది. ఇక శ్రీలంక కూడా గ్రూప్ స్టేజ్లో మనపై, పాక్ చేతిలోనే ఓటమిపాలైంది. ఇప్పుడు సెమీస్లో పాక్ను ఓడించి ప్రతీకారం తీర్చుకొంది. ఈ క్రమంలో టీమ్ఇండియాపైనా చెలరేగే అవకాశం లేకపోలేదు. అందుకే లంకతో బహుపరాక్గా ఉండాలని విశ్లేషకులు సూచించారు. ఇప్పటివరకు ఏడుసార్లు మహిళా ఆసియా కప్ టోర్నమెంట్ జరిగితే.. ఆరు టైటిళ్లను సొంతం చేసుకొంది. గత సీజన్లో బంగ్లాదేశ్ గెలవడం విశేషం. పురుషుల ఆసియా కప్లో టీమ్ఇండియా సూపర్-4 స్టేజ్కే పరిమితమై ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే.
ఆ ఇద్దరు నిలకడగా..
భారత బ్యాటింగ్ లైనప్లో నిలకడగా ఆడుతున్న ప్లేయర్లలో జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ ముందుంజలో ఉండగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, డిప్యూటీ స్మృతీ మంధాన అప్పుడప్పుడు బ్యాట్ను ఝులిపించారు. అయితే కనీసం ఇద్దరు కీలక ఇన్నింగ్స్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. కానీ మంధానతోపాటు హర్మన్ కూడా ఇంకా బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉంది. టైటిల్ను నెగ్గాలంటే స్కోరు బోర్డుపై భారీ స్కోరు ఉండాలి. అప్పుడే బౌలర్లపై ఒత్తిడి తగ్గి అనుకున్న ఫలితం రాబట్టేందుకు అవకాశం ఉంటుంది. మిడిలార్డర్లో రిచా ఘోష్, హేమలత, పూజా వస్త్రాకర్ పెద్దగా రాణించలేదు. తుదిపోరులో ఆ లోటుపాట్లను సవరించుకోవాలి.
బౌలింగ్లో అదరగొడుతూ..
టీమ్ఇండియా బ్యాటింగ్ కంటే బౌలింగ్ ఎంతో పటిష్టంగా ఉంది. దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రాధా యాదవ్, హేమలతతో కూడిన స్పిన్ దళం ప్రత్యర్థులను తిప్పేసింది. ఆరంభంలో పేసర్ రేణుకా సింగ్ కూడా ఫర్వాలేదనిపించినా.. ఆల్రౌండర్గా పేరొందిన పూజా వస్త్రాకర్ మాత్రం కట్టుదిట్టమైన బంతులను సంధించి అవతలి బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరి చేసింది. లక్ష్యం ఎంత తక్కువ ఉన్నప్పటికీ బౌలింగ్ బలంతో భారత్ వైపు మ్యాచ్లు తిరిగాయి. షఫాలీ వర్మ బ్యాటింగ్తోపాటు బౌలింగ్లోనూ అద్భుతంగా రాణించడం విశేషం. ఫీల్డింగ్ కూడా అత్యున్నత నాణ్యంగా ఉండటం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశం. చురుకైన ఫీల్డింగ్, దూకుడైన బ్యాటింగ్, పదునైనా బౌలింగ్తో ఫైనల్లోనూ లంకను చుట్టేయాలి.
లంకేమీ తక్కువ కాదు..
ఆసియా కప్ ఫైనల్కు చేరిన శ్రీలంక జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. పోరాడితే పోయేదేముంది.. అన్నట్లుగా చివరి బంతి వరకు ఓటమిని అంగీకరించని లంక సెమీస్లోనూ స్వల్ప లక్ష్యం కాపాడుకోవడం అద్భుతం. బ్యాటింగ్లో ఆ జట్టు కెప్టెన్, ఓపెనర్ ఆటపట్టుతోపాటు అనుష్క సంజీవని, మాధవి కీలక ప్లేయర్లు.. లోయర్ ఆర్డర్లో రాణించేంత బ్యాటర్ లేకపోవడం లంక వీక్నెస్. అయితే బౌలింగ్ విభాగం మాత్రం పటిష్టంగా ఉంది. ఉదాహరణకు సెమీఫైనల్నే తీసుకొంటే బ్యాటింగ్ బలంగా ఉన్న పాకిస్థాన్ను కట్టిడి చేయడమంటే సాధారణ విషయం కాదు. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 122/6 స్కోరు చేయగా.. పాక్ను 121/6కే పరిమితం చేసి ఒక్క పరుగుతో విజయం సాధించింది. ఇన్కో రణవీర, అచిని కులసూరియా, సుగంధిక కుమారి, మల్షా షెహాని కూడిన బౌలింగ్ దళంతో టీమ్ఇండియా జాగ్రత్తగా ఉండాల్సిందే.
* ఇరు జట్లూ 21 టీ20ల్లో తలపడగా.. భారత్ 16 మ్యాచుల్లో విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచుల్లో లంక గెలిచింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు.
* లంకపై భారత్ యావరేజ్ స్కోరు 126 పరుగులు కాగా.. భారత్పై శ్రీలంక సగటు స్కోరు 110
* 2013-14 సీజన్లో భారత్ 147 పరుగులు సాధించగా.. లంక 148 పరుగులు చేసి గెలిచింది. ఇదే అత్యధిక స్కోరు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్