Yashasvi Jaiswal: ఐపీఎల్లోనూ స్లెడ్జింగ్.. కానీ అందరికీ తెలియదంతే: జైస్వాల్
రాజస్థాన్ యువ ఓపెనర్గా యశస్వి.. ఇటీవల ఐపీఎల్ సీజన్లో పరుగుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీంతో వెస్టిండీస్ పర్యటన కోసం ప్రకటించిన జట్టులోకి యశస్వి వచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ క్రికెటర్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) గురించే ప్రధాన చర్చ. మూడేళ్ల కిందట ఐపీఎల్లో అరంగేట్రం చేసినప్పటికీ.. 2023 సీజన్ అతడి కెరీర్లో అత్యుత్తమం. అదే జాతీయ జట్టులోకి వచ్చేలా చేసింది. వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో స్థానం సంపాదించాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో జైస్వాల్ వివిధ విషయాలపై ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.
ఆటలోనే కాదు, నిజజీవితంలోనూ ఎవరైనా పరుషంగా మాట్లాడినా పట్టించుకోనని చెప్పాడు. మైదానంలో ప్రత్యర్థులు స్లెడ్జింగ్ చేస్తే నోటితో కాకుండా ఆటతో సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. ఐపీఎల్లో ఇలాంటివి జరగవు కదా అని హోస్ట్ వ్యాఖ్యానించగా ‘‘ఎవరన్నారు..? స్లెడ్జింగ్ ఎక్కడైనా జరుగుతుంది. కానీ అది బయటవారికి తెలియదు. ఇక నా విషయానికొస్తే మా అమ్మ, చెల్లి గురించి ఎవరైనా ఏమన్నా సరే నా మనసులోకి వెళ్లనివ్వను. ఆ మాటలు అస్సలు పట్టించుకోను’’ అని చెప్పాడు.
2023 ఐపీఎల్ సీజన్ విషయానికొస్తే.. రాజస్థాన్ రాయల్స్ తరఫున జైస్వాల్ ఆడాడు. 14 మ్యాచ్లు ఆడిన ఈ ఎడమ చేతివాటం ఓపెనర్ 625 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ రేసులో చాలా రోజులు నిలిచినా ఆఖరుకు ఐదో స్థానానికి పరిమితమయ్యాడు. ఆ ప్రదర్శనే ఇప్పుడు విండీస్ టూర్కు ఎంపికయ్యేలా చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!