World Cup Final 2023: అహ్మదాబాద్.. కొట్టేనా జిందాబాద్
భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఆదివారం వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) ఆతిథ్యం ఇవ్వనుంది.
వాంఖడేలా టీమ్ఇండియాను గెలిపిస్తుందా?
ముంబయిలోని వాంఖడే మైదానం.. ఈ పేరు వినగానే అక్కడ టీమ్ఇండియా (Team India) సాధించిన ఎన్నో ఘనతలు గుర్తుకొస్తాయి. ఎన్నో విజయాలు స్ఫూరిస్తాయి. తనకు సొంత మైదానమైన ఇక్కడ క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ (Sachin Tendulkar) పరుగుల వరద పారించారు. రికార్డుల మోత మోగించారు. కానీ అదంతా 2011కు ముందువరకే. ఆ తర్వాత వాంఖడే అంటే.. ధోని సిక్సర్తో టీమ్ఇండియా ప్రపంచకప్ గెలిచిన క్షణం, విరాట్ భుజాలపై సచిన్ ఊరేగిన దృశ్యం, రెండోసారి భారత్ వన్డే విశ్వవిజేతగా నిలిచిన వేళ మనసులోని నుంచి పెళ్లుబికిన కన్నీళ్లు.. ఇవే గుర్తుకొస్తాయి. 2011లో వాంఖడేలో ఫైనల్లో శ్రీలంకపై గెలిచిన భారత్ రెండోసారి ప్రపంచకప్ను ముద్దాడింది. ఇప్పుడు మళ్లీ 12 ఏళ్ల తర్వాత 2023 ప్రపంచకప్లో టీమ్ఇండియా ఫైనల్ ఆడబోతోంది. ఇప్పుడు వేదిక అహ్మదాబాద్కు మారింది. మరి ప్రపంచలోని అతి పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) టీమ్ఇండియాకు మరుపురాని బహుమతినిస్తుందా? ఇక్కడ కప్పుకు భారత్ మూడోసారి ముద్దు పెడుతుందా?
కళ్లన్నీ ఇక్కడే..
సొంతగడ్డపై ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శనతో.. అజేయ రికార్డు కొనసాగిస్తూ భారత్ ఫైనల్ చేరింది. ఆదివారం తుదిపోరులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దృష్టంతా అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం మీదకు మళ్లింది. ప్రపంచంలోనే పెద్దదైన ఈ క్రికెట్ స్టేడియంలో లక్షా 32 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్ చూసే అవకాశముంది. 1982లో సర్దార్ పటేల్ స్టేడియంగా 54 వేల సీటింగ్ సామర్థ్యంతో ఇది ప్రారంభమైంది. మొతేరా స్టేడియంగానూ ప్రసిద్ధికెక్కింది. పాత స్టేడియం స్థానంలో కొత్త దాని నిర్మాణం 2015లో ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పెద్దదిగా మారిన ఈ స్టేడియాన్ని 2021లో పునఃప్రారంభించారు. ఈ మైదానంలో మొత్తం 11 పిచ్లున్నాయి. టెస్టు క్రికెట్లో సునీల్ గావస్కర్ 10 వేల పరుగుల మైలురాయిని చేరుకుంది ఇక్కడే. టెస్టుల్లో 432వ వికెట్తో అప్పుడు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కపిల్ దేవ్ రికార్డు సృష్టించింది కూడా ఇక్కడే. ఇక్కడ 1987, 1996 ప్రపంచకప్ల్లో ఒక్కో మ్యాచ్ జరిగింది. 2011 ప్రపంచకప్లో మూడు మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చింది. వన్డేల్లో 18 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్గా సచిన్ ఇక్కడే చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో సచిన్ తొలి డబుల్ సెంచరీని ఇక్కడే సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20 ఏళ్ల కెరీర్ను, 30 వేల పరుగులను ఇక్కడే పూర్తిచేసుకున్నాడు.
అజేయంగా..
ఈ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్ల్లో భారత ఇప్పటివరకూ ఓడిపోలేదు. 1987లో జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. 2011 ప్రపంచకప్ క్వార్టర్స్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఈ ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై 7 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఇప్పుడదే జోరు కొనసాగించి ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించాలనే భారత్ చూస్తోంది. ఓవరాల్గా ఇక్కడ ఇప్పటివరకూ 18 వన్డేలు ఆడిన భారత్ 10 మ్యాచ్ల్లో గెలిచి, 8 మ్యాచ్ల్లో ఓడిపోయింది. రికార్డులు చూస్తే అక్కడ అత్యధిక స్కోరు దక్షిణాఫ్రికా (2010లో భారత్పై 365/2) చేసింది. అత్యధిక పరుగులు ద్రవిడ్ (342), అత్యధిక వికెట్లు కపిల్ దేవ్ (10) సాధించారు. ఇక్కడి పిచ్ బ్యాటింగ్, బౌలింగ్కు సమానంగా సహకరించే అవకాశముంది. నల్లమట్టి పిచ్పై ఫైనల్ జరిగే అవకాశముంది. ఈ టోర్నీలో జట్లు 400 పరుగులు చేసినా విజయంపై ధీమాగా ఉండలేని పరిస్థితి. కానీ ఈ ఫైనల్లో 315 పరుగుల స్కోరును కాపాడుకోవచ్చని స్థానిక క్యూరేటర్ చెప్పారు. మరోవైపు స్పిన్ పిచ్ రూపొందిస్తున్నారని, ఫైనల్లో సిరాజ్ స్థానంలో అశ్విన్ను ఆడించే అవకాశముందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మంచి బౌన్స్ లభించి ఇక్కడి పిచ్ సాధారణంగా పేసర్లకే ఎక్కువ అనుకూలమనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో జోరుమీదున్న మన పేస్ త్రయం మరోసారి చెలరేగి జట్టును విశ్వవిజేతగా నిలపాలని అభిమానులు కోరుకుంటున్నారు. వాంఖడే సరసన నరేంద్ర మోదీ స్టేడియం చేరాలని ఆకాంక్షిస్తున్నారు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. -
టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. -
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.