World Cup Final 2023: అహ్మదాబాద్.. కొట్టేనా జిందాబాద్
భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఆదివారం వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) ఆతిథ్యం ఇవ్వనుంది.
వాంఖడేలా టీమ్ఇండియాను గెలిపిస్తుందా?
ముంబయిలోని వాంఖడే మైదానం.. ఈ పేరు వినగానే అక్కడ టీమ్ఇండియా (Team India) సాధించిన ఎన్నో ఘనతలు గుర్తుకొస్తాయి. ఎన్నో విజయాలు స్ఫూరిస్తాయి. తనకు సొంత మైదానమైన ఇక్కడ క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ (Sachin Tendulkar) పరుగుల వరద పారించారు. రికార్డుల మోత మోగించారు. కానీ అదంతా 2011కు ముందువరకే. ఆ తర్వాత వాంఖడే అంటే.. ధోని సిక్సర్తో టీమ్ఇండియా ప్రపంచకప్ గెలిచిన క్షణం, విరాట్ భుజాలపై సచిన్ ఊరేగిన దృశ్యం, రెండోసారి భారత్ వన్డే విశ్వవిజేతగా నిలిచిన వేళ మనసులోని నుంచి పెళ్లుబికిన కన్నీళ్లు.. ఇవే గుర్తుకొస్తాయి. 2011లో వాంఖడేలో ఫైనల్లో శ్రీలంకపై గెలిచిన భారత్ రెండోసారి ప్రపంచకప్ను ముద్దాడింది. ఇప్పుడు మళ్లీ 12 ఏళ్ల తర్వాత 2023 ప్రపంచకప్లో టీమ్ఇండియా ఫైనల్ ఆడబోతోంది. ఇప్పుడు వేదిక అహ్మదాబాద్కు మారింది. మరి ప్రపంచలోని అతి పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) టీమ్ఇండియాకు మరుపురాని బహుమతినిస్తుందా? ఇక్కడ కప్పుకు భారత్ మూడోసారి ముద్దు పెడుతుందా?
కళ్లన్నీ ఇక్కడే..
సొంతగడ్డపై ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శనతో.. అజేయ రికార్డు కొనసాగిస్తూ భారత్ ఫైనల్ చేరింది. ఆదివారం తుదిపోరులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దృష్టంతా అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం మీదకు మళ్లింది. ప్రపంచంలోనే పెద్దదైన ఈ క్రికెట్ స్టేడియంలో లక్షా 32 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్ చూసే అవకాశముంది. 1982లో సర్దార్ పటేల్ స్టేడియంగా 54 వేల సీటింగ్ సామర్థ్యంతో ఇది ప్రారంభమైంది. మొతేరా స్టేడియంగానూ ప్రసిద్ధికెక్కింది. పాత స్టేడియం స్థానంలో కొత్త దాని నిర్మాణం 2015లో ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పెద్దదిగా మారిన ఈ స్టేడియాన్ని 2021లో పునఃప్రారంభించారు. ఈ మైదానంలో మొత్తం 11 పిచ్లున్నాయి. టెస్టు క్రికెట్లో సునీల్ గావస్కర్ 10 వేల పరుగుల మైలురాయిని చేరుకుంది ఇక్కడే. టెస్టుల్లో 432వ వికెట్తో అప్పుడు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కపిల్ దేవ్ రికార్డు సృష్టించింది కూడా ఇక్కడే. ఇక్కడ 1987, 1996 ప్రపంచకప్ల్లో ఒక్కో మ్యాచ్ జరిగింది. 2011 ప్రపంచకప్లో మూడు మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చింది. వన్డేల్లో 18 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్గా సచిన్ ఇక్కడే చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో సచిన్ తొలి డబుల్ సెంచరీని ఇక్కడే సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20 ఏళ్ల కెరీర్ను, 30 వేల పరుగులను ఇక్కడే పూర్తిచేసుకున్నాడు.
అజేయంగా..
ఈ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్ల్లో భారత ఇప్పటివరకూ ఓడిపోలేదు. 1987లో జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. 2011 ప్రపంచకప్ క్వార్టర్స్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఈ ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై 7 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఇప్పుడదే జోరు కొనసాగించి ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించాలనే భారత్ చూస్తోంది. ఓవరాల్గా ఇక్కడ ఇప్పటివరకూ 18 వన్డేలు ఆడిన భారత్ 10 మ్యాచ్ల్లో గెలిచి, 8 మ్యాచ్ల్లో ఓడిపోయింది. రికార్డులు చూస్తే అక్కడ అత్యధిక స్కోరు దక్షిణాఫ్రికా (2010లో భారత్పై 365/2) చేసింది. అత్యధిక పరుగులు ద్రవిడ్ (342), అత్యధిక వికెట్లు కపిల్ దేవ్ (10) సాధించారు. ఇక్కడి పిచ్ బ్యాటింగ్, బౌలింగ్కు సమానంగా సహకరించే అవకాశముంది. నల్లమట్టి పిచ్పై ఫైనల్ జరిగే అవకాశముంది. ఈ టోర్నీలో జట్లు 400 పరుగులు చేసినా విజయంపై ధీమాగా ఉండలేని పరిస్థితి. కానీ ఈ ఫైనల్లో 315 పరుగుల స్కోరును కాపాడుకోవచ్చని స్థానిక క్యూరేటర్ చెప్పారు. మరోవైపు స్పిన్ పిచ్ రూపొందిస్తున్నారని, ఫైనల్లో సిరాజ్ స్థానంలో అశ్విన్ను ఆడించే అవకాశముందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మంచి బౌన్స్ లభించి ఇక్కడి పిచ్ సాధారణంగా పేసర్లకే ఎక్కువ అనుకూలమనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో జోరుమీదున్న మన పేస్ త్రయం మరోసారి చెలరేగి జట్టును విశ్వవిజేతగా నిలపాలని అభిమానులు కోరుకుంటున్నారు. వాంఖడే సరసన నరేంద్ర మోదీ స్టేడియం చేరాలని ఆకాంక్షిస్తున్నారు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!