ODI WC 2023: భారత్తో తలపడేది ఎవరు? రెండు బెర్తుల కోసం నాలుగు జట్ల పోటీ.. సెమీస్ రేసు ఇలా..
వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) చివరి దశకు చేరింది. ఇప్పటికే రెండు జట్లు సెమీస్కు అర్హత సాధించగా.. మరో రెండు బెర్తుల కోసం తీవ్ర పోటీ నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) భారత్, దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్కు చేరుకున్నాయి. లీగ్ దశలో 8 మ్యాచ్లు ఆడిన టీమ్ఇండియా అన్నింట్లోనూ విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అగ్రస్థానంతోనే భారత్ సెమీస్లోనూ ఆడనుంది. అయితే, ఎవరు ప్రత్యర్థిగా మారతారనేది ఆసక్తికరరంగా మారింది. ఎందుకంటే మిగతా రెండు సెమీస్ బెర్తుల కోసం నాలుగు జట్లు పోటీలో నిలిచాయి. ఇప్పుడా ఆ జట్ల పరిస్థితి ఎలా ఉందంటే?
ఆస్ట్రేలియా (10 పాయింట్లు)
ఆస్ట్రేలియా కూడా దాదాపు సెమీస్కు చేరుకోవడం ఖాయం. అయితే, ఏ స్థానమనేది మిగతా మ్యాచ్లు, జట్ల ఫలితాలపై ఆధార పడి ఉంది. 7 మ్యాచుల్లో ఐదు విజయాలతో 10 పాయింట్లతో కొనసాగుతోంది. ఇంకా ఆ జట్టు రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అఫ్గాన్, బంగ్లాదేశ్తో తలపడనుంది. అఫ్గాన్తో కాస్త ప్రమాదకరమే కానీ.. బంగ్లాదేశ్ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాకపోవచ్చు. రెండింట్లోనూ ఓడినా సెమీస్కు వచ్చే ఛాన్స్ ఉంది. అది నెట్రన్రేట్పై ఆధారపడి ఉంది.
న్యూజిలాండ్ (8)
ఈ వరల్డ్ కప్లో భారత్ తర్వాత మొదట్లో సాధికారికంగా ఆడిన జట్టు కివీస్. వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి సెమీస్ వైపు పరుగులు తీసింది. కానీ, ఆ తర్వాతే న్యూజిలాండ్ బోల్తా పడింది. మళ్లీ నాలుగు ఓటములను చవిచూసి సెమీస్ బెర్తు కోసం పోరాడాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. ప్రస్తుతం 8 మ్యాచుల్లో నాలుగేసి విజయాలు, ఓటములతో ఎనిమిది పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. చివరి మ్యాచ్ శ్రీలంకతో నవంబర్ 9న తలపడనుంది. ఇందులో గెలిచినా సెమీస్కు చేరుతుందనే నమ్మకం లేదు. పాక్, అఫ్గాన్ తమ ఆఖరి మ్యాచుల్లో ఓడితేనే కివీస్ నాకౌట్ దశకు చేరుకుంటుంది. కివీస్కు ఓటమి ఎదురైతే మాత్రం సెమీస్ ఆశలు వదులుకోవాల్సిందే. నెట్రన్రేట్ ప్రకారం బెర్తు దక్కే అవకాశాలు తక్కువే.
పాకిస్థాన్ (8)
ఇప్పటి వరకు పాక్ ఆటతీరును చూసిన తర్వాత సెమీస్ రేసులో నిలుస్తుందని ఎవరూ భావించలేదు. అందుకే పాక్ను ఎవరి అంచనాలకు అందని జట్టుగా అభివర్ణిస్తుంటారు. ఈ వరల్డ్ కప్లో ఇప్పటి వరకు 8 మ్యాచుల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో 8 పాయింట్లు సాధించింది. గత మ్యాచ్లో కివీస్పై అద్భుత విజయంతో నెట్రన్రేట్ను కూడా మెరుగుపర్చుకుంది. తన చివరి మ్యాచ్లో (నవంబర్ 11న) ఇంగ్లాండ్తో పాక్ ఆడనుంది. ఫామ్ పరంగా ఇంగ్లాండ్ గొప్పగా లేదు. పాక్ భారీ విజయం సాధిస్తే మాత్రం సెమీస్ బెర్తు ఖాయమవుతుంది. ఒక వేళ ఓడినా ఛాన్స్లు ఉన్నాయి. ఇతర జట్ల ఫలితాలు, రన్రేట్ కీలకంగా మారుతుంది.
అఫ్గానిస్థాన్ (8)
సంచలన విజయాలతో వరల్డ్ కప్ సెమీస్ రేసును రసవత్తరంగా మార్చిన జట్టు అఫ్గానిస్థాన్. ఇంగ్లాండ్ను ఓడించి తర్వాత కివీస్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన అఫ్గాన్ పుంజుకున్న తీరు అద్భుతం. వరుసగా పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ను మట్టికరిపించి సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం 7 మ్యాచుల్లో నాలుగు విజయాలు, మూడు ఓటములతో 8 పాయింట్లను సాధించింది. న్యూజిలాండ్, పాకిస్థాన్తో పోలిస్తే సెమీస్ అవకాశాలు అఫ్గాన్కే ఎక్కువగా ఉన్నాయి. కానీ, తన చివరి రెండు మ్యాచ్ల్లో బలమైన జట్లతో తలపడాల్సి ఉండటమే అఫ్గాన్కు కాస్త ఇబ్బందికరం. ఆస్ట్రేలియాతో నవంబర్ 7న, దక్షిణాఫ్రికాతో నవంబర్ 10న అఫ్గాన్ ఆడనుంది. ఇప్పటికే సంచలన విజయాలు సాధించిన అఫ్గాన్ అలాంటి ప్రదర్శననే పునరావృతం చేసి ఒక్క మ్యాచ్ గెలిచినా సెమీస్కు చేరే అవకాశం ఉంది. అఫ్గాన్ చివరి రెండు మ్యాచ్లను గెలిస్తే మాత్రం పాక్, న్యూజిలాండ్ ఇంటిముఖం పట్టాల్సిందే.
పాయింట్ల పట్టికలో భారత్ తొలి స్థానాన్ని ఎవరూ ఆక్రమించలేరు. రెండు, మూడు స్థానాల కోసం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య తీవ్ర పోటీ ఉండొచ్చు. నాలుగో స్థానంలోకి ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక సెమీస్లో తొలి స్థానంలో ఉన్న జట్టు.. నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో తలపడనుంది. రెండో స్థానంలో ఉన్న జట్టు, మూడో స్థానంలో ఉన్న జట్టుతో ఆడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?