World Para Athletics Championships 2024: సుమిత్దే స్వర్ణం
ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఒకేరోజు మూడు స్వర్ణాలు మన సొంతమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ సుమిత్ ఎఫ్-64, జావెలిన్త్రోలో పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. మంగళవారం తుదిపోరులో అతడు జావెలిన్ను 69.50 మీటర్లలో విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.
మరియప్పన్, ఏక్తాలకూ పసిడి
ప్రపంచ పారా అథ్లెటిక్స్
కోబె (జపాన్): ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఒకేరోజు మూడు స్వర్ణాలు మన సొంతమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ సుమిత్ ఎఫ్-64, జావెలిన్త్రోలో పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. మంగళవారం తుదిపోరులో అతడు జావెలిన్ను 69.50 మీటర్లలో విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. మరో భారత అథ్లెట్ సందీప్ (60.41 మీ) కాంస్యం నెగ్గాడు. దులాన్ (శ్రీలంక, 66.49 మీ) రజతం సాధించాడు. గతేడాది హాంగ్జౌ పారా ఆసియాక్రీడల్లో 73.29 మీటర్లతో స్వర్ణం సాధించిన 25 ఏళ్ల సుమిత్.. ప్రపంచ రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు టోక్యో పారాలింపిక్స్ రజత విజేత తంగవేలు మరియప్పన్ సత్తా చాటాడు. టీ63, హైజంప్లో అతడు 1.88 మీటర్ల దూరం ఎగిరి స్వర్ణం సాధించాడు. అమెరికా అథ్లెట్లు ఎజ్రా (1.85 మీ), సామ్ (1.82 మీ) రజత, కాంస్య పతకాలు గెలిచారు. గత ఎనిమిదేళ్లలో పెద్ద టోర్నీల్లో మరియప్పన్ గెలిచిన తొలి పసిడి ఇదే. 2016 రియో పారాలింపిక్స్లో స్వర్ణంతో అతడు వెలుగులోకి వచ్చాడు.
మెరిసిన ఏక్తా: ఎఫ్-51 క్లబ్ త్రోలో ఏక్తా బ్యాన్ స్వర్ణంతో మెరిసింది. ఫైనల్లో ఉత్తమంగా 20.12 మీటర్ల దూరం నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. మరో భారత అమ్మాయి కాశిష్ లక్రా (14.56 మీటర్లు) రజతం, బౌసెఫ్ (12.70 మీ, అల్జీరియా) కాంస్యం సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో మెరవడం ఏక్తాకు ఇదే తొలిసారి కాదు. గతేడాది హాంగ్జౌ పారా ఆసియా క్రీడల్లో ఆమె స్వర్ణ పతకాన్ని అందుకుంది. హరియాణా ప్రభుత్వంలో సివిల్ సర్వీసెస్ అధికారిగా పని చేస్తున్న 38 ఏళ్ల ఏక్తా.. టోక్యో పారాలింపిక్స్లోనూ పోటీపడింది. వైద్య రంగం వైపు వెళ్లాలని ఆమె అనుకున్నా.. 2003లో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై వెన్నుపూస దెబ్బతినడంతో ఆమె జీవితం మారిపోయింది. వీల్ఛైర్కే పరిమితమైంది. ఆ తర్వాత పారా క్రీడలను ఎంచుకుని క్లబ్త్రోలో రాణిస్తోంది. ప్రపంచ పారా అథ్లెటిక్స్లోనూ సత్తా చాటింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు