WTC Final: నాలుగో టెస్టు డ్రా అయి.. శ్రీలంక క్లీన్స్వీప్ చేస్తే భారత్ ఇంటికే..
ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో విజయం సాధించిన టీమ్ఇండియా (Team India).. మూడో టెస్టులో ఓటమిపాలై డబ్ల్యూటీసీ ఫైనల్లో రేసులో కాస్త వెనుకబడింది.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో మొదటి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన టీమ్ఇండియా (Team India)కు మూడో టెస్టులో కంగారులు గట్టి షాకిచ్చారు. అనుహ్యమైన ఆటతీరుతో మూడో టెస్టులో గెలిచిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) బెర్తును ఖరారు చేసుకుంది. అయితే, మిగిలిన మరో ఫైనల్ బెర్తు కోసం భారత్, శ్రీలంక పోటీపడుతున్నాయి. 2021-2023 డబ్ల్యూటీసీ చక్రంలో భారత్ ఇంకో మ్యాచ్ (ఆసీస్తో నాలుగో టెస్టు) ఆడనుంది. న్యూజిలాండ్తో శ్రీలంక రెండు టెస్టుల్లో తలపడనుంది.
ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులో భారత్ విజయం సాధిస్తే.. శ్రీలంక, న్యూజిలాండ్ టెస్టు సిరీస్తో సంబంధం లేకుండా నేరుగా WTC Finalకు దూసుకెళ్తుంది. ఒకవేళ భారత్, ఆసీస్ మధ్య జరిగే నాలుగో టెస్టు డ్రా అయి.. న్యూజిలాండ్పై శ్రీలంక 2-0 తేడాతో సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే టీమ్ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతవుతాయి. కానీ, కివీస్తో లంకేయులు క్లీన్ స్వీప్ చేయకుండా అంతకంటే తక్కువ తేడాతో విజయం సాధిస్తే భారత్ ఫైనల్కు చేరుకుంటుంది. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులోనూ భారత్ ఓటమిపాలై, న్యూజిలాండ్పై సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే శ్రీలంక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ తుదిపోరుకు అర్హత సాధిస్తుంది.
ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి భారత్, ఆసీస్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. మార్చి 9 నుంచే న్యూజిలాండ్, శ్రీలంక రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. జూన్ 7-11 మధ్య లండన్లోని ది ఓవెల్ మైదానంలో (WTC Final)ను నిర్వహించనున్నారు. జూన్ 12 తేదీని రిజర్వ్ డేగా ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు