IPL 2023: టోర్నీ సగం ముగిసినా.. ఇంకా వీరి ఆట మొదలవలేదు!
ఐపీఎల్లో సగానికిపైగా మ్యాచ్లు ముగిసినా.. ఇంకా కొందరు ఆటగాళ్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అలాంటివారిలో సీనియర్లతోపాటు భారీ మొత్తం వెచ్చించి దక్కించుకున్నవారూ ఉండటం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: అనుకున్నదొకటి.. అయ్యిందొకటి అన్న చందంగా ఐపీఎల్లో (IPL) కొందరి ఆటతీరు మారింది. తమపై ఫ్రాంచైజీలు ఉంచిన నమ్మకాలను నిలబెట్టుకోలేకపోతున్నారు. అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తున్నారు. కుర్రాళ్లు జోరుగా పరుగులు రాబడుతుంటే.. భారీగా ఆశలు పెట్టుకున్న కొందరు క్రికెటర్లు మాత్రం దారుణంగా విఫలమై జట్టుకు భారంగా మారామా..? అన్నట్లుగా తయారయ్యారు. మరి ఈ సీజన్లో అలాంటి ఆటగాళ్లు ఎవరో ఓ సారి తెలుసుకుందాం..
- ఆండ్రూ రస్సెల్: అత్యంత దారుణమైన ప్రదర్శన ఇస్తున్న క్రికెటర్లలో కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ ఒకడు. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచుల్లో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కోల్కతాను విజేతగా నిలిపే ఇన్నింగ్స్ ఒక్కటీ లేదు. ఇక బౌలింగ్లోనూ గొప్పగా రాణించలేదు. 12 ఓవర్లు వేసి 73 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఎక్కువగా బౌలింగ్ చేయడానికి కూడా అలిసిపోతున్నా.. కేకేఆర్ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది. అయితే, క్రీజ్లో కుదురుకుంటే మాత్రం భారీగా హిట్టింగ్ చేయగల సమర్థత రస్సెల్ సొంతం.
- పృథ్వీ షా: టీమ్ఇండియాలోకి అతడిని ఎందుకు తీసుకోవడం లేదు..? అని అభిమానుల నుంచి బీసీసీఐకి వచ్చే ప్రశ్న పృథ్వీషా విషయంలో జరిగింది. తీరా, ఈ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడిన షా కేవలం 47 పరుగులే చేశాడంటే అతడి ఫామ్ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఓపెనర్గా వచ్చే పృథ్వీ కేవలం 8 బౌండరీలను మాత్రమే కొట్టాడు. స్ట్రైక్రేట్ (117.50) కూడా గొప్పగా ఏమీ లేదు. దీంతో అతడిని మేనేజ్మెంట్ కాస్త పక్కన పెట్టేసింది.
- మొయిన్ అలీ: సెకండ్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చే మొయిన్ అలీ అలవోకగా భారీ షాట్లు కొట్టగలడు. సీఎస్కే ప్లేఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ.. మొయిన్ అలీ నుంచి భారీ ఇన్నింగ్స్ మాత్రం రాలేదు. ఆ జట్టు ఓపెనర్లు రుతురాజ్, డేవన్ కాన్వేతోపాటు దూబె ఆడుతుండటంతో మొయిన్ అలీ రాణించకపోయినా నడిచిపోతోంది. అయితే, ఫ్లేఆఫ్స్ చేరిన తర్వాత ప్రతి మ్యాచూ కీలకం. ఈ సీజన్లో 8 మ్యాచుల్లో 7 ఇన్నింగ్స్ల్లోగాను 107 పరుగులు మాత్రమే చేశాడు.
- అంబటి రాయుడు: సీఎస్కే ఆటగాడికి ఈ సీజన్ డిజాస్టర్. ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులోకి వచ్చినా.. తన ప్రభావం పెద్దగా చూపించడం లేదు. 9 మ్యాచుల్లో 7 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. కేవఅలం 83 పరుగులు మాత్రమే సాధించాడు. అదీనూ 136.07 స్ట్రైక్రేట్తో ఆ మాత్రం రన్స్ నమోదు చేశాడు. ఇలాగే కొనసాగితే ఇదే సీజన్ అతడికి చివరిదిగా మారే అవకాశం లేకపోలేదు. మిగతా మ్యాచుల్లో రాణించాల్సిన అవసరం ఉంది.
- దినేశ్ కార్తిక్: గత సీజన్లో సూపర్ ‘ఫినిషర్’ అని అందరితో శభాష్ అనిపించుకున్న దినేశ్ కార్తిక్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గత టీ20 ప్రపంచకప్లో విఫలమై విమర్శలపాలైన డీకే మీద ఆర్సీబీ నమ్మకం ఉంచినా.. నిలబెట్టుకోవడంలో విఫలమవుతూ ఉన్నాడు. మ్యాచ్లను ముగించాల్సిన కీలక సమయంలో ఔటై తీవ్ర నిరాశపరిచాడు. ఈ సీజన్లో 8 మ్యాచుల్లో అతడు చేసిన పరుగులు 83. ఐపీఎల్ 2022 సీజన్లో 200కిపైగా స్ట్రైక్రేట్తో ఆడిన డీకే స్ట్రైక్రేట్ ఇప్పుడు మాత్రం 131.75 కావడం గమనార్హం.
- సునీల్ నరైన్: కోల్కతా జట్టులో మరో సీనియర్ ఆటగాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టుకు అండగా నిలవాల్సిన సునీల్ నరైన్లో మునుపటి వేగం లోపించింది. బౌలింగ్, బ్యాటింగ్లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. గత సీజన్లో ఓపెనర్గా వచ్చి మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. ఇప్పుడు మాత్రం భారీ షాట్లు కొట్టే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాడు. ఈ సీజన్లో 9 మ్యాచుల్లో 7 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసిన సునీల్ కేవలం 13 పరుగులను మాత్రమే చేశాడు. బౌలింగ్లోనూ కేవలం ఏడు వికెట్లను తీశాడు. మిస్టరీ స్పిన్నర్ అయిన అతడు భారీగా పరుగులు సమర్పించేశాడు.
- రియాన్ పరాగ్: తన వింత చేష్టలతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న రియాన్ పరాగ్.. ఆట మాత్రం ఘోరంగా ఉంది. ఐదు మ్యాచుల్లో 112.50 స్ట్రైక్రేట్తో 54 పరుగులను మాత్రమే చేశాడంటే అతడి ఫామ్ పరిస్థితి అర్థమైపోతుంది. గత సీజన్లో ఉన్నంత దూకుడుగా ఈసారి ఆడలేకపోయాడు. దీంతో నాలుగు మ్యాచుల్లో ఆర్ఆర్ మేనేజ్మెంట్ పక్కన పెట్టేసింది. అతడికి అవకాశాలు ఇవ్వడంపై ఆరంభంలో నెట్టింట తీవ్రమైన విమర్శలు వచ్చాయి.
- హ్యారీ బ్రూక్: రూ. 13.25 కోట్లను వెచ్చించి మరీ కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ కేవలం ఒక్క మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. మిగిలిన మ్యాచుల్లో అతడి గణాంకాలను చూస్తే దారుణంగా ఉంది. కోల్కతాపై సరిగ్గా శతకం బాదిన బ్రూక్.. మిగతా ఏడు మ్యాచుల్లో చేసిన పరుగులు కేవలం 63 మాత్రమే. మిడిలార్డర్లో పంపించినా తన ప్రదర్శనలో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో అతడికి భారీ మొత్తం వృథా అనే కామెంట్లు వచ్చాయి. మీమ్స్ తెగ హడావుడి చేసేశాయి.
- వీరు ముగ్గురు కూడానూ: రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, ఐదెన్ మార్క్రమ్ నుంచి కూడా సరైన ప్రదర్శన రాలేదు. గతేడాది దూకుడును త్రిపాఠి కొనసాగించలేకపోతున్నాడు. ఎస్ఆర్హెచ్ తరఫున ఇప్పటి వరకు త్రిపాఠినే (170) టాప్ స్కోరర్. కానీ, బ్యాటింగ్ ప్రదర్శన గొప్పగా లేదు. కెప్టెన్ మార్క్రమ్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఏడు మ్యాచుల్లో 132 పరుగులను మాత్రమే చేశాడు. మయాంక్ అగర్వాల్ (169 పరుగులు) తన సీనియరిటీకి తగ్గ బ్యాటింగ్ చేయడం లేదు. పవర్ప్లేలోనూ మరీ నెమ్మదిగా ఆడేస్తూ విమర్శలపాలవుతున్నాడు.
- వృద్ధిమాన్ సాహా: గతేడాది ఓపెనర్గా వీరవిహారం చేసిన సీనియర్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా ఈసారి మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోతున్నాడు. మరోవైపు శుభ్మన్ గిల్ దూకుడుగా ఆడేస్తుంటే.. సాహా వెనుకబడిపోయాడు. ఈ సీజన్లో 8 మ్యాచులు ఆడిన సాహా 151 పరుగులను మాత్రమే చేశాడు. స్ట్రైక్రేట్ కూడా గొప్పగా లేదు. ఓపెన్ర్గా వచ్చే సాహా 130.17 స్ట్రైక్రేట్తోనే ఆడటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్