WPL: అదరగొట్టిన ఆర్సీబీ.. 113 పరుగులకే ముంబయి ఆలౌట్‌

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. 

Published : 12 Mar 2024 21:19 IST

దిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. ఎలిస్‌ పెర్రీ విజృంభించి ఆరు వికెట్లు తీసిన వేళ ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే 113 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్లు సజన(30), హెలీ మ్యాథ్యూస్‌(26) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. బెంగళూరు బౌలర్లలో ఎలిస్‌ పెర్రీ 6 వికెట్లు పడగొట్టింది. సోఫీ మోలినిక్స్‌, సోఫీ డివైన్‌, ఆశ, శ్రేయాంక ఒక్కో వికెట్‌ తీశారు. కీలక మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించాలంటే 114 పరుగులు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని