Cricket News: దూకుడే యశస్వి బలం.. క్రికెట్కు విండీస్ స్టార్ గుడ్బై!
టీమ్ఇండియా (Team India) యువ సంచలనం యశస్వి జైస్వాల్పై కేకేఆర్ సహాయక కోచ్ అభిషేక్ నాయర్ ప్రశంసలు కురిపించాడు. వెస్టిండీస్ స్టార్ ఆటగాడు డారెన్ బ్రావో క్రికెట్కు వీడ్కోలు పలికేశాడు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా (Team India) యువ సంచలనం యశస్వి జైస్వాల్పై కేకేఆర్ సహాయక కోచ్ అభిషేక్ నాయర్ ప్రశంసలు కురిపించాడు. వెస్టిండీస్ స్టార్ ఆటగాడు డారెన్ బ్రావో క్రికెట్కు వీడ్కోలు పలికేశాడు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
యశస్వి.. నువ్వు అలాగే ఆడేయాలి: అభిషేక్ నాయర్
ఆసీస్తో టీ20 సిరీస్ తొలి మ్యాచ్లో భారీ లక్ష్యం ఉన్నా సరే టీమ్ఇండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ మాత్రం ఎలాంటి బెదురు లేకుండా ఆడాడు. కేవలం 8 బంతుల్లోనే 21 పరుగులు సాధించాడు. త్వరగానే పెవిలియన్కు చేరినా.. దూకుడుగా ఆడటమే అతడి బలమని కోల్కతా నైట్రైడర్స్ సహాయ కోచ్ అభిషేక్ నాయర్ ప్రశంసించాడు. ఆడిన ఎనిమిది బంతుల్లోనే రెండు సిక్స్లు, రెండు ఫోర్లు కొట్టేడయం అభినందనీయమని వ్యాఖ్యానించాడు. ‘‘ ఇదే జైస్వాల్ అసలైన బలం. క్రీజ్లో కుదురుకోవడానికి మరీ ఎక్కువ సమయం తీసుకోడు. స్వేచ్ఛగా పవర్ప్లేలో పరగులు రాబట్టేస్తాడు. దేశవాళీ క్రికెట్లోనూ ముంబయి తరఫున ఇదే ఆటతీరు ప్రదర్శించాడు. ఇప్పుడు ఆడుతున్న ఆటతీరునే మున్ముందు కొనసాగించాలి’’ అని నాయర్ అన్నాడు.
కొత్తతరం కోసం వైదొలుగుతున్నా: బ్రావో
వెస్టిండీస్ స్టార్ ఆటగాడు బ్రావో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికేశాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు ఎంపిక చేయకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. విండీస్ ప్రపంచకప్నకు అర్హత సాధించని విషయం తెలిసిందే. తన రిటైర్మెంట్పై బ్రావో సోషల్ మీడియా వేదికగా ప్రకటన వెలువరించాడు. ‘‘భవిష్యత్తు గురించి ఇంకా ఏం ఆలోచించలేదు. దాని కోసం మరికొంత సమయం తీసుకుని నిర్ణయం వెల్లడిస్తా. జాతీయ జట్టు కోసం శక్తివంచన లేకుండా కష్టపడ్డా. మేనేజ్మెంట్ నుంచి సరైన సమాచారం లేకపోవడంతో అంధకారంలోకి నెట్టేసినట్లు అనిపించింది. మూడు ఫార్మాట్లలో దాదాపు 45 మంది ఆటగాళ్లు విండీస్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ, అందులో నాకు చోటు దక్కలేదు. దేశవాళీ టోర్నీల్లో అత్యుత్తమంగా ఆడి భారీగా పరుగులు చేసినా ఫలితం లేదు. దీంతో క్రికెట్ నుంచి వైదొలగడమే మంచిదనే నిర్ణయానికి వచ్చా. భవిష్యత్తు తరాల కోసం స్థానం ఉంచాల్సిన అవసరం ఉంది. నా డ్రీమ్లో ఇప్పటి వరకు బతికేశా. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని బ్రావో పోస్టు పెట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..