Yashasvi Jaiswal: యశస్వి హాఫ్ సెంచరీ.. మరోసారి రికార్డుల మోత!
విండీస్తో జరుగుతున్న రెండో టెస్టు (WI vs IND) మ్యాచ్లో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్లు యశస్వి, రోహిత్తోపాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అర్ధశతకాలు సాధించారు. ప్రస్తుతం తొలి రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 288/4 స్కోరుతో కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (57) తన ఫామ్ను కొనసాగిస్తూ విండీస్తో రెండో టెస్టులోనూ (WI vs IND) హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో ఓపెనర్గా తొలి రెండు టెస్టు ఇన్నింగ్స్ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్గా అవతరించాడు. యశస్వి తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 171 పరుగులు, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 57 పరుగులు చేశాడు. దీంతో మొత్తం 228 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (303) అందరి కంటే ముందున్నాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ రోహిత్దే అగ్రస్థానం కాగా.. సిడ్నీ బార్న్స్ (265), డేవిడ్ లాయిడ్ (260), బిల్ వుడ్ఫుల్ (258), నిషాన్ మధుసంక (234) యశస్వి కంటే ముందున్నారు. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా (224), గ్రేమ్ స్మిత్ (224) ఉండటం గమనార్హం.
భారత్ తరఫున తొలి రెండు టెస్టు ఇన్నింగ్స్ల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్గా యశస్వి జైస్వాల్ (Yashsvi Jaiswal) రికార్డు సృష్టించాడు. యశస్వి కంటే ముందు రోహిత్ శర్మ (303), సౌరభ్ గంగూలీ (267).. ఆ తర్వాత శిఖర్ ధావన్ (210) ఉన్నారు. అయితే, డెబ్యూ చేసిన తొలి ఇన్నింగ్స్లో మాత్రం అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా శిఖర్ ధావన్ (187 పరుగులు) కొనసాగుతున్నాడు. విండీస్తో రెండో టెస్టులోనూ రోహిత్ (80) హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో ఓపెనర్గా టెస్టు ఫార్మాట్లో 2000 పరుగుల మైలురాయిని అతడు దాటేశాడు.
మరి కొన్ని విశేషాలు
- యశస్వి జైస్వాల్తో కలిసి రోహిత్ రెండోసారి వంద పరుగుల (139) భాగస్వామ్యం నిర్మించాడు. విండీస్పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా పర్యాటక జట్టు ఓపెనింగ్ బ్యాటర్లు సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో రోహిత్ - యశస్వి జోడీ మూడో స్థానం దక్కించుకుంది.
- ఇంగ్లాండ్ ఆటగాళ్లు బాయ్కాట్ - డెన్నిస్ అమిస్ (1974లో) 229 పరుగులు, ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆర్థూర్ -మెక్డొనాల్డ్ (1955లో) 191 పరుగులు జోడించారు.
- నాలుగోస్థానంలో అత్యధిక పరుగులు సాధించిన ఐదో బ్యాటర్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం విండీస్తో రెండో టెస్టులో విరాట్ (87*) హాఫ్ సెంచరీ చేసి కొనసాగుతున్నాడు. దీంతో ఇప్పటి వరకు 7,097 పరుగులు చేసినట్లయింది. ఈ జాబితాలో సచిన్ (13,492 పరుగులు), మహేల జయవర్థనె (9,509), కలిస్ (9,033), బ్రియాన్ లారా (7,535) ఉన్నారు.
- అంతర్జాతీయ క్రికెట్లో పాతిక వేలకుపైగా పరుగులు చేసిన ఐదో బ్యాటర్గానూ విరాట్ నిలిచాడు. కలిస్ను (25,534) అధిగమించిన విరాట్ 25,548 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ లిస్ట్లోనూ సచిన్దే అగ్రస్థానం. మొత్తం 34,357 పరుగులతో అతడు టాపర్గా ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..