Yashasvi Jaiswal: యశస్వి హాఫ్ సెంచరీ.. మరోసారి రికార్డుల మోత!
విండీస్తో జరుగుతున్న రెండో టెస్టు (WI vs IND) మ్యాచ్లో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్లు యశస్వి, రోహిత్తోపాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అర్ధశతకాలు సాధించారు. ప్రస్తుతం తొలి రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 288/4 స్కోరుతో కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (57) తన ఫామ్ను కొనసాగిస్తూ విండీస్తో రెండో టెస్టులోనూ (WI vs IND) హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో ఓపెనర్గా తొలి రెండు టెస్టు ఇన్నింగ్స్ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్గా అవతరించాడు. యశస్వి తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 171 పరుగులు, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 57 పరుగులు చేశాడు. దీంతో మొత్తం 228 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (303) అందరి కంటే ముందున్నాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ రోహిత్దే అగ్రస్థానం కాగా.. సిడ్నీ బార్న్స్ (265), డేవిడ్ లాయిడ్ (260), బిల్ వుడ్ఫుల్ (258), నిషాన్ మధుసంక (234) యశస్వి కంటే ముందున్నారు. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా (224), గ్రేమ్ స్మిత్ (224) ఉండటం గమనార్హం.
భారత్ తరఫున తొలి రెండు టెస్టు ఇన్నింగ్స్ల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్గా యశస్వి జైస్వాల్ (Yashsvi Jaiswal) రికార్డు సృష్టించాడు. యశస్వి కంటే ముందు రోహిత్ శర్మ (303), సౌరభ్ గంగూలీ (267).. ఆ తర్వాత శిఖర్ ధావన్ (210) ఉన్నారు. అయితే, డెబ్యూ చేసిన తొలి ఇన్నింగ్స్లో మాత్రం అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా శిఖర్ ధావన్ (187 పరుగులు) కొనసాగుతున్నాడు. విండీస్తో రెండో టెస్టులోనూ రోహిత్ (80) హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో ఓపెనర్గా టెస్టు ఫార్మాట్లో 2000 పరుగుల మైలురాయిని అతడు దాటేశాడు.
మరి కొన్ని విశేషాలు
- యశస్వి జైస్వాల్తో కలిసి రోహిత్ రెండోసారి వంద పరుగుల (139) భాగస్వామ్యం నిర్మించాడు. విండీస్పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా పర్యాటక జట్టు ఓపెనింగ్ బ్యాటర్లు సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో రోహిత్ - యశస్వి జోడీ మూడో స్థానం దక్కించుకుంది.
- ఇంగ్లాండ్ ఆటగాళ్లు బాయ్కాట్ - డెన్నిస్ అమిస్ (1974లో) 229 పరుగులు, ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆర్థూర్ -మెక్డొనాల్డ్ (1955లో) 191 పరుగులు జోడించారు.
- నాలుగోస్థానంలో అత్యధిక పరుగులు సాధించిన ఐదో బ్యాటర్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం విండీస్తో రెండో టెస్టులో విరాట్ (87*) హాఫ్ సెంచరీ చేసి కొనసాగుతున్నాడు. దీంతో ఇప్పటి వరకు 7,097 పరుగులు చేసినట్లయింది. ఈ జాబితాలో సచిన్ (13,492 పరుగులు), మహేల జయవర్థనె (9,509), కలిస్ (9,033), బ్రియాన్ లారా (7,535) ఉన్నారు.
- అంతర్జాతీయ క్రికెట్లో పాతిక వేలకుపైగా పరుగులు చేసిన ఐదో బ్యాటర్గానూ విరాట్ నిలిచాడు. కలిస్ను (25,534) అధిగమించిన విరాట్ 25,548 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ లిస్ట్లోనూ సచిన్దే అగ్రస్థానం. మొత్తం 34,357 పరుగులతో అతడు టాపర్గా ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు