Yashasvi Jaiswal: ఉప్పల్ టెస్టులో మిస్.. ఈసారి సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్
ఇంగ్లాండ్తో రెండో టెస్టు మ్యాచ్లో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సెంచరీతో అదరగొట్టేశాడు. తొలి టెస్టులో కొద్దిలో మిస్ చేసుకున్న శతకాన్ని ఈసారి అందుకొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20ల్లో దూకుడైన ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) టెస్టుల్లోనూ అదరగొట్టేస్తున్నాడు. కేవలం ఆరు టెస్టుల్లోనే రెండు శతకాలు బాదాడు. తాజాగా ఇంగ్లాండ్తో రెండో టెస్టు మ్యాచ్లో సెంచరీ చేశాడు. అంతకుముందు ఉప్పల్ మ్యాచ్లో శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇప్పుడు వైజాగ్ టెస్టులో ఆ పొరపాట్లు పునరావృతం చేయకుండా.. మూడంకెల మార్క్ను అందుకున్నాడు. ఆరంభంలో నిలకడగా ఆడిన యశస్వి ఆ తర్వాత జోరు పెంచి 151 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో జైస్వాల్ (80) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి మొదటి వికెట్కు 80 పరుగులు జోడించాడు. సెంచరీకి దగ్గర్లో తొందరపాటుతో వికెట్ సమర్పించుకున్నాడు. ఇంగ్లాండ్ పార్ట్టైమ్ స్పిన్నర్ జోరూట్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించాడు. కానీ, బౌలర్కే రిటర్న్ క్యాచ్ వెళ్లడంతో యశస్వి నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇప్పుడు రెండో టెస్టులో మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
మరికొన్ని విశేషాలు..
- ఇంగ్లాండ్తో జరుగుతున్న ఈ సిరీస్లో ఇప్పటివరకు భారత్ తరఫున తొలి శతకం ఇదే.
- యశస్వి కెరీర్లో ఇది రెండో శతకం కాగా.. స్వదేశంలో మొదటిది. అంతకుముందు విండీస్పై భారీ సెంచరీ సాధించాడు.
- ఇంగ్లాండ్పై స్వదేశంలో సెంచరీ చేసిన 15వ భారత ఓపెనర్ యశస్వి. చివరిసారిగా రోహిత్ శర్మ 2021లో శతకం సాధించాడు.
- 23 ఏళ్లలోపే.. స్వదేశీ, విదేశీ పిచ్ల్లో టెస్టు సెంచరీలు చేసిన నాలుగో భారత బ్యాటర్ యశస్వి. అంతకుముందు సచిన్, రవిశాస్త్రి, వినోద్ కాంబ్లి ఈ ఘనతను సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు