Yashasvi Jaiswal: అది నా తప్పే.. రుతురాజ్కు ‘సారీ’ చెప్పా: యశస్వి జైస్వాల్
భారత బ్యాటింగ్ యువ సంచలనం యశస్వి జైస్వాల్.. తన సహచరుడు రుతురాజ్కు సారీ చెప్పాడట. ఇక రెండో టీ20లో అతడు ఓ రికార్డును బద్దలు కొట్టాడు.
ఇంటర్నెట్డెస్క్: తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20లో భారత్కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చిన యువ సంచలనం యశస్వి జైస్వాల్.. తన పార్ట్నర్ రుతురాజ్కు సారీ చెప్పాడట. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం ఇంటర్వ్యూలో స్వయంగా జైస్వాలే వెల్లడించాడు. వైజాగ్లో తొలి టీ20లో జరిగిన రనౌట్ ఘటనను అతడు గుర్తు చేసుకుంటూ..‘‘గత మ్యాచ్లో రనౌట్ నా తప్పే. అందుకు నేను రుతు భాయ్కు సారీ చెప్పాను. నా తప్పును అంగీకరించాను. అతడు చాలా మంచి వ్యక్తి.. జాగ్రత్తగా ఉంటాడు’’ అని యశస్వి వెల్లడించాడు.
ఆస్ట్రేలియాపై టీమ్ఇండియా ఘన విజయం
ఇక రెండో టీ20లో మెరుపు ఇన్నింగ్స్ విషయంలో తనకు కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ లక్ష్మణ్ నుంచి సంపూర్ణ మద్దతు లభించిందని జైస్వాల్ వివరించాడు. ‘‘మైదానంలో స్వేచ్ఛగా ఆడు అని మ్యాచ్కు ముందు సూర్య భాయ్, కోచ్ లక్ష్మణ్ నాకు చెప్పారు. దీంతో నేనేంటో మైదానంలో చూపించాలనుకున్నాను. నామటుకు నేను ఆటను మెరుగుపర్చుకోవాలని అనుకుంటాను. అంతకు మించి మరేదీ ఆలోచించను. నేను ఇప్పటికీ ఆట నేర్చుకుంటున్నాను. అన్ని రకాల షాట్లను మరింత సానబట్టాలని భావిస్తున్నా. ఈ దశలో మానసిక దృఢత్వం చాలా ముఖ్యం. నేను ఆ దిశగా పనిచేస్తున్నాను’’ అని జైస్వాల్ తన ప్రణాళికను వివరించాడు. ఈ మ్యాచ్ తనకు పూర్తిగా ప్రత్యేకమైందని పేర్కొన్నాడు. నిర్భయంగా షాట్లు కొట్టానని చెప్పాడు. అంతేకాదు.. తాను షాట్ల ఎంపిక విషయంలో కూడా చాలా స్పష్టంగా ఉన్నట్లు వెల్లడించాడు.
పవర్ ప్లేలో రికార్డు స్థాయి పరుగులు..
భారత్-ఆసీస్ మధ్య జరిగిన రెండో టీ20లో యశస్వి జైస్వాల్ కేవలం 25 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 53 పరుగులు చేశాడు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో పవర్ప్లేలోనే అర్ధ శతకం సాధించిన మూడో భారత బ్యాటర్గా నిలిచాడు. గతంలో ఈ జాబితాలో రోహిత్(50), కేఎల్ రాహుల్ (50) ఉన్నారు. పవర్ ప్లేలో భారత బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు కూడా యశస్వి చేసిన 53 కావడం విశేషం. ఈ మ్యాచ్లో ఇషాన్ (52), రుతురాజ్ (58), రింకుసింగ్ మెరుపు వేగంతో 9 బంతుల్లో 31 పరుగులు చేయడంతో భారత్ 235 స్కోర్ చేసింది. బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీయడంతో భారత్ విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!