Yashasvi Jaiswal: ఇంగ్లాండ్పై డబుల్ సెంచరీ.. ఐసీసీ ర్యాంకుల్లో దూసుకొచ్చిన యశస్వి
పరుగులు చేస్తే ఆటోమేటిక్గా ర్యాంకుల్లోనూ మెరుగుదల కనిపిస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ యశస్వి జైస్వాల్.
ఇంటర్నెట్ డెస్క్: అద్భుత ఫామ్లో ఉన్న భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఐసీసీ ర్యాంకుల్లోనూ దూసుకొచ్చాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్పై డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో ఇది రెండో ద్విశతకం. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో యశస్వి (699 పాయింట్లు) ఏకంగా 14 ర్యాంకులు ముందుకొచ్చి బ్యాటింగ్ విభాగంలో 15వ స్థానానికి చేరాడు. 22 ఏళ్ల యశస్వి జైస్వాల్ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ను అందుకొన్నాడు. బ్యాటింగ్ జాబితాలో విరాట్ కోహ్లీ (752) ఒక్కడే టాప్-10లో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాపై వరుసగా సెంచరీలు చేసిన న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ (893) అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇంగ్లాండ్తో రాజ్కోట్ టెస్టులో సెంచరీ చేసిన రవీంద్ర జడేజా కూడా బ్యాటింగ్ ర్యాంకుల్లో ఏడు స్థానాలను మెరుగుపర్చుకుని 34వ ర్యాంక్కు చేరాడు. బౌలింగ్ విభాగంలోనూ మూడు స్థానాలు ముందుకొచ్చి ఆరో ర్యాంక్ సాధించాడు. ఈ జాబితాలో భారత్ స్టార్బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా (876), రవిచంద్రన్ అశ్విన్ (839) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (469)దే అగ్రస్థానం. రెండో ర్యాంకులో అశ్విన్ (330), నాలుగో స్థానంలో అక్షర్ పటేల్ (281) ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.