Year Ender 2022: భారత క్రీడావని 2022.. క్రికెట్లో డీలా.. మిగతావన్నీ భళా!
క్రీడల్లో గెలుపోటములు సహజం. అయితే భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనే చేశారు. క్రికెట్లో కాస్త నిరాశకు గురిచేసినప్పటికీ.. ఇతర ఆటల్లో మాత్రం భారత కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.
ఇంటర్నెట్ డెస్క్: క్రీడా భారతావనికి 2022 సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు దక్కాయి. అద్భుతాలు.. ఘోర పరాభవాలు.. రికార్డులు, చరిత్రల్లో నిలిచే విజయాలు.. కీలక నిర్ణయాలు.. ఇలా అన్ని రకాలుగా కాలం గడిచిపోయింది. క్రికెట్, హాకీ, బాక్సింగ్, చెస్, జావెలిన్ త్రో, బ్యాడ్మింటన్.. ఇలా కీలక ఆటల్లో మనవాళ్లు సత్తా చాటారు. మరి ఏడాది ముగుస్తున్న క్రమంలో సాధించిన ఘనతలు.. మూటగట్టుకొన్న ఓటములను ఓసారి తెలుసుకొందాం..
16 ఏళ్ల తర్వాత: ఒకప్పుడు హాకీ అంటే భారత్ అనేలా ఉండేది. కానీ గత కొంతకాలంగా పరిస్థితి మారిపోయింది. అయితే బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మహిళా హాకీ జట్టు రజత పతకం సొంతం చేసుకొంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా ఖాతాలో పతకం చేరడం గమనార్హం.
పెద్ద టోర్నీల్లో డీలా: భారత్లో భారీ సంఖ్యలో అభిమానులు కలిగిన క్రీడ క్రికెట్. అయితే టీమ్ఇండియాకు మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ద్వైపాక్షిక సిరీసుల్లో అదరగొట్టిన రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్.. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ల్లో మాత్రం చేతులెత్తేసింది. మహిళల జట్టు మాత్రం కామన్వెల్త్ గేమ్స్లో రజతం సాధించింది.
శరత్ కమల్ అద్భుత పోరాటం: 40 ఏళ్ల ఆచంట శరత్ కమల్ కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో అద్భుతం చేశాడు. బంగారు పతకం గెలిచిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అలాగే టీటీలో మూడు స్వర్ణాలను భారత క్రీడాకారులు గెలిచారు. భారీ ఆశలు పెట్టుకొన్న మనికా బాత్రా మాత్రం కామన్వెల్త్లో విఫలమైనప్పటికీ.. ఆ తర్వాత జరిగిన ఆసియా కప్లో మాత్రం పతకం గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
థామస్ కప్ ఛాంపియన్: క్రికెట్ తర్వాత అత్యధిక ప్రజాదరణ కలిగిన గేమ్ బ్యాడ్మింటన్. ఈ ఏడాది జరిగిన థామస్ కప్ బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్ పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. మొదటిసారిగా థామస్ కప్ను సొంతం చేసుకొంది. ఇండోనేషియాపై ఫైనల్లో టీమ్ఇండియా విజయం సాధించింది.
తెలంగాణ యువతి ఛాంపియన్: అత్యుత్తమ బాక్సర్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది మేరీ కోమ్. అయితే ఈసారి మాత్రం సంచలన విజయాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన నిఖత్ జరీన్ తెలంగాణకు చెందిన బాక్సర్ కావడం విశేషం. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ను సొంతం చేసుకొన్న నిఖత్.. తాజాగా జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ (50 కేజీల విభాగం)లోనూ ఛాంపియన్గా నిలిచింది.
నీరజ్కు రజతం : జావెలిన్ త్రో విభాగంలో టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ఖాతాలో రజత పతకం పడింది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో రజత పతకం గెలిచి చరిత్ర సృష్టించాడు. తొలిసారి ఛాంపియన్షిప్స్లో పతకం గెలిచిన భారత జావెలిన్ త్రో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అలాగే డైమండ్ లీగ్లో గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్గానూ నిలిచాడు.
సంబరంగా చెస్ ఒలింపియాడ్: మొదటిసారిగా చెస్ ఒలింపియాడ్ను నిర్వహించే అవకాశం భారత్కు దక్కింది. 44వ ఎడిషన్ చెస్ ఒలింపియాడ్లో దాదాపు 346 దేశాల నుంచి 350కిపైగా జట్లు పాల్గొన్నాయి. 98 ఏళ్ల చరిత్ర కలిగిన చెస్ ఒలింపియాడ్ పోటీలు చెన్నై వేదికగా తొలిసారి భారత్లో జరిగాయి.
కామన్వెల్త్ గేమ్స్: బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఆర్చరీ, షూటింగ్ వంటి క్రీడలు లేకపోయినప్పటికీ.. పతకాలను సాధించడంలో మాత్రం టీమ్ఇండియా క్రీడాకారులు వెనుకడుగు వేయలేదు. మొత్తం 61 పతకాలను సాధించారు. అందులో 22 గోల్డ్, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఫోర్బ్స్ జాబితాలోకి పీవీ సింధు: ఒలింపిక్స్ పతకాల విజేత, స్టార్ షట్లర్ పీవీ సింధు అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. ఈ ఏడాది తన కెరీర్లో తొలిసారి సూపర్ 500 టైటిల్ను గెలిచిన పీవీ సింధు.. తాజాగా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకొంది. టాప్ 25 క్రీడాకారిణుల్లో సింధు 12వ స్థానంలో నిలిచింది. దాదాపు రూ.58 కోట్ల సంపాదనను ఆర్జించినట్లు ఫోర్బ్స్ పేర్కొంది.
అరంగేట్రంలోనే కప్ కొట్టేసి..: అత్యంత రిచెస్ట్ టీ20 లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). అడుగు పెట్టిన తొలి ఏడాదే ఐపీఎల్ 2022 సీజన్ కప్ను గుజరాత్ టైటాన్స్ ఎగరేసుకొని పోయింది. అలాగే ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో టీమ్ఇండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (రూ.15.25 కోట్లు) టాపర్గా నిలవగా.. డిసెంబర్ 23న జరిగిన మినీ వేలంలో సామ్ కరన్ (రూ. 18.50 కోట్లు) రికార్డు సృష్టించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు