Yuvraj Singh: పంత్ ఉంటేనే బాగుంటుంది
టీ20 ప్రపంచకప్లో సంజు శాంసన్ కన్నా రిషబ్ పంతే వికెట్ కీపర్గా ఉంటే బాగుంటుందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు.
దుబాయ్: టీ20 ప్రపంచకప్లో సంజు శాంసన్ కన్నా రిషబ్ పంతే వికెట్ కీపర్గా ఉంటే బాగుంటుందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ప్రపంచకప్లో సత్తా చాటుతాడనే విశ్వాసం అతడు వ్యక్తం చేశాడు. ‘‘నేనైతే వికెట్కీపర్గా రిషబ్నే ఎంచుకుంటా. సంజు కూడా గొప్ప ఫామ్లో ఉన్నాడు. కానీ రిషబ్ ఎడమచేతి వాటం బ్యాటర్. అతడిలో భారత్కు విజయాలను అందించే సత్తా అపారంగా ఉంది. గతంలో అలా గెలిపించాడు కూడా’’ అని యువరాజ్ చెప్పాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు ఐపీఎల్లో సత్తా చాటినా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య మాత్రం లయను అందుకోలేకపోయాడు. కానీ హార్దిక్ టీ20 ప్రపంచకప్లో బాగానే ఆడతాడని యువి భావిస్తున్నాడు. ‘‘మంచి విషయమేంటంటే.. జట్టు ఎంపికలో ముందు అంతర్జాతీయ క్రికెట్లో ప్రదర్శనను, ఆ తర్వాతే ఐపీఎల్లో ఆటను పరిగణనలోకి తీసుకున్నారు. కేవలం ఐపీఎల్ ఫామ్నే లెక్కలోకి తీసుకోలేదు. ఐపీఎల్లో హార్దిక్ బాగా ఆడలేదు. కానీ భారత జట్టు తరఫున ఎలాంటి ప్రదర్శన చేశాడో చూడండి. అతడు జట్టులో ఉండడం ముఖ్యం. హార్దిక్ బౌలింగ్ చాలా ముఖ్యంగా కాబోతోంది. అతడి ఫిట్నెస్ కూడా. ప్రపంచకప్లో అతడు ప్రత్యేక ప్రదర్శన చేస్తాడని అనిపిస్తోంది’’ అని యువరాజ్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చివరిది వరుణుడికి
అనుకున్నదే జరిగింది. గ్రూప్- ఎ లో భారత్ చివరి మ్యాచ్ను వరుణుడు ఆడనివ్వలేదు. కీలకమైన సూపర్- 8 పోరుకు ముందు అన్ని విభాగాల్లోనూ మరోసారి సత్తాచాటాలని చూసిన టీమ్ఇండియా ఆశ తీరలేదు. -
చిన్నోళ్లు దమ్మున్నోళ్లు
ఎవరైనా ఊహించారా.. టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ను వెనక్కినెట్టి అమెరికా సూపర్- 8కు చేరుతుందని! ఎవరైనా అనుకున్నారా.. ప్రపంచకప్ల్లో అత్యంత నిలకడగా ఆడే న్యూజిలాండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుందని! కానీ ఇవి జరిగాయి. -
నేపాల్ ఒక్క పరుగు తేడాతో..
టీ20 ప్రపంచకప్లో మరో సంచలనం కొద్దిలో తప్పింది. కూనల చేతిలో షాక్ తిన్న జట్ల జాబితాలో దక్షిణాఫ్రికా కూడా చేరేదే. నేపాల్పై ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో అతికష్టంగా గట్టెక్కింది. -
కివీస్ తొలి గెలుపు
ఇప్పటికే టీ20 ప్రపంచకప్ సూపర్-8కు దూరమైన న్యూజిలాండ్ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. శనివారం గ్రూప్-సి పోరులో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఉగాండాను చిత్తు చేసింది. -
జర్మనీ ఘన బోణీ
యూరో కప్ను ఆతిథ్య జర్మనీ విజయంతో మొదలెట్టింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్- ఎ మ్యాచ్లో ఆ జట్టు 5-1 తేడాతో స్కాట్లాండ్ను చిత్తుచేసింది. -
ఏ జట్టునైనా ఓడించగలం
పూర్తి స్థాయిలో ఆడితే ఏ జట్టునైనా ఓడించగలమని అమెరికా వైస్ కెప్టెన్ అరోన్ జోన్స్ అన్నాడు. ‘‘సూపర్-8 సవాల్కు సిద్ధంగా ఉన్నాం. రెండో రౌండ్ చేరడం మాకో పెద్ద ఘనత. -
గంభీర్ సమర్థుడే కానీ..
టీమ్ఇండియా కోచ్ పదవి రేసులో గౌతమ్ గంభీర్ ముందున్నాడు. మెంటార్గా ఇటీవల కోల్కతా నైట్రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
సంక్షిప్త వార్తలు(5)
జాతీయ జట్టు తరపున ఇదే తనకు చివరి టీ20 ప్రపంచకప్ అని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ప్రకటించాడు. కానీ కివీస్ జట్టుతో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే విషయంపై మాత్రం అతను స్పష్టత ఇవ్వలేదు. -
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ 2024లో పాకిస్థాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. దీంతో పాక్ జట్టుపై సొంత దేశం ఆటగాళ్ల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.