మన చిప్.. మన గర్వ కారణం!

సెమీకండక్టర్ను పరీక్షిస్తున్న యంత్రం
సెమీకండక్టర్ చిప్ తయారీలో మనదేశం గొప్ప మైలురాయిని చేరుకుంది. ఒకప్పుడు తైవాన్, బ్రెజిల్ వంటి దేశాల నుంచి చిప్స్ దిగుమతి చేసుకునేవాళ్లం. ఇప్పుడు దేశీయంగా తయారు చేసుకునే స్థితికి చేరుకున్నాం. తాజాగా ధన్బాద్లోని ఐఐటీ ఐఎస్ఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ‘ఏపీఈసీ 1’ చిప్ రూపొందించి సంచలనం సృష్టించింది. దీనికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ రాజీవ్ రంజన్తో ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా ముచ్చటింది. మనకు గర్వకారణంగా నిలుస్తున్న ఈ చిప్ కథ, ప్రత్యేకతలేంటో చూద్దాం.
స్మార్ట్గ్లాసెస్ కోసం
- ఏపీఈసీ 1 చిప్ను చూపు కోల్పోయినవారికి ఉపయోగపడే స్మార్ట్గ్లాసెస్ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. డేటా నిల్వ, తక్కువ విద్యుత్తు, అత్యధిక సామర్థ్యం అవసరమైన అప్లికేషన్లలో ఇది ఉపయోగపడుతుంది. సీపీయూలు, ఎన్ఎం ఆర్కిటెక్చర్, రక్షణ వ్యవస్థల్లోనూ ఉపయోగించుకోవచ్చు. స్వల్ప ఆర్కిటెక్చర్ మార్పులతో వేర్వేరు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు. ప్రయోగ్మాతక చిప్ను మరింత మెరుగుపరచటానికీ ప్రయత్నిస్తున్నారు. ఇందులో బ్రెయిన్ న్యూరోస్ట్రక్చర్ మెరుగుపరచటానికి, అదనపు సామర్థ్యాలను జోడించటానికీ పరిశోధన జరుగుతోంది.
 
2023లో మొదలు
- చిప్ రూపకల్పన ప్రక్రియ 2023లో మొదలైంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్ట్ కోసం ప్రాథమికంగా రూ.1.12 కోట్లు కేటాయించింది. చిప్ డిజైన్ కోసం మొదట్లో చాలా ఇబ్బందులే ఎదురయ్యాయి. ఎన్నో విఫల ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు సర్క్యూట్ను డిజైన్ చేశారు. దీన్ని మొహాలీలోని సెమీకండక్టర్ ల్యాబొరేటరీకి పంపించారు. అక్కడ దాన్ని తయారుచేశాక ఐఐటీ ఐఎస్ఎంకు అప్పగించారు. తక్కువ విద్యుత్తును వాడుకునే దీన్ని మెమ్రిస్టర్ ఎమ్యులేటర్గా పిలుచుకుంటున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకూ పనిచేస్తుంది.
 

చిప్ డిజైన్ నమూనా
స్వావలంబన దిశగా
ఇటీవల దిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో ఏపీఈసీ 1 చిప్ ఎంతగానో ఆకట్టుకుంది. సెమీకండక్టర్ చిప్స్ టెక్నాలజీలో మనదేశ పురోగతిని ఇది  చాటి చెప్పింది. అంతేకాదు టారిఫ్ యుద్ధాల వంటి అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో స్వాలంబన దిశగా మరో ముందడుగుకు నిదర్శనంగా నిలిచింది. దిగుమతుల మీద ఆధారపడటాన్ని తగ్గించటమే కాదు, సెమీకండక్టర్ పరిశ్రమలో మన ఉనికిని బలోపేతం చేయనుంది.  
- ఈటీవీ భారత్ టెక్ టీమ్

‘‘చిప్ తయారీ మాకెంతో గర్వకారణమైన విషయం. ఐఐటీ ఐఎస్ఎం గతంలో డిజైన్ చేసిన చిప్స్ బెల్జియంలో తయారయ్యేవి. తాజా ఏపీఈసీ 1 చిప్ పూర్తిగా మనదేశంలోనే తయారైంది. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ఇదొక గొప్ప ముందడుగు. దిగుమతుల మీద ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద సెమీకండక్టర్ చిప్ తయారీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం ప్రోత్సహిస్తున్నారు. ఈ రంగంలో యువతకు చాలా అవకాశాలున్నాయి. పరిశోధనలు ఇంకా జరగాల్సి ఉంది. వీఎల్ఎస్ఐ డిజైన్లో కెరీర్ను సృష్టించుకోవాలని యువతను కోరుతున్నా. పురోగమనిస్తున్నకొద్దీ కొత్త ఆవిష్కరణలెన్నో పుట్టుకొస్తాయి’’
- ప్రొఫెసర్ రాజీవ్ కుమార్ రంజన్, ఐఐటీ ఐఎస్ఎం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

‘సూపర్’ అయస్కాంతం
వాతావరణ మార్పు వైపరీత్యాలను ఎదుర్కోవటానికి వినూత్న హరిత పరిజ్ఞానాలు తక్షణావసరంగా మారాయి. వీటి విషయంలో ప్రవాస భారతీయ సమ్మాన్ పురస్కార గ్రహీత, జపాన్లోని షిబౌరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ప్రొఫెసర్ మురళీధర్ మిర్యాల గొప్ప ముందడుగు వేశారు. - 
                                    
                                        

నాజ్కా నజారా!
ప్రపంచ చరిత్రలో కొన్ని ప్రదేశాలు మనిషి బుద్ధిని ప్రశ్నిస్తాయి, కొన్ని కళను ఆశ్చర్యపరుస్తాయి, ఇంకొన్ని భక్తిని మేల్కొలుపుతాయి. ఈ మూడు కలగలిస్తే? పెరూ ఎడారి నేల మీద గీసిన నాజ్కా రేఖలే దీనికి నిదర్శనం. రాళ్లతో కప్పబడిన ఎడారి నేలపై గీసిన గీతల ఆకృతులివి. నేలమీద నిలబడి చూస్తే ఇవి మూమూలు పిచ్చి గీతల్లా కనిపిస్తాయి. - 
                                    
                                        

బల్బుతోనే డేటా ప్రసారం!
వై-ఫై గురించి తెలిసిందే. మరి లైట్ ఫిడెలిటీ.. అదే లై-ఫై గురించి? వై-ఫై మాదిరిగా ఇదీ వైర్లెస్ కమ్యూనికేషన్ పరిజ్ఞానమే. రేడియో తరంగాలతో కాకుండా దృశ్య కాంతి తరంగాలతో డేటాను ప్రసారం చేయటం దీని ప్రత్యేకత. అందుకే కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని భావిస్తున్నారు. - 
                                    
                                        

టీనేజర్లూ.. వైబ్ కోడింగ్ నేర్చుకోండి!
కేవలం 19 ఏళ్ల వయసులోనే స్కేల్ ఏఐ అనే అంకుర సంస్థను స్థాపించాడు. 24 ఏళ్లలోనే బిలియనీర్గా అవతరించి రికార్డు సృష్టించాడు. తాజాగా 28 ఏళ్ల వయసులో ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ మెటా ఏఐ సీఈవో బాధ్యతలు చేపట్టి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. - 
                                    
                                        

నోబెల్ కాని నోబెల్ మనకూ బహుమతులు!
షూ ర్యాక్స్ ఉపయోగించుకోవటాన్ని షూ దుర్వాసన ఎలా ప్రభావితం చేస్తుంది?, రోజురోజుకీ గోళ్లు ఎలా పెరుగుతూ వస్తున్నాయి? వాటి తీరుతెన్నులెలా ఉంటున్నాయి?, తామే గొప్పవాళ్లమని భావించే వారికి మీరు తెలివి తేటలు గలవారని చెబితే? - 
                                    
                                        

బాట్తో చాట్ జాగ్రత్తగా
ఏఐ చాట్బాట్స్తో ఎడాపెడా ముచ్చటిస్తున్నారా? చిన్నా పెద్దా విషయాలన్నీ చర్చిస్తున్నారా? మరీ అంత దూకుడొద్దు. ఇటీవల అమెరికాలో ఒక యువకుడు పదే పదే చాట్జీపీటీతో ఆత్మహత్య గురించి చర్చించి, చివరికి ప్రాణాలు తీసుకోవ టానికి తెగబడిన విషయం తెలిసే ఉంటుంది. అతడి తల్లిదండ్రులు అక్కడి కోర్టులో దావా వేశారు కూడా. - 
                                    
                                        

ఫోన్ ఫొటోలు భద్రమేనా?
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్లు అనుక్షణం వెన్నంటే ఉంటున్నాయి. జేబులోంచి ఫోన్ తీసి, ఇలా క్లిక్ చేసి అలా ఫొటోలు తీయటం నిత్యకృత్యంగా మారింది. - 
                                    
                                        

టెక్ వినాయకా నమోస్తుతే!
వినాయక చవితి అనగానే పల్లె, పట్నం తేడా లేకుండా ఉత్సాహం ఉరక లేస్తుంది. వీధి వీధినా గణపతి మండపాలు విద్యుత్ కాంతులతో విరాజిల్లు తుంటాయి. భక్తి ప్రపత్తులతో గణపతిని వేడుకొని, విజయం చేకూర్చాలని మొక్కుకుంటాం. ఈ పర్వదినం ఆధ్యాత్మికమైనదే అయినా ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞాన శోభనూ సంతరించుకుంటోంది. - 
                                    
                                        

ఇక స్మార్ట్ యూపీఐ!
యూపీఐ ద్వారా ఫోన్తో చకచకా డబ్బులు చెల్లించటం, అందుకోవటం సర్వ సాధారణ విషయంగా మారిపోయింది. జేబులో యూపీఐ ఖాతాతో ముడిపడిన యాప్ గల ఫోన్ ఉంటే చాలు. - 
                                    
                                        

స్క్రీన్ షేర్ మోసం
డిజిటల్ మోసాలు రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. డిజిటల్ అరెస్ట్, ఓటీటీ ఫ్రాడ్, కేవైసీ వెరిఫికేషన్ వంటి మోసాలెన్నో ఇప్పటికే జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా వాట్సప్ స్క్రీన్ మానిటరింగ్ అనే స్కామ్ వెలుగులోకి వచ్చింది. - 
                                    
                                        

పర్యావరణానికి ఏఐ చేటు
చాట్జీపీటీ వంటి వాటితో సమాచారాన్ని తెలుసుకోవటం చిటికెలో పనే. ఇలా ప్రశ్న వేయగానే అలా సమాధానం ముందుంటుంది. ఇంతటితోనే అయిపోతే ఇబ్బందేమీ లేదు. కానీ సమాధానం అందించిన ప్రతిసారీ విద్యుత్తు ఖర్చవుతుంది. - 
                                    
                                        

ఏఐ సినిమా విడుదలే విడుదల!
అడోబ్ సెన్సీ, బ్లాక్బర్డ్- పోస్ట్ ప్రొడక్షన్ కోసం. ఇవి మామూలు బడ్జెట్ సినిమాలనూ హాలీవుడ్ స్థాయిలో అలరించేలా తీర్చిదిద్దుతున్నాయి. సినీ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతోంది. సృజనాత్మక కృత్రిమ మేధ (జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రయోగదశ దాటుకొని ప్రొడక్షన్ స్థాయికి చేరుకుంది. సినిమా నిర్మాణంలో కీలక సాధనంగా అవతరిస్తోంది. - 
                                    
                                        

చాట్బాట్ తీరే వేరు
చాట్జీపీటీ, గ్రాక్, మెటా ఏఐ వంటి చాట్బాట్స్ వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే కొందరి దైనందిన వ్యవహారాల్లో ఇవి విడదీయలేని భాగమయ్యాయి కూడా. కానీ చాలామందికి ఇవెలా పనిచేస్తాయో తెలియదనే అనుకోవాలి. - 
                                    
                                        

ఏది ఏఐ? ఏది అసలు?
రివర్స్ ఇమేజ్ సెర్చ్తో.. అంటే ఫొటోను గూగుల్ ఇమేజెస్లో అప్లోడ్ చేసి వెతికితే దాన్ని అంతర్జాలంలో ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోవటం సాధ్యమే. కానీ ఏఐ టూల్స్ భయంకరంగా తెలివి మీరాయి. - 
                                    
                                        

మొబైల్ @ 30
మొబైల్ ఫోన్లు మన జీవితంలో విడదీయలేని భాగంగా మారాయి. ఇప్పుడంటే సోషల్ మీడియా, ఆన్లైన్, బ్యాంకింగ్ వంటి రకరకాల అవసరాలకు వాడుకుంటున్నాం గానీ మొదట్లో కేవలం కాల్స్కే పరిమితం. - 
                                    
                                        

స్మార్ట్ గూఢచారి!
అనుక్షణమూ అంతర్జాల అనుసంధానంతో అలరారే నేటి డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్ఫోన్లు అతి ప్రధానమైన పరికరాలుగా మారిపోయాయి. వ్యక్తిగత చాట్స్, ఆర్థిక సమాచారం దగ్గరి నుంచి ఈమెయిల్స్, లొకేషన్ హిస్టరీ వరకూ అన్నీ ఫోన్లోనే ఉంటున్నాయి. - 
                                    
                                        

జేబులో సైంటిస్ట్!
జేబులో ఆండ్రాయిడ్ ఫోనుందా? అయితే భూకంపాల గురించి ముందే హెచ్చరించే శాస్త్రవేత్త వెంట ఉన్నట్టే. అవును.. గూగుల్ సంస్థ చడీచప్పుడు లేకుండా తమ ఆపరేటింగ్ సిస్టమ్ సాయంతో కోట్లాది ఫోన్లను భారీ భూకంప గుర్తింపు నెట్వర్క్గా మార్చేసింది. - 
                                    
                                        

చినుకు తాకితే ఫోన్ గజగజ
చిటపట చినుకులు పడుతుంటే ఆనందంగానే ఉంటుంది. చల్లటి వాతావరణం మనసుకు హాయి గొలుపుతుంది. అయితే ఇది ఎలక్ట్రానిక్ పరికరాలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. - 
                                    
                                        

సోషల్ బ్రహ్మలు!
సామాజిక మాధ్యమాలు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. ఆహార, విహారాల వంటి జీవనశైలి అంశాల దగ్గరి నుంచి వ్యక్తిత్వ వికాసం వరకూ అన్నింటికీ ఇవే ఇప్పుడు మార్గ నిర్దేశం చేస్తున్నాయి. - 
                                    
                                        

అయస్కాంతం ప్రత్యామ్నాయం
రిఫ్రిజిరేటర్ తీసే కూనిరాగం దగ్గరి నుంచి స్మార్ట్ఫోన్ లోపల మెమరీ వరకూ అయస్కాంతాలు నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉంటాయి. ఆధునిక సాంకేతిక జీవనంలో గుండెకాయగానూ నిలుస్తున్నాయి. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
 - 
                        
                            

యువతిపై గ్యాంగ్ రేప్: ఎయిర్ పోర్ట్ వద్ద నిందితులపై ఎన్కౌంటర్
 - 
                        
                            

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
 - 
                        
                            

ఇజ్రాయెల్కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
 - 
                        
                            

వడ్ల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
 - 
                        
                            

భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఎప్పుడంటే..: బీసీసీఐ
 


