Alexandr Wang: టీనేజర్లూ.. వైబ్ కోడింగ్ నేర్చుకోండి!

కేవలం 19 ఏళ్ల వయసులోనే స్కేల్ ఏఐ అనే అంకుర సంస్థను స్థాపించాడు. 24 ఏళ్లలోనే బిలియనీర్గా అవతరించి రికార్డు సృష్టించాడు. తాజాగా 28 ఏళ్ల వయసులో ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ మెటా ఏఐ సీఈవో బాధ్యతలు చేపట్టి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అతనే అలెగ్జాండర్ వాంగ్. స్వయంకృషితో వ్యాపారవేత్తగా ఎదిగిన ఆయన ఇటీవల ‘వైబ్ కోడింగ్’ నేర్చుకోవాలని 13 ఏళ్ల పిల్లలకు సందేశం ఇచ్చారు. ఇంతకీ ఇదేం కోడింగ్? దీని గొప్పతనమేంటి?
ఇటీవల కృత్రిమ మేధ (ఏఐ) శరవేగంగా విస్తరిస్తోంది. పరిశ్రమలు, విద్య, వ్యాపార రంగాలతో పాటు రోజువారీ వ్యవహారాలనూ పూర్తిగా మార్చేస్తోంది. మనం చేసే పనులు, క్రియేషన్ తీరుతెన్నులనే మారుస్తున్న నేపథ్యంలో కొత్త తరం వీలైనంత త్వరగా ఏఐని అందిపుచ్చుకోవాలని టెక్ కంపెనీలు సైతం ప్రోత్సహిస్తున్నాయి. అలెగ్జాండర్ వాంగ్ తాజా సలహానే దీనికి నిదర్శనం. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మధ్యలోనే చదువు ఆపేసిన ఆయన చిన్న వయసులోనే స్కేల్ ఏఐ సంస్థను స్థాపించాడు. అనతికాలంలోనే బిలియనీర్ వ్యాపారవేత్తగా ఎదిగాడు. నిజానికి ఇదో అద్భుతమైన ప్రస్థానం. ఏఐ వ్యవస్థల శిక్షణలో ప్రాథమిక అంశమైన డేటా లేబులింగ్ మీద స్కేల్ ఏఐ ప్రధానంగా దృష్టి సారించింది. దీన్ని పదేళ్ల పాటు నడిపించిన వాంగ్ తన కౌశలాన్ని మెటా ఏఐకి అందించటానికి నడుం కట్టారు.

ఇటీవల ఆయన ఒక పాడ్కాస్ట్లో ప్రసంగిస్తూ టీనేజర్ల కళ్లు తెరిపించే సలహా ఇచ్చారు. ‘మీరు 13 ఏళ్ల వయసువారైతే మీ సమయమంతా వైబ్ కోడింగ్కు వెచ్చించండి. మీ జీవితాన్ని దీంతోనే గడపండి’ అని సూచించారు. యువత ఏఐ టూల్స్ కోసం కనీసం 10వేల గంటలైనా అంకితం చేయాలనీ ఉద్బోధించారు. మున్ముందు జాబ్ మార్కెట్లో అందరికన్నా ముందుండాలని కోరుకునేవారికిది గొప్ప మేలు చేస్తుందని పేర్కొన్నారు. ‘పర్సనల్ కంప్యూటర్లు వచ్చిన తొలినాళ్లలో వాటి కోసం అత్యధిక సమయాన్ని కేటాయించినవారు, వాటితో ఎదిగిన బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్ వంటివారు భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన ప్రయోజనాన్ని పొందారు. ఇప్పుడు అలాంటి సమయమే ఆసన్నమైందని నాకు అనిపిస్తోంది’ అని వివరించారు.
వైబ్ కోడింగ్ అంటే?
వైబ్ కోడింగ్ ఓ అధునాత ప్రోగ్రామింగ్ విధానం. ఇది సహజ భాష, ఏఐ అసిస్టెడ్ టూల్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది. సంప్రదాయ కోడింగ్కు సంక్లిష్ట ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద పట్టు ఉండాలి. కానీ వైబ్ కోడింగ్ అలాంటిది కాదు. మామూలు ఇంగ్లిష్లో సాధారణ ప్రాంప్ట్ రాయగలిగినా చాలు. ఏఐ టూల్స్ వీటిని ఫంక్షనల్ కోడ్ ప్రాంప్ట్ల రూపంలోకి మార్చేస్తాయి. దీని సాయంతో యూజర్లు సొంతంగా రిప్లిట్, కర్సర్ వంటి వేదికల మీద యాప్స్ను సృష్టించుకోవచ్చు. టాస్కులను ఆటోమేట్ చేయొచ్చు, వెబ్సైట్లు రూపొందించుకోవచ్చు. తమకేం కావాలో వివరంగా వర్ణించగలిగితే చాలు. లోతైన సాంకేతిక పరిజ్ఞానమేమీ అక్కర్లేదు.
గూగుల్, క్లార్నా వంటి సంస్థలూ వైబ్ కోడింగ్ను ఉత్పాదకత పెంచుకోవటానికి వాడుకుంటున్నాయి. ఏఐ ప్రోగ్రామింగ్ టూల్స్ కేవలం 20 నిమిషాల్లోనే ప్రోటోటైప్స్ను రూపొందిస్తుండటం గమనార్హం. వీటి కోసం గతంలో వారాల కొద్దీ సమయం పట్టేది. వర్ధమాన టెక్ ఉద్యోగులు ఏఐ నైపుణ్యాల మీద పట్టు సాధించటం తక్షణ అవసరంగా మారింది కూడా. ఎందుకంటే కంపెనీలు ఆటోమేషన్కు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఎంట్రీ లెవల్ టెక్ ఉద్యోగాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. ఇది ఉద్యోగ భద్రత మీద ఆందోళనలకూ దారితీస్తోంది. కాబట్టి భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా ఇప్పటి నుంచే సన్నద్ధం కావటం అత్యావశ్యకమైంది. ఈ నేపథ్యంలోనే అలెగ్జాండర్ వాంగ్ సలహా ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

‘సూపర్’ అయస్కాంతం
వాతావరణ మార్పు వైపరీత్యాలను ఎదుర్కోవటానికి వినూత్న హరిత పరిజ్ఞానాలు తక్షణావసరంగా మారాయి. వీటి విషయంలో ప్రవాస భారతీయ సమ్మాన్ పురస్కార గ్రహీత, జపాన్లోని షిబౌరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ప్రొఫెసర్ మురళీధర్ మిర్యాల గొప్ప ముందడుగు వేశారు. - 
                                    
                                        

నాజ్కా నజారా!
ప్రపంచ చరిత్రలో కొన్ని ప్రదేశాలు మనిషి బుద్ధిని ప్రశ్నిస్తాయి, కొన్ని కళను ఆశ్చర్యపరుస్తాయి, ఇంకొన్ని భక్తిని మేల్కొలుపుతాయి. ఈ మూడు కలగలిస్తే? పెరూ ఎడారి నేల మీద గీసిన నాజ్కా రేఖలే దీనికి నిదర్శనం. రాళ్లతో కప్పబడిన ఎడారి నేలపై గీసిన గీతల ఆకృతులివి. నేలమీద నిలబడి చూస్తే ఇవి మూమూలు పిచ్చి గీతల్లా కనిపిస్తాయి. - 
                                    
                                        

బల్బుతోనే డేటా ప్రసారం!
వై-ఫై గురించి తెలిసిందే. మరి లైట్ ఫిడెలిటీ.. అదే లై-ఫై గురించి? వై-ఫై మాదిరిగా ఇదీ వైర్లెస్ కమ్యూనికేషన్ పరిజ్ఞానమే. రేడియో తరంగాలతో కాకుండా దృశ్య కాంతి తరంగాలతో డేటాను ప్రసారం చేయటం దీని ప్రత్యేకత. అందుకే కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని భావిస్తున్నారు. - 
                                    
                                        

నోబెల్ కాని నోబెల్ మనకూ బహుమతులు!
షూ ర్యాక్స్ ఉపయోగించుకోవటాన్ని షూ దుర్వాసన ఎలా ప్రభావితం చేస్తుంది?, రోజురోజుకీ గోళ్లు ఎలా పెరుగుతూ వస్తున్నాయి? వాటి తీరుతెన్నులెలా ఉంటున్నాయి?, తామే గొప్పవాళ్లమని భావించే వారికి మీరు తెలివి తేటలు గలవారని చెబితే? - 
                                    
                                        

మన చిప్.. మన గర్వ కారణం!
సెమీకండక్టర్ చిప్ తయారీలో మనదేశం గొప్ప మైలురాయిని చేరుకుంది. ఒకప్పుడు తైవాన్, బ్రెజిల్ వంటి దేశాల నుంచి చిప్స్ దిగుమతి చేసుకునేవాళ్లం. ఇప్పుడు దేశీయంగా తయారు చేసుకునే స్థితికి చేరుకున్నాం - 
                                    
                                        

బాట్తో చాట్ జాగ్రత్తగా
ఏఐ చాట్బాట్స్తో ఎడాపెడా ముచ్చటిస్తున్నారా? చిన్నా పెద్దా విషయాలన్నీ చర్చిస్తున్నారా? మరీ అంత దూకుడొద్దు. ఇటీవల అమెరికాలో ఒక యువకుడు పదే పదే చాట్జీపీటీతో ఆత్మహత్య గురించి చర్చించి, చివరికి ప్రాణాలు తీసుకోవ టానికి తెగబడిన విషయం తెలిసే ఉంటుంది. అతడి తల్లిదండ్రులు అక్కడి కోర్టులో దావా వేశారు కూడా. - 
                                    
                                        

ఫోన్ ఫొటోలు భద్రమేనా?
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్లు అనుక్షణం వెన్నంటే ఉంటున్నాయి. జేబులోంచి ఫోన్ తీసి, ఇలా క్లిక్ చేసి అలా ఫొటోలు తీయటం నిత్యకృత్యంగా మారింది. - 
                                    
                                        

టెక్ వినాయకా నమోస్తుతే!
వినాయక చవితి అనగానే పల్లె, పట్నం తేడా లేకుండా ఉత్సాహం ఉరక లేస్తుంది. వీధి వీధినా గణపతి మండపాలు విద్యుత్ కాంతులతో విరాజిల్లు తుంటాయి. భక్తి ప్రపత్తులతో గణపతిని వేడుకొని, విజయం చేకూర్చాలని మొక్కుకుంటాం. ఈ పర్వదినం ఆధ్యాత్మికమైనదే అయినా ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞాన శోభనూ సంతరించుకుంటోంది. - 
                                    
                                        

ఇక స్మార్ట్ యూపీఐ!
యూపీఐ ద్వారా ఫోన్తో చకచకా డబ్బులు చెల్లించటం, అందుకోవటం సర్వ సాధారణ విషయంగా మారిపోయింది. జేబులో యూపీఐ ఖాతాతో ముడిపడిన యాప్ గల ఫోన్ ఉంటే చాలు. - 
                                    
                                        

స్క్రీన్ షేర్ మోసం
డిజిటల్ మోసాలు రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. డిజిటల్ అరెస్ట్, ఓటీటీ ఫ్రాడ్, కేవైసీ వెరిఫికేషన్ వంటి మోసాలెన్నో ఇప్పటికే జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా వాట్సప్ స్క్రీన్ మానిటరింగ్ అనే స్కామ్ వెలుగులోకి వచ్చింది. - 
                                    
                                        

పర్యావరణానికి ఏఐ చేటు
చాట్జీపీటీ వంటి వాటితో సమాచారాన్ని తెలుసుకోవటం చిటికెలో పనే. ఇలా ప్రశ్న వేయగానే అలా సమాధానం ముందుంటుంది. ఇంతటితోనే అయిపోతే ఇబ్బందేమీ లేదు. కానీ సమాధానం అందించిన ప్రతిసారీ విద్యుత్తు ఖర్చవుతుంది. - 
                                    
                                        

ఏఐ సినిమా విడుదలే విడుదల!
అడోబ్ సెన్సీ, బ్లాక్బర్డ్- పోస్ట్ ప్రొడక్షన్ కోసం. ఇవి మామూలు బడ్జెట్ సినిమాలనూ హాలీవుడ్ స్థాయిలో అలరించేలా తీర్చిదిద్దుతున్నాయి. సినీ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతోంది. సృజనాత్మక కృత్రిమ మేధ (జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రయోగదశ దాటుకొని ప్రొడక్షన్ స్థాయికి చేరుకుంది. సినిమా నిర్మాణంలో కీలక సాధనంగా అవతరిస్తోంది. - 
                                    
                                        

చాట్బాట్ తీరే వేరు
చాట్జీపీటీ, గ్రాక్, మెటా ఏఐ వంటి చాట్బాట్స్ వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే కొందరి దైనందిన వ్యవహారాల్లో ఇవి విడదీయలేని భాగమయ్యాయి కూడా. కానీ చాలామందికి ఇవెలా పనిచేస్తాయో తెలియదనే అనుకోవాలి. - 
                                    
                                        

ఏది ఏఐ? ఏది అసలు?
రివర్స్ ఇమేజ్ సెర్చ్తో.. అంటే ఫొటోను గూగుల్ ఇమేజెస్లో అప్లోడ్ చేసి వెతికితే దాన్ని అంతర్జాలంలో ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోవటం సాధ్యమే. కానీ ఏఐ టూల్స్ భయంకరంగా తెలివి మీరాయి. - 
                                    
                                        

మొబైల్ @ 30
మొబైల్ ఫోన్లు మన జీవితంలో విడదీయలేని భాగంగా మారాయి. ఇప్పుడంటే సోషల్ మీడియా, ఆన్లైన్, బ్యాంకింగ్ వంటి రకరకాల అవసరాలకు వాడుకుంటున్నాం గానీ మొదట్లో కేవలం కాల్స్కే పరిమితం. - 
                                    
                                        

స్మార్ట్ గూఢచారి!
అనుక్షణమూ అంతర్జాల అనుసంధానంతో అలరారే నేటి డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్ఫోన్లు అతి ప్రధానమైన పరికరాలుగా మారిపోయాయి. వ్యక్తిగత చాట్స్, ఆర్థిక సమాచారం దగ్గరి నుంచి ఈమెయిల్స్, లొకేషన్ హిస్టరీ వరకూ అన్నీ ఫోన్లోనే ఉంటున్నాయి. - 
                                    
                                        

జేబులో సైంటిస్ట్!
జేబులో ఆండ్రాయిడ్ ఫోనుందా? అయితే భూకంపాల గురించి ముందే హెచ్చరించే శాస్త్రవేత్త వెంట ఉన్నట్టే. అవును.. గూగుల్ సంస్థ చడీచప్పుడు లేకుండా తమ ఆపరేటింగ్ సిస్టమ్ సాయంతో కోట్లాది ఫోన్లను భారీ భూకంప గుర్తింపు నెట్వర్క్గా మార్చేసింది. - 
                                    
                                        

చినుకు తాకితే ఫోన్ గజగజ
చిటపట చినుకులు పడుతుంటే ఆనందంగానే ఉంటుంది. చల్లటి వాతావరణం మనసుకు హాయి గొలుపుతుంది. అయితే ఇది ఎలక్ట్రానిక్ పరికరాలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. - 
                                    
                                        

సోషల్ బ్రహ్మలు!
సామాజిక మాధ్యమాలు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. ఆహార, విహారాల వంటి జీవనశైలి అంశాల దగ్గరి నుంచి వ్యక్తిత్వ వికాసం వరకూ అన్నింటికీ ఇవే ఇప్పుడు మార్గ నిర్దేశం చేస్తున్నాయి. - 
                                    
                                        

అయస్కాంతం ప్రత్యామ్నాయం
రిఫ్రిజిరేటర్ తీసే కూనిరాగం దగ్గరి నుంచి స్మార్ట్ఫోన్ లోపల మెమరీ వరకూ అయస్కాంతాలు నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉంటాయి. ఆధునిక సాంకేతిక జీవనంలో గుండెకాయగానూ నిలుస్తున్నాయి. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
 - 
                        
                            

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు
 - 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 


