Telangana News: తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ల బదిలీ

హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్లాగ్షిప్ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక సీఎస్గా సవ్యసాచి ఘోష్ నియమితులయ్యారు. అలాగే, సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్గానూ ఆయన కొనసాగనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్గా అనితా రామచంద్రన్కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రవాణాశాఖ కమిషనర్గా కె.ఇలంబర్తిని నియమించిన ప్రభుత్వం.. పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను ఆయనకు అప్పగించింది.
మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శి బాధ్యతలు సీఎస్ వద్దే ఉంచింది. జీఏడీ కార్యదర్శిగా ఇ.శ్రీధర్కు అదనపు బాధ్యతలు ఇచ్చింది. టీజీ ఆయిల్ఫెడ్ ఎండీగా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు అప్పగించిన సర్కార్.. ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్గా జి.జితేందర్రెడ్డిని నియమించింది. అలాగే, ఎస్సీ సహకార సంస్థ ఎండీగా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించింది. అభివృద్ధి సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

మైనింగ్ అక్రమ రవాణా ఆపేవారే లేరా..!
మైనింగ్ రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల.. లోపల.. అనేక ‘మార్గాల్లో’ అక్రమార్కులు రవాణా సాగిస్తున్నారు. - 
                                    
                                        

మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరమని మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్బాబు అన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే వైద్య చికిత్సలను చేయిస్తుందన్నారు. - 
                                    
                                        

మిగులు టీచర్లు... 10 వేల మంది!
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 10 వేల మంది మిగులు ఉపాధ్యాయులున్నారని పాఠశాల విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 24,238 పాఠశాలలు ఉండగా... 1.08 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. - 
                                    
                                        

ముడుపులు ఇచ్చిన.. పుచ్చుకున్నవారిపైనా చర్యలు
స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ముడుపులు ఇచ్చినవారిపైనా.. పుచ్చుకున్నవారిపైనా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. - 
                                    
                                        

ప్రజల మధ్యకు రాని కేసీఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతారు?
మరో 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం చేస్తూ కేటీఆర్ పగటి కలలు కంటున్నారని.. ప్రజల మధ్యకు రాని కేసీఆర్ సీఎం ఎలా అవుతారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. - 
                                    
                                        

ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే అందర్నీ మోసం చేశారు
అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రేవంత్రెడ్డికి అందర్నీ మోసం చేశారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. - 
                                    
                                        

కోకాపేట.. ఎకరం రూ. 99 కోట్లు!
హెచ్ఎండీఏ పరిధిలోని ఖరీదైన భూములను ఆన్లైన్లో వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. - 
                                    
                                        

జూబ్లీహిల్స్ ప్రచారం రసవత్తరం
జూబ్లీహిల్స్ అమాత్యుల అడ్డాగా మారింది. రాష్ట్ర మంత్రులకు కాంగ్రెస్ అధిష్ఠానం నియోజకవర్గంలోని డివిజన్ల బాధ్యతలను అప్పగించింది. - 
                                    
                                        

ఎస్ఎల్బీసీ పూర్తిచేసి తీరతాం
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ)ను పూర్తిచేస్తే కాంగ్రెస్కు పేరొస్తుందనే రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్, హరీశ్లు ఈ ప్రాజెక్టును పక్కనపెట్టారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. - 
                                    
                                        

మృత్యు ప్రయాణం
కాలేజీకి వెళ్లేందుకు విద్యార్థులు.. వ్యాపార పనులకోసం కొందరు.. ఆసుపత్రుల్లో చికిత్సల కోసం ఇంకొందరు.. సెలవులకు స్వగ్రామాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మరికొందరు.. - 
                                    
                                        

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. - 
                                    
                                        

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ కారణం కాదు: ఆర్టీసీ ప్రకటన
చేవెళ్ల బస్సు దుర్ఘటనపై తెలంగాణ ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ ప్రమాదంలో 19మంది దుర్మరణం చెందడంపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


