జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించాలి

Eenadu icon
By Telangana News Desk Published : 29 Oct 2025 05:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మైనార్టీ నేతలకు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పిలుపు

ఈనాడు, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించాలని మైనార్టీ నేతలకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం గోల్కొండ హోటల్‌లో మైనార్టీ నేతలతో ఆయన సమావేశమై ఎన్నికల ప్రచారంపై చర్చించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్‌ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని మహేశ్‌కుమార్‌గౌడ్‌ వివరించారు. ఉప ఎన్నికలో పార్టీని గెలిపించి రాష్ట్ర ప్రభుత్వానికి మరింత మద్దతివ్వాలని ఆయన కోరారు. మైనార్టీల సమస్యలను ఈ సందర్భంగా వారు వివరించగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మహేశ్‌కుమార్‌గౌడ్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని మైనార్టీ నేతలు ఆయనకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని