సంక్షిప్త వార్తలు(8)
అభివృద్ధిపై చర్చకు సిద్ధం: మంత్రి పొన్నం
హైదరాబాద్, న్యూస్టుడే: పదేళ్ల భారత రాష్ట్ర సమితి పాలనలో జరిగిన అభివృద్ధి, రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఓటేస్తే ఉపయోగం ఉంటుంది కానీ మూలనపడ్డ కారు(భారత రాష్ట్ర సమితి)కు ఓటేస్తే ముందుకు పోలేమని జూబ్లీహిల్స్ ప్రజలు గమనించాలని కోరారు. మంత్రి బుధవారం గాంధీభవన్లో మాట్లాడారు. ‘జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు. కాంగ్రెస్ అభివృద్ధికి, భారత రాష్ట్ర సమితి అబద్ధాలకు మధ్య జరగనుంది. భారత రాష్ట్ర సమితి నేతలు వారు చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి.ఉప ఎన్నికలో నవీన్యాదవ్ను గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరుతున్నా’అని పొన్నం పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కసిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. గాంధీభవన్లో మంత్రి పొన్నం వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నేడు కళాశాలల బంద్కు ఎస్ఎఫ్ఐ పిలుపు
ఈనాడు, హైదరాబాద్: ఏళ్లకొద్దీ పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గురువారం రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్, ఇతర వృత్తి విద్యా కళాశాలలతోపాటు డిగ్రీ, పీజీ కళాశాలల బంద్కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ప్రభుత్వం బోధనా రుసుములను విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, దానివల్ల అంతిమంగా పేద విద్యార్థులే నష్టపోతున్నారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజనీకాంత్, కార్యదర్శి టి.నాగరాజు తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్ ప్రకటించి సహకరించాలని వారు కోరారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయకపోవడంతో అధ్యాపకులకు కళాశాలల యాజమాన్యాలు వేతనాలు చెల్లించడం లేదని దీనిపై శనివారం సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని టీఎస్టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
నేడు ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) పదోతరగతి, ఇంటర్ ఫలితాలను గురువారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని, వాటిని తెలంగాణ ఓపెన్ స్కూల్ వెబ్సైట్లో ఉంచుతామని టాస్ సంచాలకుడు పీవీ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలను సెప్టెంబరులో నిర్వహించారు.
కాంట్రాక్టు టీచర్ల కొనసాగింపు
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒప్పంద విధానంలో పనిచేస్తున్న 2008 డీఎస్సీ టీచర్లు 1,125 మందిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) కూడా కొనసాగించేందుకు ఆర్థికశాఖ ఆమోదించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా జీఓ జారీ చేశారు. 2008 డీఎస్సీలో అన్యాయం జరిగిన కొందరు అభ్యర్థులకు ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాలు కల్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వారు వచ్చే ఏడాది మార్చి 31 వరకు విధుల్లో కొనసాగుతారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.రామకృష్ణారావు కుమారుడు సిద్ధార్థ చంద్ర వివాహ రిసెప్షన్ బుధవారం రాత్రి శంషాబాద్లో నిర్వహించారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈనాడు, హైదరాబాద్
వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఆధునిక వ్యవసాయం 
ఇక్రిశాట్ స్మార్ట్క్రాప్ ప్రాజెక్టుకు ఎంపిక 
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కృత్రిమమేథ, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ‘స్మార్ట్క్రాప్’ ప్రాజెక్టును నిర్వహించాలని ఇక్రిశాట్ నిర్ణయించింది. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎస్బీఐ ఫౌండేషన్, రాయచూర్ వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయంతో కలిసి దీనిని అమలు చేయనుంది. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్పాఠక్, ఎస్బీఐ ఫౌండేషన్ ఎండీ సంజయ్ప్రకాశ్, రాయచూర్ యూఏఎస్ ఎంటమాలజీ విభాగాధిపతి ఏజీ శ్రీనివాస్, తెలంగాణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో దివ్యాదేవరాజన్, రెండు జిల్లాల రైతులతో కలిసి బుధవారం ఇక్కడ ఈ ప్రాజెక్టును ఆవిష్కరించారు. ఎస్బీఐ ఫౌండేషన్.. జీవనోపాధి, పారిశ్రామిక మార్గనిర్దేశక కార్యక్రమం కింద మూడేళ్లలో దాదాపు ఆరు వేల మంది చిన్న, సన్నకారు రైతులకు ఈ ప్రాజెక్టు కింద సాయం అందిస్తుంది.
ఇంటర్ అతిథి అధ్యాపకుల పెండింగ్ వేతనాలు విడుదల
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత విద్యా సంవత్సరం(2024-25)లో అతిథి అధ్యాపకులుగా పనిచేసిన 1,665 మంది పెండింగ్ వేతనాలు రూ.17.56 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ సంచాలకుడు కృష్ణఆదిత్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024 డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు పనిచేసిన కాలానికి జీతం మొత్తాన్ని విడుదల చేశారు. వాటిని ఆయా అధ్యాపకులకు చెల్లించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.
హరీశ్రావుకు మహేశ్కుమార్గౌడ్ పరామర్శ

సత్యనారాయణరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మహేశ్కుమార్గౌడ్. చిత్రంలో మధుయాస్కీగౌడ్, హరీశ్రావు
హైదరాబాద్, న్యూస్టుడే: పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మాజీమంత్రి హరీశ్రావును పరామర్శించారు. హరీశ్రావు తండ్రి టి.సత్యనారాయణరావు వృద్ధాప్య సమస్యలతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బుధవారం హరీశ్రావు నివాసానికి వెళ్లిన మహేశ్కుమార్గౌడ్.. సత్యనారాయణరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, మధుయాస్కీగౌడ్, ట్రైకార్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్ తదితరులు హరీశ్రావును పరామర్శించారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్రెడ్డి, భాజపా ఎమ్మెల్యే పాయల్శంకర్ బుధవారం హరీశ్రావును ఆయన నివాసంలో పరామర్శించారు. హరీశ్రావు తండ్రి సత్యనారాయణరావు చిత్రపటానికి వారు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

మైనింగ్ అక్రమ రవాణా ఆపేవారే లేరా..!
మైనింగ్ రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల.. లోపల.. అనేక ‘మార్గాల్లో’ అక్రమార్కులు రవాణా సాగిస్తున్నారు. - 
                                    
                                        

ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్బాక్స్.. ఐ-ఎలర్ట్
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా బస్సుల్లో ఐ-ఎలర్ట్ పరికరాన్ని అమరుస్తున్నారు. - 
                                    
                                        

ఓవర్ లోడ్.. ఓవర్ స్పీడ్!
మైనింగ్ వాహనాలు నడిపే విషయంలో నిబంధనలున్నా.. కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వాటిని పాటించాల్సిన యజమానులు, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. అధికారయంత్రాంగంలోని కొందరు షరా ‘మామూలు’గా చూసీచూడనట్లు ఉంటున్నారు. - 
                                    
                                        

ధర్మపురి ఆలయాన్నిసమగ్రంగా అభివృద్ధి చేస్తాం
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకూ సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. - 
                                    
                                        

ఏడు క్వింటాళ్ల పరిమితి నిబంధనను సీసీఐ ఎత్తివేయాలి
ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. - 
                                    
                                        

నెలాఖరులోగా ఉచిత చేపపిల్లల పంపిణీ
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. రూ.123 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. - 
                                    
                                        

జూబ్లీహిల్స్ ప్రచారంలో నిర్లక్ష్యం వద్దు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ నిర్లక్ష్యం చూపించవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు. - 
                                    
                                        

వ్యవసాయ విద్యలో సంయుక్త బీఎస్సీ కోర్సు
దేశంలో తొలిసారిగా.. నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ కోర్సును సంయుక్తంగా నిర్వహించేందుకు తెలంగాణ అగ్రి వర్సిటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెస్టర్న్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. - 
                                    
                                        

మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలోని 3 వేల మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా.. మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విన్నవించారు. - 
                                    
                                        

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం నిర్వహించండి
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఆరోగ్య కార్డుల జారీపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఉద్యోగుల ఐకాస (టీజీఈజాక్) కోరింది. - 
                                    
                                        

ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. మహారాష్ట్రకు సంబంధించి ఇలాంటి కేసుపైనే ఏప్రిల్ 22న సుప్రీంకోర్టులోని మరో ధర్మాసనం... - 
                                    
                                        

ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే!
తెలంగాణ హైకోర్టులో తనను జడ్జిగా నియమించాలంటూ జి.వి.సర్వన్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. - 
                                    
                                        

కేకు.. ఆలోచన కేక
ఇక్కడ కేకులపై కనిపిస్తున్న చిత్రాలు హైదరాబాద్లోని ట్రాఫిక్ జంక్షన్లవి. మరి ఇలా కేకులపై ఎందుకు ఏర్పాటు చేశారు అనుకుంటున్నారా? నగరంలో సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన కూడళ్లను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ... - 
                                    
                                        

రైల్వే స్టేషన్లే విద్యుత్ కేంద్రాలు
రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫారాలపై లైట్లు, ఫ్యాన్లు, అనౌన్స్మెంట్ సిస్టమ్, టికెట్ కౌంటర్లు.. ఇలా అన్నింటికి కలిపి పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 55 రైల్వేస్టేషన్లు, కార్యాలయ భవనాలకు ఇప్పుడు ఆ శక్తి సూర్యుడి నుంచే అందుతోంది. - 
                                    
                                        

ఓటు వేటలో నాగసాధువులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్కు మద్దతుగా వారణాసి నుంచి వచ్చిన 11 మంది సోమవారం ప్రచారం నిర్వహించారు. - 
                                    
                                        

రామచక్కని సీతమ్మకు.. చక్కనైన గజవాహనం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి హైదరాబాద్కు చెందిన శంకర్నారాయణ-రాజ్యలక్ష్మి అనే దంపతులు రెండ్రోజుల కిందట రూ.40 లక్షల విలువైన రజత గజ వాహనాన్ని అందజేశారు. - 
                                    
                                        

కడలుంగీ.. రఘునాథపురం టు ఉగాండా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో మరమగ్గాలపైన రూపుదిద్దుకుంటున్న కడలుంగీ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక్కడి నుంచి తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా దేశానికి సరఫరా అవుతోంది. - 
                                    
                                        

హైకోర్టు ఉద్యోగిని తెలంగాణకు తిరిగి కేటాయించడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన పీవీ సతీష్కుమార్ అనే హైకోర్టు ఉద్యోగిని తిరిగి తెలంగాణకు కేటాయించడానికి నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయడానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తంచేసింది. - 
                                    
                                        

జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం
వ్యాపార విస్తరణలో భాగంగా మరో జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. నాగ్పుర్లోని కేంద్ర గనులశాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం.. - 
                                    
                                        

పత్తి కొనుగోళ్లు.. ఏడు క్వింటాళ్లకు కుదింపు
భారత పత్తి సంస్థ(సీసీఐ) తాజాగా మరో కఠిన నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఎకరాకు సగటున 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసే నిబంధనలను సోమవారం నుంచి కేవలం 7 క్వింటాళ్లకే పరిమితం చేయటం విస్మయానికి గురిచేసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అమెరికాలో హైర్ బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందే: కాంగ్రెస్
 - 
                        
                            

తెదేపా క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
 - 
                        
                            

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం
 - 
                        
                            

అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్
 - 
                        
                            

బంగ్లా పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలు బంద్
 - 
                        
                            

భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
 


