రక్తదానం ప్రాణదానంతో సమానం: డీజీపీ

Eenadu icon
By Telangana News Desk Published : 30 Oct 2025 04:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

రక్తదానం చేస్తున్న డీజీపీ శివధర్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లేనని డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమాల్లో భాగంగా బుధవారం తొలిసారి డీజీపీ కార్యాలయంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ సందర్భంగా డీజీపీ, అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్, ఐజీపీలు చంద్రశేఖర్‌రెడ్డి, రమేశ్‌ సహా 164 మంది అధికారులు, కార్యాలయ సిబ్బంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... ‘‘రోడ్డు ప్రమాదాల కారణంగా రాష్ట్రంలో ఏటా 8 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రక్తం అందుబాటులో ఉంటే అందులో కొందరినైనా కాపాడే అవకాశముంటుంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ నగర పోలీసులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో 4500 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఏటా ప్రతి ఒక్కరూ నాలుగుసార్లు రక్తదానం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. కనీసం ఒక్కసారైనా రక్తదానం చేయాలి’’ అని సూచించారు. కార్యక్రమంలో ఏఐజీలు రమణకుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని