Hyderabad: జీహెచ్‌ఎంసీ, హైడ్రా కీలక నిర్ణయం.. రెండు కమిటీల ఏర్పాటు

Eenadu icon
By Telangana News Team Published : 25 Mar 2025 16:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్: నగరంలో వరుసగా జరుగుతోన్న అగ్ని ప్రమాదాలు, వర్షాకాలంలో ఎదురయ్యే వరద ముంపు నివారణకు పరిష్కారంపై గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ), హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించాయి. వరద ముంపుతోపాటు అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశమైన హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు రంగనాథ్, ఇలంబర్తి.. వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలు, అగ్నిప్రమాదాల నివారణపై సమీక్షించారు.

అగ్ని ప్రమాదాల నివార‌ణ‌కు అగ్నిమాపక శాఖతో పాటు హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాల‌తో కలిసి ఒక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని, వ‌ర్షాకాలంలో వ‌ర‌ద ముంపు నివార‌ణ‌తో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల‌తో మరో క‌మిటీ వేయాలని కమిషనర్లు నిర్ణయించారు. ఈ రెండు కమిటీలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారుల సమన్వయంతో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని