Mahesh Kumar Goud: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మహేశ్ కుమార్‌ గౌడ్‌ సవాల్‌

Eenadu icon
By Telangana News Team Published : 31 Oct 2025 13:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి (Kishan Reddy) టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌ (Mahesh Kumar Goud) సవాల్‌ విసిరారు. అజారుద్దీన్‌పై ఏం కేసులు ఉన్నాయో సమాధానం చెప్పాలన్నారు. భారత జట్టు కెప్టెన్‌గా ఆయన ఎన్నో విజయాలు అందించారని చెప్పారు. ఎంపీగా ప్రజలకు సేవలు చేశారని తెలిపారు. అజారుద్దీన్‌ మంత్రి పదవిపై భాజపా నేతలకు ఎందుకంత అక్కసు అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మంత్రి పదవిపై 3 నెలల ముందే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.(Telangana News)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు