Uttam KumarReddy: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం: మంత్రి ఉత్తమ్‌

Eenadu icon
By Telangana News Team Published : 28 Oct 2025 00:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పునరుద్ఘాటించారు. తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నామన్నామని ఆయన చెప్పారు. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు నీళ్లు తరలిస్తే ప్రాజెక్టు వ్యయం 10 నుంచి 12శాతం తగ్గుతుందని అన్నారు. భూసేకరణ కూడా సగానికి తగ్గుతుందన్నారు. నీటిపారుదలశాఖ అధికారులు, ఇంజినీర్లతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ప్రణాళికతో పోలిస్తే రూ.1500 కోట్లు నుంచి రూ.1600 కోట్లు తగ్గుతుంది. సాంకేతిక పరిశీలన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకొని అధికారులు డీపీఆర్‌ సిద్ధం చేయాలి. సర్వే, డీపీఆర్‌ అయ్యాక కేబినెట్‌ ముందు ప్రతిపాదనలు పెడతాం. తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట ఎత్తుపై మహారాష్ట్రతో సంప్రదిస్తున్నాం’’ అని మంత్రి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని