Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం

Eenadu icon
By Telangana News Team Updated : 03 Nov 2025 18:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

చేవెళ్ల గ్రామీణం: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ప్రమాద మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహాలను తరలిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రి బృందంతోపాటు, గాంధీ ఫోరెన్సిక్‌ వైద్యులు సైతం పోస్టుమార్టంలో పాల్గొనాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గాంధీ ఆస్పత్రి నుంచి ఉస్మానియాకు వైద్యుల బృందం వెళ్లింది.

మరోవైపు క్షతగాత్రుల కోసం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. బాధితులు వస్తే చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గాంధీ వైద్యుల బృందం తెలిపింది. (Road Accidents)

Tags :
Published : 03 Nov 2025 10:26 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని