MLC Kavita: BRS నేతలు నా దారికి రావాల్సిందే: ఎమ్మెల్సీ కవిత

Eenadu icon
By Telangana News Team Updated : 17 Jul 2025 11:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి నేతలు తన దారికి రావాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ నిర్ణయాన్ని సమర్థించినట్టు చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై రెండు బిల్లులు పెట్టాలని మొదట డిమాండ్‌ చేసింది కూడా తానేనని గుర్తుచేశారు. తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు స్పందించలేదని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత అన్నారు.

బనకచర్ల ప్రాజెక్టుపై జాగృతి పోరాడుతుంది..

‘‘కేంద్ర జలశక్తిశాఖ మంత్రి .. ఇద్దరు ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో పండగ వాతావరణం కనిపించింది. మొదట బనకచర్ల అంశంపైనే చర్చ జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌.. గోదావరి జలాలను అప్పజెప్పి వచ్చారు. జరుగుతున్న నష్టం ఏమిటి? సీఎం అనుసరిస్తున్న వైఖరి ఏమిటి?. టెలీమెట్రీల ఏర్పాటు అంశంలో విషయం లేదు.. కానీ, సీఎం దాన్ని తమ విజయంగా చెబుతున్నారు. బనకచర్ల వల్ల ఏపీకి కూడా లాభం లేదు, కుట్ర పూరితంగా కాంట్రాక్టర్ల కోసం చేపడుతున్న ప్రాజెక్టు అది. కాంగ్రెస్‌, భాజపా దారుణంగా మోసం చేస్తున్నాయి. బనకచర్లను తక్షణమే ఆపాలి.. లేదంటే జాగృతి న్యాయ పోరాటం చేస్తుంది. బీసీ రిజర్వేషన్లు, బనకచర్లపై అఖిలపక్షాన్ని సీఎం దిల్లీకి తీసుకెళ్లాలి’’ అని కవిత డిమాండ్‌ చేశారు.

Tags :
Published : 17 Jul 2025 11:12 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు