Kavitha: ‘బీసీ’ బిల్లు ఆమోదించకపోతే రైల్‌రోకో: ఎమ్మెల్సీ కవిత

Eenadu icon
By Telangana News Team Published : 08 Jul 2025 18:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్‌ చేశారు. దిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించకపోతే జులై 17న రైల్‌రోకో చేస్తామని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు సాధించేవరకు పోరాడతామని చెప్పారు. రైల్‌రోకోకు మద్దతు కోరుతూ బుధవారం అన్ని పార్టీలకు లేఖ రాస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని