Money Mule: సైబర్ కేసుల్లో పావుల్లా ‘మనీ మ్యూల్స్’
ఏడాదిలో కొల్లగొట్టిన సొమ్ము రూ.17,000 కోట్లు
67.8 శాతం మ్యూల్ ఖాతాల ద్వారానే..
చైనా సైబరాసురుల దురాగతాలుగా పోలీసుల గుర్తింపు
కేరళ వయనాడ్ జిల్లాలో 500 మందిపై కేసులు

ఈనాడు, హైదరాబాద్: కేరళ వయనాడ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల ఇస్మాయిల్ని నాగాలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో యువతి సలామత్పై ఉత్తర్ప్రదేశ్ పోలీసులు కేసు పెట్టారు. ఇంకో యువకుడు మహ్మద్ ఫనీష్కు దేహ్రాదూన్ పోలీసులు నోటీసులిచ్చారు. వీరంతా వయనాడ్ జిల్లాలోని కంబాలక్కడ్ పట్టణానికి చెందిన వారే. ఈ ముగ్గురే కాదు..ఈ జిల్లాలో ఏకంగా 500 మంది ఒకేసారి కేసుల్లో చిక్కుకున్నారు. వీరి బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకున్న సైబర్ నేరస్థులు.. తాము కొల్లగొట్టిన సొమ్మును వాటిల్లోకి బదిలీ చేయించుకున్నారు. ‘మనీమ్యూల్స్’ అంటూ పోలీసులు వీరిపై కేసులు పెట్టారు. ఇది ఒక్క కేరళకే పరిమితం కాదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈ పరిస్థితి ఉంది.
టెలిగ్రామ్లో సంభాషణలు.. చాట్రూంలో ప్రచారం
చైనాకు చెందిన సూత్రధారులు ముందుగా భారీ వేతనాలతో భారత్లో తమ తరఫున ఏజెంట్లను నియమించుకుంటున్నారు. ఈ-మెయిల్, చాట్రూం, జాబ్ వెబ్సైట్, బ్లాగ్ల ద్వారా ఆకర్షణీయమైన ప్రకటనలివ్వడమే వీరి పని. కొందరైతే నేరుగానే గ్రామాలు, చిన్న పట్టణాలకు వెళ్లి బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకుంటున్నారు. వయనాడ్లో ఇలాగే చేశారు. తాము చెప్పిన పని చేస్తే ఇంటి నుంచే సులభంగా రూ.వేలు, రూ.లక్షలు సంపాదించొచ్చని ఆశపెడుతున్నారు. కమీషన్ల ఆశకు తమ బ్యాంకు ఖాతాల నిర్వహణ బాధ్యతను కొందరు ఈ ముఠాలకు అప్పగిస్తున్నారు.
డొల్ల కంపెనీల క‘రెంట్’ ఖాతాలతో..
కరెంటు ఖాతాల్లో రోజుకు ఎంత నగదు బదిలీ చేయాలనే పరిమితులు పెద్దగా లేకపోవడంతో ముఠాలు ఎక్కువగా వీటిపైనే దృష్టి సారిస్తున్నాయి. తోపుడుబండ్ల వ్యాపారులు, చిన్న హోటళ్ల నిర్వాహకులు, బిచ్చగాళ్లతో డొల్లకంపెనీలు ఏర్పాటు చేసి ఖాతాలు తెరిపిస్తున్నాయి. వాస్తవానికి ఖాతా తెరిచే ముందు బ్యాంకులు విచారించాలి. కానీ కొందరు బ్యాంకర్లు ముఠాలతో కుమ్మక్కై ఆయా ఖాతాలు తెరిచేందుకు అనుమతిస్తున్నారు. హైదరాబాద్ శంషీర్గంజ్లోని ఓ ప్రముఖ బ్యాంకు మేనేజర్ ఇలాగే చేసి అరెస్టయ్యారు.ఈ బ్యాంకులోని ఆరు ఖాతాల ద్వారా రూ.175 కోట్ల లావాదేవీలు జరిగాయి.
‘మ్యూల్హంటర్.ఏఐ’తో ఆర్బీఐ నిఘా
సైబర్ నేరాల్లో మ్యూల్ వ్యవహారాలు శ్రుతిమించుతుండటంతో ఆర్బీఐ సాంకేతిక నిఘా ప్రారంభించింది. కృత్రిమ మేధ పరిజ్ఞానంతో కూడిన ‘మ్యూల్హంటర్.ఏఐ’ను అందుబాటులోకి తెచ్చింది. తరచూ సమీక్షలు జరపడంతో ఇప్పుడు పలు బ్యాంకులు సొంతంగా ఇలాంటి పరిజ్ఞానాన్నే వినియోగిస్తున్నాయి. అనుమానాస్పద లావాదేవీలను గుర్తిస్తే ఈ పరిజ్ఞానమే ఆటోమేటిగ్గా ఆయా ఖాతాలను స్తంభింపజేస్తోంది.
6500 మ్యూల్ ఖాతాలు.. రూ.58 కోట్లు బదిలీ..
- 2025లో సీబీఐ గుర్తించిన మ్యూల్ఖాతాలు 8.5 లక్షలు. దేశవ్యాప్తంగా 743 బ్యాంకుశాఖల్లో ఈ లావాదేవీలు జరిగాయి.
 - 2023-24లో 4.6 లక్షల అనుమానిత మ్యూల్ఖాతాలను ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) గుర్తించి స్తంభింపజేసింది. ఏడాది కాలంలో రూ.17వేల కోట్లను సైబర్నేరస్థులు కొల్లగొడితే.. వాటిల్లో 67.8 శాతం మ్యూల్ఖాతాల ద్వారానే బదిలీ అయ్యాయి.
 - దేశంలోనే అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ నాలుగురోజుల క్రితం ముంబయిలో వెలుగుచూసింది. 74 ఏళ్ల వృద్ధుడి నుంచి నలభై రోజుల పాటు కాజేసిన రూ.58 కోట్లను బదిలీ చేసేందుకు 6500 మ్యూల్ ఖాతాలను వినియోగించినట్లు సమాచారం.
 
ఎవరు వీరు..?
సైబర్ నేరస్థులు ఆన్లైన్లో కొట్టేస్తున్న సొమ్మును తొలుత తమకు సంబంధం లేని కొందరి ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. అక్కడి నుంచి మళ్లీ పలు ఖాతాలకు పంపిస్తారు. అలా 10-15 లావాదేవీలు జరుపుతారు. చివరి వ్యక్తితో మాత్రం డెబిట్కార్డు ద్వారా ఏటీఎంలో డబ్బు డ్రా చేయిస్తారు. ఇలా చేసినందుకు మధ్యలోని 10-15 మందికి కమీషన్ ఇస్తారు. దానికి ఆశపడే వారే ‘మనీ మ్యూల్స్’. సైబరాసురులు ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..? ఒకవేళ డబ్బు పోగొట్టుకున్న బాధితుడు ఫిర్యాదు చేస్తే పోలీసులు ముందుగా పట్టుకునేది మొదటి మనీమ్యూల్స్నే. దర్యాప్తు చేస్తూ పోలీసులు 10-15 మందిని చేరేలోపు సొమ్మును డ్రా చేస్తారు. అనంతరం ఆ డబ్బును క్రిప్టోకరెన్సీల్లోకి మార్చి ఫారిన్మనీ ఎక్స్ఛేంజీల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. పోలీసులకు మనీమ్యూల్స్ మాత్రమే చిక్కుతున్నారు. సూత్రధారులు దొరికిన దాఖల్లాలేవు. ఇదంతా చైనా ముఠాల పన్నాగంగా పోలీసులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

మైనింగ్ అక్రమ రవాణా ఆపేవారే లేరా..!
మైనింగ్ రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల.. లోపల.. అనేక ‘మార్గాల్లో’ అక్రమార్కులు రవాణా సాగిస్తున్నారు. - 
                                    
                                        

ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్బాక్స్.. ఐ-ఎలర్ట్
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా బస్సుల్లో ఐ-ఎలర్ట్ పరికరాన్ని అమరుస్తున్నారు. - 
                                    
                                        

ఓవర్ లోడ్.. ఓవర్ స్పీడ్!
మైనింగ్ వాహనాలు నడిపే విషయంలో నిబంధనలున్నా.. కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వాటిని పాటించాల్సిన యజమానులు, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. అధికారయంత్రాంగంలోని కొందరు షరా ‘మామూలు’గా చూసీచూడనట్లు ఉంటున్నారు. - 
                                    
                                        

ధర్మపురి ఆలయాన్నిసమగ్రంగా అభివృద్ధి చేస్తాం
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకూ సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. - 
                                    
                                        

ఏడు క్వింటాళ్ల పరిమితి నిబంధనను సీసీఐ ఎత్తివేయాలి
ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. - 
                                    
                                        

నెలాఖరులోగా ఉచిత చేపపిల్లల పంపిణీ
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. రూ.123 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. - 
                                    
                                        

జూబ్లీహిల్స్ ప్రచారంలో నిర్లక్ష్యం వద్దు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ నిర్లక్ష్యం చూపించవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు. - 
                                    
                                        

వ్యవసాయ విద్యలో సంయుక్త బీఎస్సీ కోర్సు
దేశంలో తొలిసారిగా.. నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ కోర్సును సంయుక్తంగా నిర్వహించేందుకు తెలంగాణ అగ్రి వర్సిటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెస్టర్న్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. - 
                                    
                                        

మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలోని 3 వేల మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా.. మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విన్నవించారు. - 
                                    
                                        

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం నిర్వహించండి
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఆరోగ్య కార్డుల జారీపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఉద్యోగుల ఐకాస (టీజీఈజాక్) కోరింది. - 
                                    
                                        

ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. మహారాష్ట్రకు సంబంధించి ఇలాంటి కేసుపైనే ఏప్రిల్ 22న సుప్రీంకోర్టులోని మరో ధర్మాసనం... - 
                                    
                                        

ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే!
తెలంగాణ హైకోర్టులో తనను జడ్జిగా నియమించాలంటూ జి.వి.సర్వన్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. - 
                                    
                                        

కేకు.. ఆలోచన కేక
ఇక్కడ కేకులపై కనిపిస్తున్న చిత్రాలు హైదరాబాద్లోని ట్రాఫిక్ జంక్షన్లవి. మరి ఇలా కేకులపై ఎందుకు ఏర్పాటు చేశారు అనుకుంటున్నారా? నగరంలో సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన కూడళ్లను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ... - 
                                    
                                        

రైల్వే స్టేషన్లే విద్యుత్ కేంద్రాలు
రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫారాలపై లైట్లు, ఫ్యాన్లు, అనౌన్స్మెంట్ సిస్టమ్, టికెట్ కౌంటర్లు.. ఇలా అన్నింటికి కలిపి పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 55 రైల్వేస్టేషన్లు, కార్యాలయ భవనాలకు ఇప్పుడు ఆ శక్తి సూర్యుడి నుంచే అందుతోంది. - 
                                    
                                        

ఓటు వేటలో నాగసాధువులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్కు మద్దతుగా వారణాసి నుంచి వచ్చిన 11 మంది సోమవారం ప్రచారం నిర్వహించారు. - 
                                    
                                        

రామచక్కని సీతమ్మకు.. చక్కనైన గజవాహనం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి హైదరాబాద్కు చెందిన శంకర్నారాయణ-రాజ్యలక్ష్మి అనే దంపతులు రెండ్రోజుల కిందట రూ.40 లక్షల విలువైన రజత గజ వాహనాన్ని అందజేశారు. - 
                                    
                                        

కడలుంగీ.. రఘునాథపురం టు ఉగాండా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో మరమగ్గాలపైన రూపుదిద్దుకుంటున్న కడలుంగీ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక్కడి నుంచి తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా దేశానికి సరఫరా అవుతోంది. - 
                                    
                                        

హైకోర్టు ఉద్యోగిని తెలంగాణకు తిరిగి కేటాయించడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన పీవీ సతీష్కుమార్ అనే హైకోర్టు ఉద్యోగిని తిరిగి తెలంగాణకు కేటాయించడానికి నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయడానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తంచేసింది. - 
                                    
                                        

జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం
వ్యాపార విస్తరణలో భాగంగా మరో జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. నాగ్పుర్లోని కేంద్ర గనులశాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం.. - 
                                    
                                        

పత్తి కొనుగోళ్లు.. ఏడు క్వింటాళ్లకు కుదింపు
భారత పత్తి సంస్థ(సీసీఐ) తాజాగా మరో కఠిన నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఎకరాకు సగటున 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసే నిబంధనలను సోమవారం నుంచి కేవలం 7 క్వింటాళ్లకే పరిమితం చేయటం విస్మయానికి గురిచేసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 - 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 


