Jubilee Hills Bypoll: జూబ్లీ‘త్రి’ల్స్
రసవత్తరంగా ఉపఎన్నిక
ప్రత్యర్థి బలంగా ఉన్న బస్తీలపై గురి  
మోహరించిన ప్రధాన పార్టీల పదాతి దళాలు
కీలకంగా రహ్మత్నగర్, ఎర్రగడ్డ, షేక్పేట
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

జూబ్లీహిల్స్... ఈ ఉప ఎన్నికలో గెలుపు.. మరెన్నో మలుపులకు మూలం కావొచ్చని భావిస్తున్న ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. విజయాన్ని దక్కించుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ జారవిడుచుకోకూడదని వ్యూహ.. ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. నియోజకవర్గంలో నాలుగు లక్షల మంది ఓటర్లున్నా అందులో 50 శాతం మందే అభ్యర్థుల తలరాతలు మార్చవచ్చని నేతలు విశ్వసిస్తున్నారు. 2009లో 52.76 శాతం, 2014లో 50.18 శాతం, 2018లో 45.59 శాతం, 2023లో 47.49 శాతం ఓట్లు పోలవడమే తాము ఇలా విశ్లేషించడానికి కారణమని చెబుతున్నారు. అంటే మొత్తం ఓట్లలో 30 శాతం ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థికి గెలుపు నల్లేరుపై నడకే. ఏడు డివిజన్లు ఉన్న ‘హిల్స్’ను గుప్పెట పట్టేందుకు పార్టీలు బలగాలను మోహరించాయి. ఏ ఓటరు ఎక్కడున్నారు.. ప్రత్యర్థి ప్రాంతాలు ఏవి.. ఏ సంఘాన్ని మచ్చిక చేసుకుంటే ఓట్లు మళ్లుతాయనే వ్యూహాలు ఇక్కడ గంట గంటకూ పదును తేలుతున్నాయి. ఈ నెల 11న జరిగే ఉప ఎన్నికలో సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత రాష్ట్ర సమితి నుంచి మాగంటి సునీత గోపీనాథ్, అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, భాజపా నుంచి లంకల దీపక్రెడ్డి బరిలోకి దిగగా ఆయా పార్టీలు అభ్యర్థుల విజయం కోసం అహరహం శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు.. భారత రాష్ట్ర సమితి నుంచి కేటీఆర్, హరీశ్రావు ఇతర నేతలు.. భాజపా నుంచి కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ ఇతర నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. బస్తీల్లో ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు.
ఎర్రగడ్డ, షేక్పేట, బోరబండల్లో మైనారిటీలు కీలకం
ఎక్కువ ఓటర్లు ఉన్న రహ్మత్నగర్, ఎర్రగడ్డ, షేక్పేట డివిజన్లే ప్రధానంగా అభ్యర్థి విజయాన్ని నిర్ణయించనున్నాయి. మైనారిటీ ఓటర్లు ఉన్న బోరబండకూ ప్రత్యేక స్థానం ఉంది. పేరుకే జూబ్లీహిల్స్ అయినప్పటికీ కాలనీలు, బస్తీలు, మురికివాడలే అధికం. రహ్మత్నగర్లో దాదాపు 70 వేల ఓట్లు ఉన్నట్లు అంచనా. గడిచిన శాసనసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పోటీ పడ్డాయి. భారత రాష్ట్ర సమితి ముందు నిలిచింది. లోక్సభకు వచ్చేసరికి కాంగ్రెస్ పుంజుకుంది. ఎర్రగడ్డ, షేక్పేట, బోరబండల్లో మైనారిటీలు కీలకం. ఈ నియోజకవర్గం మొత్తంలో 1.10 లక్షలకు పైగా మైనారిటీ ఓటర్లు ఉంటారని పార్టీలు అంచనా వేస్తుండగా ఈ నాలుగు డివిజన్ల పరిధిలోనే ఎక్కువ మంది ఉన్నారు.
బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో...
ఈ ఉప ఎన్నికలో బీసీ ఓటు కూడా కీలకంగా మారింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా బీసీల రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీసీలు సంఘటితం అయ్యారని అంచనా వేస్తున్న పార్టీలు వారిని ఆకట్టుకునే ప్రణాళికలు రచిస్తున్నాయి. వెంగళరావునగర్, సోమాజిగూడ, యూసుఫ్గూడ ప్రాంతాల్లో పలు చేతివృత్తుల కాలనీలు ఉన్నాయి. గౌడలు, మున్నూరుకాపులు, యాదవులు తదితర బీసీ వర్గాల ఓట్లు ఉప ఎన్నికలో ప్రధానమవుతున్నాయి. క్రైస్తవ సంఘాల్లో కూడా బీసీలు ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీసీలు వివిధ పార్టీల కింద విస్తరించి ఉన్నారు. పార్టీల నాయకులు.. ఆయా సంఘాల నేతలను పిలిపించుకుని చర్చిస్తున్నారు. వెంగళరావునగర్తోపాటు సోమాజిగూడ డివిజన్లో గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద పెద్ద అపార్టుమెంట్లు ఉన్నాయి. వీటిలో ఒకేచోట పెద్ద సంఖ్యలో ఓటర్లు నివసిస్తున్నారు. దీంతో ఆయా సంఘాల వారితో కొందరు పార్టీ బాధ్యులు ఒప్పందాలు చేసుకుంటున్నారు. కొన్ని కాలనీలకు చెందిన ముస్లిం, క్రైస్తవ మత పెద్దలతోనూ మాట్లాడుతున్నారు.
ఎక్కడికక్కడ హామీలు గుప్పిస్తూ జోరుగా ప్రచారం
ఓటర్లను ఆకర్షించడం ఒక ఎత్తు కాగా గత శాసనసభ, లోక్సభ, నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కడ ఆధిక్యత వచ్చిందన్నదానిపై నాయకులు దృష్టి పెడుతున్నారు. ప్రత్యర్థికి పోలయ్యే వాటిని కొల్లగొట్టడమే లక్ష్యం అని ఓ పార్టీకి చెందిన డివిజన్ ఇన్ఛార్జి పేర్కొన్నారు. షేక్పేటలో గత శాసనసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కన్నా కాంగ్రెస్కు ఎక్కువ ఆధిక్యత వచ్చింది. లోక్సభ ఎన్నికల్లోనూ అంతే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి ఓటెత్తారు. బోరబండ డివిజన్లో 65 వేల ఓట్లుండగా లోక్సభ ఎన్నికల్లో మినహా అన్ని ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితివైపే ఓటర్లు ఉన్నారు. రహ్మత్నగర్ డివిజన్లో కార్మికులు ఎక్కువ. జీహెచ్ఎంసీ, గత శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు భారత రాష్ట్ర సమితివైపు ఉండగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మొగ్గుచూపారు. యూసుఫ్గూడలో ఈ రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్లు ఉంటూ వస్తున్నాయి. దీంతో ప్రత్యర్థి బలంగా ఉన్న కాలనీలు, బస్తీలపై నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలను తీరుస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు బాగు చేయడం, సంఘాలకు టెంటు సామగ్రి కొనివ్వడం లాంటి భరోసాలు ఉంటున్నాయి.
జిల్లాల నుంచి కార్యకర్తలు
నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాల పరిధిలో 4.01 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రానికి వంద మందిని ఒక పార్టీ, పది మంది ప్రత్యేక ఇన్ఛార్జులను మరొక పార్టీ, తగినంత మంది ప్రచారక్లను ఇంకో పార్టీ నియమించుకున్నాయి. ప్రధాన పార్టీలు ఇతర జిల్లాల నుంచి మెరికల్లాంటి కార్యకర్తలను తీసుకొస్తున్నాయి. వరంగల్, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్ తదితర జిల్లాల నుంచి రెండు రోజులకు వంద మందిని ఓ పార్టీ ప్రచార బరిలోకి దింపుతోంది. మరోపార్టీ కీలక నేతను ఇన్ఛార్జిగా నియమించి ప్రతి వంద మంది ఓటర్లను కలిసేందుకు ఒక బృందాన్ని సిద్ధం చేసుకుంది. కొందరు అభ్యర్థులు ప్రచారానికి ఆటోలను, ద్విచక్రవాహనాలను అద్దెకు తీసుకుని నిత్యం ర్యాలీలు తీస్తున్నారు.
వీధి వీధి తిరుగుతూ ఓటర్ల లెక్కలు...

వీరిద్దరు ఎన్నికల సిబ్బంది కాదు. ఓ పార్టీ తరఫున వీధి వీధి తిరుగుతూ ఓటర్ల లెక్కలు తీస్తున్నారు. డిగ్రీ చదువుతున్న వీరికి.. రోజుకు ఐదు షీట్ల వివరాలను నమోదు చేయడం లక్ష్యం. ప్రతిఫలంగా రూ.500 ఇస్తున్నారని చెబుతున్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న కుటుంబాల వివరాలేమిటి... వారంతా ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు... దొంగ ఓట్లు ఉన్నాయా.. చనిపోయిన వారెవరైనా జాబితాలో ఉన్నారా అంటూ ఆరా తీస్తున్నారు.
డిజి ప్రచారం...
పలు పార్టీలు సరికొత్త ప్రచారానికి తెరతీశాయి. డిజిటల్ తెరలు కూడళ్లలో ఆకర్షిస్తున్నాయి. రోడ్ షోలలో లేజర్ బీంలతో ప్రదర్శన ఉంటోంది. ఎల్ఈడీ స్క్రీన్లతో పార్టీ గుర్తులను ప్రదర్శిస్తున్నారు. సెన్సర్లు, లేజర్ బీంలతో పార్టీ గుర్తు, లయబద్ధమైన పాటలతో ఒక పార్టీ ఆకట్టుకుంటోంది. కొన్ని పార్టీలు ప్రత్యేకంగా సోషల్ మీడియా వార్ రూంలు నడిపిస్తున్నాయి. ప్రత్యర్థి లోపాలను అనుకూలంగా మార్చుకుంటున్నారు. కొందరు లేని మీడియా ఛానెళ్లు, పత్రికల పేర్లతో కంటెంట్ను సామాజిక మాధ్యమాలలో పోస్టు చేస్తూ తమను తికమకకు గురిచేస్తున్నారని ఓటర్లు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ధర్మపురి ఆలయాన్నిసమగ్రంగా అభివృద్ధి చేస్తాం
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకూ సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. - 
                                    
                                        

ఏడు క్వింటాళ్ల పరిమితి నిబంధనను సీసీఐ ఎత్తివేయాలి
ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. - 
                                    
                                        

నెలాఖరులోగా ఉచిత చేపపిల్లల పంపిణీ
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. రూ.123 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. - 
                                    
                                        

జూబ్లీహిల్స్ ప్రచారంలో నిర్లక్ష్యం వద్దు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ నిర్లక్ష్యం చూపించవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు. - 
                                    
                                        

వ్యవసాయ విద్యలో సంయుక్త బీఎస్సీ కోర్సు
దేశంలో తొలిసారిగా.. నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ కోర్సును సంయుక్తంగా నిర్వహించేందుకు తెలంగాణ అగ్రి వర్సిటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెస్టర్న్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. - 
                                    
                                        

మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలోని 3 వేల మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా.. మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విన్నవించారు. - 
                                    
                                        

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం నిర్వహించండి
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఆరోగ్య కార్డుల జారీపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఉద్యోగుల ఐకాస (టీజీఈజాక్) కోరింది. - 
                                    
                                        

ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. మహారాష్ట్రకు సంబంధించి ఇలాంటి కేసుపైనే ఏప్రిల్ 22న సుప్రీంకోర్టులోని మరో ధర్మాసనం... - 
                                    
                                        

ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే!
తెలంగాణ హైకోర్టులో తనను జడ్జిగా నియమించాలంటూ జి.వి.సర్వన్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. - 
                                    
                                        

కేకు.. ఆలోచన కేక
ఇక్కడ కేకులపై కనిపిస్తున్న చిత్రాలు హైదరాబాద్లోని ట్రాఫిక్ జంక్షన్లవి. మరి ఇలా కేకులపై ఎందుకు ఏర్పాటు చేశారు అనుకుంటున్నారా? నగరంలో సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన కూడళ్లను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ... - 
                                    
                                        

రైల్వే స్టేషన్లే విద్యుత్ కేంద్రాలు
రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫారాలపై లైట్లు, ఫ్యాన్లు, అనౌన్స్మెంట్ సిస్టమ్, టికెట్ కౌంటర్లు.. ఇలా అన్నింటికి కలిపి పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 55 రైల్వేస్టేషన్లు, కార్యాలయ భవనాలకు ఇప్పుడు ఆ శక్తి సూర్యుడి నుంచే అందుతోంది. - 
                                    
                                        

ఓటు వేటలో నాగసాధువులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్కు మద్దతుగా వారణాసి నుంచి వచ్చిన 11 మంది సోమవారం ప్రచారం నిర్వహించారు. - 
                                    
                                        

రామచక్కని సీతమ్మకు.. చక్కనైన గజవాహనం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి హైదరాబాద్కు చెందిన శంకర్నారాయణ-రాజ్యలక్ష్మి అనే దంపతులు రెండ్రోజుల కిందట రూ.40 లక్షల విలువైన రజత గజ వాహనాన్ని అందజేశారు. - 
                                    
                                        

కడలుంగీ.. రఘునాథపురం టు ఉగాండా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో మరమగ్గాలపైన రూపుదిద్దుకుంటున్న కడలుంగీ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక్కడి నుంచి తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా దేశానికి సరఫరా అవుతోంది. - 
                                    
                                        

హైకోర్టు ఉద్యోగిని తెలంగాణకు తిరిగి కేటాయించడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన పీవీ సతీష్కుమార్ అనే హైకోర్టు ఉద్యోగిని తిరిగి తెలంగాణకు కేటాయించడానికి నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయడానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తంచేసింది. - 
                                    
                                        

జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం
వ్యాపార విస్తరణలో భాగంగా మరో జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. నాగ్పుర్లోని కేంద్ర గనులశాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం.. - 
                                    
                                        

పత్తి కొనుగోళ్లు.. ఏడు క్వింటాళ్లకు కుదింపు
భారత పత్తి సంస్థ(సీసీఐ) తాజాగా మరో కఠిన నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఎకరాకు సగటున 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసే నిబంధనలను సోమవారం నుంచి కేవలం 7 క్వింటాళ్లకే పరిమితం చేయటం విస్మయానికి గురిచేసింది. - 
                                    
                                        

వరద సహాయక చర్యలపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీవర్షాలకు నష్టపోయిన రైతులు, ప్రజలను ఆదుకోవడానికి తీసుకున్న సహాయక చర్యలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. - 
                                    
                                        

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన డిసెంబరు 19 నుంచి
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన(38వ) డిసెంబరు 19 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ప్రకటించింది. - 
                                    
                                        

సగం బకాయిలిచ్చే వరకూ కళాశాలల బంద్
రాష్ట్రంలోని ఉన్నత విద్యా కళాశాలలకు ప్రభుత్వం బకాయిపడిన ఫీజు రీయింబర్స్మెంట్లో 50 శాతం.. అంటే రూ.5వేల కోట్లు చెల్లించేవరకు కళాశాలల బంద్ కొనసాగుతుందని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాల సమాఖ్య తేల్చి చెప్పింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


