overseas scholarship dues: విద్యార్థుల ఖాతాల్లో విదేశీవిద్య బకాయిలు

Eenadu icon
By Telangana News Desk Published : 31 Oct 2025 04:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

రూ.304 కోట్లు విడుదల చేశాం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విదేశీవిద్య పథకం బకాయిలు రూ.304 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ తెలిపారు. 2,228 మంది విద్యార్థులకు పెండింగ్‌ ఉపకార వేతనాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. గురువారమిక్కడ సచివాలయంలో సంక్షేమశాఖల ఉన్నతాధికారులు సబ్యసాచిఘోష్, బుద్ధప్రకాశ్, క్షితిజ, సర్వేశ్వర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేసినట్లు వెల్లడించారు. ‘‘దరఖాస్తులు పరిశీలించి ఈ పథకానికి అర్హులను ఎంపిక చేస్తున్నాం. ఏదైనా సాంకేతిక సమస్యలతో అర్హత ఉన్నవారికి నిధులు విడుదల కాకుంటే ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 3,642 మంది విద్యార్థులకు రూ.463 కోట్లు ఇచ్చాం. ప్రస్తుతం విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు అనుకూల పరిస్థితులు లేని సమయంలో ప్రభుత్వమిచ్చే ఉపకారవేతనంతో కొంత ఉపశమనం కలుగుతుంది. సంక్షేమ వసతి గృహాల్లో తక్షణ సమస్యల పరిష్కారం కోసం రూ.60 కోట్లు ఇచ్చాం. నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు. అధికారులు నిరంతరం వసతిగృహాలు, గురుకులాలు సందర్శిస్తూ అక్కడి సమస్యలు వెంటనే పరిష్కరించాలి’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని