Forest Land: ఆ 22 లక్షల ఎకరాల అటవీ భూములు ఎక్కడ?
రాష్ట్రంలో అటవీ ప్రాంతాల విస్తీర్ణం ఎంతన్న విషయంపై సందిగ్ధం నెలకొంది. అటవీశాఖ రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం అటవీ భూముల విస్తీర్ణం 66.33 లక్షల ఎకరాలు.
అటవీశాఖ రికార్డుల్లో 66.33 లక్షల ఎకరాలు
అందులో నోటిఫై చేసిన భూములు 65.12 లక్షలు
కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో 43.05 లక్షలే
రెవెన్యూ, అటవీ శాఖల రికార్డుల మధ్య భారీగా అంతరం!
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో అటవీ ప్రాంతాల విస్తీర్ణం ఎంతన్న విషయంపై సందిగ్ధం నెలకొంది. అటవీశాఖ రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం అటవీ భూముల విస్తీర్ణం 66.33 లక్షల ఎకరాలు. ఇందులో నోటిఫైడ్ అటవీ బ్లాక్లనే పరిగణనలోకి తీసుకుంటే ఆ విస్తీర్ణం 65.12 లక్షల ఎకరాలు. అయితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర అటవీశాఖ పంపిన నివేదికలో మాత్రం ఆ విస్తీర్ణం 43.05 లక్షల ఎకరాలుగా ఉంది. మిగిలిన 22 లక్షల ఎకరాల అటవీ భూములు ఏమైపోయాయన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
భౌగోళిక విస్తీర్ణంలో 24 శాతం
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 2,77,10,412 ఎకరాలు. అటవీ చట్టం ప్రకారం అందులో అటవీ ప్రాంతం 66,33,312 ఎకరాలు. అంటే రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో దాదాపు 24 శాతం అటవీ ప్రాంతమే. కేంద్ర అటవీశాఖ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ (ఐజీ)కి రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్) ఆర్.ఎం.డోబ్రియాల్ ఇటీవల పంపిన నివేదికలో జిల్లాలవారీగా అటవీ భూముల వివరాల్ని పొందుపరిచారు. అందులో మొత్తం అటవీ భూములు 43.05 లక్షల ఎకరాలుగా పేర్కొన్నారు. ఇవి రెవెన్యూశాఖ గుర్తించిన అటవీ భూములని, తెలంగాణ సీసీఎల్ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) నుంచి తీసుకున్న వివరాలని తెలిపారు. టీఎన్ గోదావర్మన్ కేసుకు సంబంధించిన అంశంలో దేశంలో అటవీ భూములకు సంబంధించిన వివరాలను 2024 మార్చి 31కల్లా పంపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలు అడవులుగా గుర్తించిన భూముల వివరాల్ని పంపాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పీసీసీఎఫ్ అటవీ భూముల వివరాల్ని కేంద్ర అటవీశాఖకు పంపించారు. నోటిఫైడ్ ఫారెస్టు బ్లాక్లతో పాటు వివిధ కేటగిరీల కింద రెవెన్యూ రికార్డుల్లో నమోదైన అటవీ ప్రాంతాలని అందులో వివరించారు.
అటవీ చట్టం ప్రకారం మరో జాబితా..
తెలంగాణలో అటవీ భూములకు సంబంధించి మరో జాబితాను కూడా పీసీసీఎఫ్ పంపించారు. అటవీ చట్టం ప్రకారం గుర్తించిన భూములంటూ జిల్లాల వారీగా వివరాల్ని పొందుపరిచారు. అందులో వివిధ సెక్షన్ల కింద మూడు రకాల నోటిఫైడ్ అటవీ బ్లాకుల కింద భూములు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 65.12 లక్షల ఎకరాలు. అదేవిధంగా నోటిఫై చేయని అటవీ బ్లాక్లంటూ సుమారు 1.20 లక్షల ఎకరాల భూముల్ని పేర్కొన్నారు.
రెండు శాఖల రికార్డులు వేర్వేరు!
అటవీ భూములకు సంబంధించి అటు రెవెన్యూ, ఇటు అటవీ శాఖల రికార్డులు వేర్వేరుగా ఉన్నాయి. రెండింటి మధ్య నోటిఫైడ్ అటవీ బ్లాక్ల విస్తీర్ణం అంతరం 22 లక్షల ఎకరాలకు పైచిలుకు. నోటిఫై చేయనివి కూడా కలిపితే తేడా 23.28 లక్షల ఎకరాలు. రికార్డులు వేర్వేరుగా ఉండటం సమస్యగా మారింది. ఈ 23.28 లక్షల ఎకరాల భూమి ఎక్కడ ఉంది.. ఏ స్థితిలో ఉంది అన్నది తేలాల్సి ఉంది. నోటిఫైడ్ అటవీ బ్లాక్ల గణాంకాలను పరిశీలిస్తే..
- ఆదిలాబాద్లో జిల్లాలో అటవీశాఖ రికార్డుల ప్రకారం అటవీ భూమి విస్తీర్ణం 4,43,729.42 ఎకరాలు కాగా, రెవెన్యూశాఖ శాఖ రికార్డుల్లో 1,28,525 ఎకరాలే ఉంది.
- కొత్తగూడెం జిల్లాలో అటవీశాఖ రికార్డుల ప్రకారం 10,08,720.81 ఎకరాలు ఉండగా.. రెవెన్యూశాఖ గుర్తించిన అటవీభూమి 9,52,943 ఎకరాలు మాత్రమే.
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీశాఖ రికార్డుల ప్రకారం అటవీ భూమి 4,92,674.50 ఎకరాలు కాగా.. రెవెన్యూ రికార్డుల్లో 4,09,587 ఎకరాలే ఉంది.
- ములుగు జిల్లాలో అటవీశాఖ రికార్డుల ప్రకారం అటవీ భూమి 7,18,940 ఎకరాలు కాగా.. రెవెన్యూ రికార్డుల్లో 4,42,094 ఎకరాలే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ