Telangana: రోజూ 90 శాతం విద్యార్థుల హాజరు తప్పనిసరి
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో రోజూ 90 శాతానికిపైగా విద్యార్థుల హాజరు ఉండాలని విద్యాశాఖను ఆదేశించింది.
ప్రతి నెలా 4వ శనివారం ‘నో బ్యాగ్ డే’
జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట
ఈ విద్యాసంవత్సరం మొత్తం పని రోజులు 229
పాఠశాల విద్య అకడమిక్ క్యాలెండరు విడుదల
ఈనాడు, హైదరాబాద్
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో రోజూ 90 శాతానికిపైగా విద్యార్థుల హాజరు ఉండాలని విద్యాశాఖను ఆదేశించింది. ‘విద్యాహక్కు చట్టం-2009’.. తరగతులు, సబ్జెక్టుల వారీగా పిల్లలు నేర్చుకోవాల్సిన అంశాలను నిర్దేశించినందున లక్ష్య సాధనకు పిల్లలు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలని పేర్కొంది. ప్రభుత్వం కొత్త విద్యాసంవత్సరానికి(2024-25) సంబంధించిన అకడమిక్ క్యాలెండరును విడుదల చేసి, మార్గదర్శకాలు వెలువరించింది. వాటిని అమలు చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులను ఆదేశించారు.
నిర్దేశిత విద్యా సామర్థ్యాల సాధనకు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్.. ఇలా అన్ని రకాల పాఠశాలల్లో రోజూ 90 శాతానికిపైగా విద్యార్థులు హాజరవ్వాలని, అందుకు వారి తల్లిదండ్రులు, విద్యా కమిటీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రధానోపాధ్యాయులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో మాదిరిగానే ఈ సారీ ప్రతి నెలా 4వ శనివారం ‘నో బ్యాగ్ డే’ను అమలుచేయాలి. రోజూ 30 నిమిషాల పాటు పాఠ్యపుస్తకాలు, కథల పుస్తకాలు, దినపత్రికలు, మేగజైన్లు చదివించాలి. టీవీ పాఠాలను యథావిధిగా ప్రసారం చేయాలి. విద్యార్థులతో 5 నిమిషాలు యోగా, ధ్యానం చేయించాలి. జనవరి 10 నాటికి పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి.
మరికొన్ని ముఖ్యాంశాలు..
- జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి. పట్టణాలు, గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి విద్యార్థులను బడుల్లో చేర్పించాలి.
- ఒకటో తరగతిలో చేరే పిల్లల్ని పాఠశాలకు సన్నద్ధం చేసేందుకు జూన్లో 3, జులైలో 4, ఆగస్టులో 5 వారాలు విద్యా ప్రవేశ్ను అమలు చేయాలి. మిగిలిన తరగతులకు జూన్ 12 నుంచి 30 వరకు బ్రిడ్జి కోర్సును అమలు చేయాలి. గతేడాది పాఠ్యాంశాలను బోధించాలి.
- ప్రతినెలా మూడో శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలి.
- ప్రతి నెల మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు నిర్వహించాలి. ఆ సందర్భంగా తీసుకున్న తీర్మానాలను నమోదు చేయాలి.
- సంవత్సరంలో 10 రోజులు (ప్రతి నెలా నాలుగో శనివారం) పిల్లలు పుస్తకాల సంచి లేకుండా బడులకు రావాలి.
- చివరి పనిదినం: 2025 ఏప్రిల్ 23వ తేదీ
- వేసవి సెలవులు: 2025 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు
- పనిదినాలు: మొత్తం 229 రోజులు.
సెలవులు ఇలా..
- దసరా సెలవులు ఈ సారీ 13 రోజులే ఇచ్చారు. 2023-24 విద్యాసంవత్సరం వరకు 14 రోజులు ఉండేవి. క్రిస్మస్ సెలవులు కూడా అయిదు రోజులే.
- దసరా: అక్టోబరు 2- 14వ తేదీ వరకు
- క్రిస్మస్: డిసెంబరు 23- 27వ తేదీ వరకు
- సంక్రాంతి: 2025 జనవరి 13-17 వరకు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతిపితపై అభిమానం.. ఇంటి ప్రహరీపై విగ్రహం
మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధులు దేశానికి చేసిన సేవలను భావితరాలు గుర్తుంచుకునేలా వారి విగ్రహాలను ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయడం సర్వసాధారణమే. -
సైబర్ వలతో విలవిల.. మాతృభూమికి రప్పించడం ఎలా?
ఉద్యోగాలపై ఆశతో కంబోడియా వెళ్లి.. అక్కడి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని నరకం చూస్తున్న తెలంగాణ యువత రక్షణపై అధికారులు దృష్టి సారించారు. -
చుక్క రక్తం తీయకుండా ఐదు నిమిషాల్లో ఫలితాలు
ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా యాంటీ బయాటిక్ మందుల వాడకం పెరిగింది. దీన్ని నియంత్రించేందుకు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ విద్యా సంస్థ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆస్పైర్ బయోనెస్ట్లోని సైన్ వి అంకుర సంస్థ కలిసి కంప్యూటర్ సాఫ్ట్వేర్ను రూపొందించాయి. -
జగన్ ఇంటి బయట కూల్చివేతలు.. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్పై బదిలీ వేటు
హైదరాబాద్ లోటస్ పాండ్లో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి నివాసం ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశం.. ఓ అధికారి బదిలీకి దారితీసింది. -
పట్టాలెక్కని ప్రాజెక్టులు
రాష్ట్రంలో ప్రతిపాదిత రైల్వే లైన్ల తుది సర్వేలు త్వరితగతిన పూర్తి కావాలన్నా.. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు జులైలో కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో అధిక నిధులు మంజూరు చేయాలన్నా ఎంపీల ఒత్తిడి ఉండాలి. -
వార్డెన్ పోస్టులకు 24 నుంచి పరీక్షలు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, చిన్నారుల సంక్షేమ వసతి గృహాల్లో 581 వసతిగృహ సంక్షేమాధికారులు, వార్డెన్లు, మాట్రన్, లేడీ సూపర్వైజర్ పోస్టులకు (ఉద్యోగ ప్రకటన నం.25/2022) ఈ నెల 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. -
సిట్ చేతికి సాంకేతిక ఆధారాలు!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)లో చట్టవిరుద్ధంగా సాగిన ఫోన్ట్యాపింగ్ దందాపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. -
పత్రికా రంగానికి మార్గదర్శి
పత్రికా రంగంపై, తెలుగు ప్రజలపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని..ఆయన జీవితం నుంచి సాహసం, పట్టుదల, దార్శనికత వంటి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు పేర్కొన్నారు. -
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కాల్సిందే
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కాల్సిందేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. -
జనం సొమ్ముతో... జగన్ మాయామహల్
అణువణువునా పెత్తందారీ మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకుని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులతో ఊరూరా ప్యాలెస్లు నిర్మించుకున్నా సంతృప్తి చెందని జగన్.. ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తిచేసిన ఏకైక ప్రాజెక్టు ఏంటో తెలుసా? విశాఖలోని రుషికొండపై తన కోసం రాజభవనాల్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లు మరిన్ని కట్టుకోవడం..! అయితే... -
నిఘా ఉపగ్రహ పరిజ్ఞానంతో దోమల వేట
వర్షాలు మొదలుకాగానే దోమల తాకిడి పెరుగుతుంది. వీటి బెడదను వదిలించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. -
జాలిపడేలా కాదు.. ఈర్ష్యపడేలా ఎదగాలన్న రామోజీరావు
జాలిపడేలా కాకుండా ఎదుటివారు ఈర్ష్యపడేలా ఎదగాలన్న జీవిత సత్యాన్ని చెప్పి.. ఆచరించి చూపిన స్ఫూర్తిప్రదాత రామోజీరావు అని సినీ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ అన్నారు. -
రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరనిలోటు: ఈటల
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అరుదైన వ్యక్తి అని.. ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని భాజపా ముఖ్య నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. -
భక్తజనంతో మురిసిన బాసర
దశమి, ఏకాదశి కలిసి రావడంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 30 వేల మంది భక్తులు తరలివచ్చారు. -
పాస్బుక్లు, రేషన్కార్డులున్న వారికే రుణమాఫీ!
పంద్రాగస్టులోపు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు విధివిధానాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
అధికారులను అవమానిస్తున్న కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలి
జిల్లా, డివిజన్, మండల స్థాయుల్లో అధికారుల పట్ల అవమానకరంగా, అనుచితంగా ప్రవర్తిస్తున్న కొంత మంది కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గెజిటెడ్ అధికారుల(టీజీవో) సంఘం డిమాండ్ చేసింది. -
నేర చరిత్ర ఉన్నవారిని పనుల్లో పెట్టుకోకూడదు: మంత్రి శ్రీధర్బాబు
వలస కూలీల నియామకాల్లో పరిశ్రమల యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. -
మేడిగడ్డలో భారీగా ఇసుక పూడిక
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మునక ప్రాంతంలో 92.77 లక్షల టన్నుల ఇసుక పూడికను తీయనున్నారు. -
ఎస్సైలుగానే పుష్కరకాలం!
పోలీసుశాఖలో పదోన్నతుల ప్రక్రియ తరచూ చర్చనీయాంశమవుతోంది. నిన్నమొన్నటి వరకు పాత జోన్ల మధ్య వివాదాలు తలెత్తగా... ఇప్పుడు కొత్తగా మల్టీజోన్లు ఏర్పాటైనా వీటికి పరిష్కారం కనిపించడంలేదు. -
ఆగస్టులో ‘ఫాక్స్కాన్’ ఉత్పత్తులు షురూ!
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘హోన్ హాయ్ టెక్నాలజీ’ గ్రూప్నకు చెందిన ‘ఫాక్స్కాన్’ సంస్థ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో ఉత్పత్తులను ప్రారంభించనుంది. -
తెలుగువారు గర్వించదగిన ఇంద్రజాలికుడు డా.బి.వి.పట్టాభిరాం
తెలుగువారు గర్వించదగిన ఇంద్రజాలికుడు డాక్టర్ బి.వి.పట్టాభిరాం అని పలువురు వక్తలు కొనియాడారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
-
దిల్లీ విమానాశ్రయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం.. బోర్డింగ్, చెక్-ఇన్లో ఇబ్బందులు
-
మరో కొత్త రకం స్కామ్.. అడ్వర్టైజ్మెంట్ పేరుతో ₹81 లక్షలకు టోకరా!
-
భాజపా జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి
-
అమెరికాను మించిన అణువేగం చైనా సొంతం..!
-
పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు