B.Tech Cources: సాయంత్రమూ బీటెక్ చదవొచ్చు
ఉద్యోగం చేసుకుంటూనే బీటెక్ చదివే అవకాశం వచ్చేసింది. ఒకవైపు కొలువు చేస్తూనే...వారాంతంలో రెండు రోజులపాటు తరగతులకు హాజరై ఇంజినీరింగ్ పూర్తి చేయవచ్చు.
పాలిటెక్నిక్ డిప్లొమా అర్హత తప్పనిసరి
ఓయూలో గతేడాదే ప్రారంభం
ఈ ఏడాది మరిన్ని కళాశాలలకు అనుమతి లభించే అవకాశం
ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగం చేసుకుంటూనే బీటెక్ చదివే అవకాశం వచ్చేసింది. ఒకవైపు కొలువు చేస్తూనే...వారాంతంలో రెండు రోజులపాటు తరగతులకు హాజరై ఇంజినీరింగ్ పూర్తి చేయవచ్చు. అదీ మూడేళ్లలోనే బీటెక్ పట్టా దక్కించుకోవచ్చు. కాకపోతే పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండటం తప్పనిసరి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) దేశవ్యాప్తంగా గత విద్యా సంవత్సరమే(2023-24) సాయంత్రం బీటెక్ కోర్సులకు పచ్చజెండా ఊపింది. తరగతుల నిర్వహణకు దేశంలో మొత్తం 137 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతి లభించగా రాష్ట్రంలో ఓయూ ఇంజినీరింగ్ కళాశాలకు అవకాశం దక్కింది. రాష్ట్రంలో గతేడాది మరో 11 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు ఏఐసీటీఈ నుంచి ఆమోదం లభించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఈ ఏడాది ఆ కళాశాలలతో పాటు మరి కొన్నింటికి అనుమతి లభించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ‘గతేడాది ప్రవేశాలు చేపట్టేందుకు సిద్ధమైనా జీఓ జారీ కాలేదు. ఈసారి మళ్లీ ఏఐసీటీఈ నుంచి రెన్యువల్కు దరఖాస్తు చేశాం’ అని స్టాన్లీ మెథడిస్ట్ ఇంజినీరింగ్ కళాశాలల ఛైర్మన్ కృష్ణారావు తెలిపారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల డిమాండు మేరకు...
పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన విద్యార్థుల్లో కనీసం 90 శాతం మంది చివరి సంవత్సరం పూర్తయిన వెంటనే బీటెక్ చదివితే వేతనం అధికంగా వస్తుందన్న భావనతో లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ రెండో ఏడాదిలో చేరుతున్నారు. దానికి తోడు ఉద్యోగంలో చేరితే భవిష్యత్తులో బీటెక్, ఎంటెక్ లాంటివి చదువుకునే అవకాశం ఉండదని భావించి డిప్లొమా పూర్తయిన వెంటనే బీటెక్లో (రాష్ట్రంలో ఈసెట్ ద్వారా) ప్రవేశం పొందుతున్నారు. దేశవ్యాప్తంగా డిప్లొమాతో ఉద్యోగాలు చేస్తున్న వేల మంది తమకు విద్యార్హత పెంచుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా గత విద్యా సంవత్సరం (2023-24) నుంచి సాయంత్రం బీటెక్ కోర్సులకు ఏఐసీటీఈ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సాయంత్రం కోర్సుల్లో చేరాలంటే కనీసం ఏడాదిపాటు ఉద్యోగ అనుభవం తప్పనిసరి. వారు నేరుగా బీటెక్ రెండో ఏడాదిలో చేరొచ్చు. ఒక బ్రాంచికి 30 నుంచి 60 సీట్ల దాకా ఉండొచ్చు. ఓయూలో గత సంవత్సరం సివిల్, మెకానికల్, ఏఐ అండ్ ఎంఎల్ కోర్సులను ప్రారంభించగా...ఈసారి ఎలక్ట్రికల్ బ్రాంచికి ఏఐసీటీఈ నుంచి అనుమతి వచ్చింది. ఒక్కో దాంట్లో 30 సీట్లు మాత్రమే ఉన్నాయి. కనీసం 10 మంది చేరితేనే తరగతులు నడపాల్సి ఉంటుంది. వారాంతంలో శని, ఆదివారాల్లో తరగతులు నిర్వహిస్తారు. జూన్ 10వ తేదీ నాటికి ఈ ఏడాది సాయంత్రం కోర్సులకు అనుమతులు పొందిన కళాశాలల సంఖ్య తెలుస్తుందని ఓ అధికారి తెలిపారు. గతేడాది సివిల్, మెకానికల్ బ్రాంచ్లకు మంచి స్పందన వచ్చిందని, అన్ని సీట్లు నిండాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి, ఓయూ ఇంజినీరింగ్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ ఆచార్య శ్రీరాం వెంకటేష్ చెప్పారు. త్వరలో నోటిఫికేషన్ వెలువడనుందని ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.