AI City: హైదరాబాద్లో 200 ఎకరాల్లో ఏఐ సిటీ
కృత్రిమ మేధ(ఏఐ)లో హైదరాబాద్ను ప్రపంచంలోనే సమున్నత స్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు
నార్సింగి, న్యూస్టుడే: కృత్రిమ మేధ(ఏఐ)లో హైదరాబాద్ను ప్రపంచంలోనే సమున్నత స్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఈ మేరకు నగరంలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. శుక్రవారం ఉదయం నార్సింగిలో తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గ్రీన్ యాన్యువల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ పదో సమ్మిట్-2024 నిర్వహించారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ... ‘‘ఐటీ పరిశ్రమలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం. హైదరాబాద్ను ఏఐ నగరంగా, ప్రపంచ ఏఐ రాజధానిగా తీర్చిదిద్దుతాం. జులైలో అంతర్జాతీయ ఏఐ సదస్సును నగరంలోనే నిర్వహిస్తాం. అందులో సంబంధిత రంగానికి చెందిన అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటారు. హైదరాబాద్లో ప్రపంచ స్థాయి స్కిల్ యూనివర్సిటీని సైతం స్థాపిస్తాం. దీనికి మేధావుల నుంచి సూచనలను ఆహ్వానించాం. వర్సిటీకి సంబంధించిన విధివిధానాలు రూపొందిస్తాం. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో సమూల మార్పులు చేసేందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సీఎం రేవంత్రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారు’’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశదిశలా దశాబ్ది సంబురం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. జూన్ 2న (ఆదివారం) ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న అవతరణ ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమయింది. -
బినామీ ఖాతాలతో మేశారు
గొర్రెల పథకం కుంభకోణంలో దళారులు, అధికారులు కలిసి సుమారు రూ.700 కోట్ల నిధులు కాజేసిన తీరు అవినీతి నిరోధక శాఖ(అనిశా) దర్యాప్తులో తేటతెల్లమైంది. -
హైదరాబాద్ ఇక తెలంగాణకే రాజధాని
తెలంగాణ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, ప్రజా పాలనను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్తు ప్రణాళికలు, సరికొత్త విధానాల రూపకల్పన మొదలైందన్నారు. -
పార్టీలకు అతీతంగా దశాబ్ది ఉత్సవాలు: మంత్రి పొన్నం
పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి జూపల్లి కృష్ణారావు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు శనివారం పరిశీలించారు. -
అణువణువూ పరిశీలన...
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించగా ఇందులో భాగమైన సాంకేతిక నిపుణుల బృందం శనివారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించింది. -
నేటి నుంచి టోల్ పెంపు
ఎన్హెచ్ఏఐ టోల్ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 3 (ఆదివారం అర్ధరాత్రి) నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుముల ధరలు పెంచుతుండగా.. ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించింది. -
న్యూజిలాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవాలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఆ దేశంలో ఆక్ల్యాండ్ నగరంలోని అవండేల్ కళాశాల ఆడిటోరియంలో శనివారం తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టఫర్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. -
గంజాయి సాగు చేస్తే రైతు భరోసా నిలిపివేత
తెలంగాణలో మాదక ద్రవ్యాలను, మత్తు పదార్థాల వ్యాపారాన్ని పూర్తిస్థాయిలో అరికట్టే ఉద్దేశంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. -
సింగరేణికి అత్యుత్తమ పనితీరు అవార్డు
సంస్థ విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సింగరేణి సంస్థకు, ఆ సంస్థ సీఎండీ బలరాంకు జాతీయ అవార్డులు దక్కాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్ (ఐఐఐఈ) సంస్థ ఈ అవార్డులకు ఎంపిక చేసింది. -
ఘనంగా కొండగట్టు అంజన్న జయంత్యుత్సవాలు
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన దీక్షాపరులు, భక్తుల రామ నామస్మరణతో క్షేత్రం మారుమోగింది. -
బ్యాంకులు ప్రజలకు ఇంకా దగ్గర కావాలి
టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల వేతన సవరణ జూన్ 1 శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త వేతనాలు జులైలో అందనున్నాయి. -
ఇదీ సంగతి!
-
శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు
శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 20 గంటలు పడుతోంది. శనివారం సాయంత్రానికి క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. -
అమల్లోకి ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ
టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల వేతన సవరణ జూన్ 1 శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త వేతనాలు జులైలో అందనున్నాయి. -
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్లపై మూడు నెలల్లో నివేదిక
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్లపై విచారణ జరిపి మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కమిటీ ఛైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి వెల్లడించారు. -
వాటాల బదలాయింపు కేసులో నిందితులను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
ఓ ప్రైవేటు కంపెనీలోని వాటాల బదలాయింపు కేసులో నిందితులైన రాజశేఖర్ తలసిల్ల, చంద్రశేఖర్ వేగెలను అరెస్ట్ చేయరాదంటూ ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
యాదాద్రి మే నెల ఆదాయం రూ.18.49 కోట్లు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మే నెలలో భక్తుల ద్వారా లభించిన ఆదాయ వివరాలను దేవస్థానం శనివారం విడుదల చేసింది. మే నెలలో ఆలయానికి అన్ని రకాల ఆదాయ మార్గాల ద్వారా రూ.18.49 కోట్లు సమకూరినట్లు దేవస్థానం వెల్లడించింది. -
విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రావొద్దు: భట్టి
త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా అన్ని స్థాయుల్లోని విద్యుత్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా వ్యూహాత్మక ప్రణాళిక అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆదేశించారు. -
రైతులకు మేలు చేసే పథకాలనే అమలు చేస్తాం
రాష్ట్రంలో అన్నదాతలకు అన్ని విధాలుగా మేలు కలిగించే పథకాలనే అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతుల సమగ్రాభివృద్ధి కోసం రైతు భరోసా, రుణమాఫీ, పంటల బీమాలను రూపొందిస్తున్నామన్నారు. -
సంక్షిప్త వార్తలు(9)
రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. కోస్తాంధ్రపై 1.5 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నట్లు వివరించింది.