Health tips: అంచెలంచెలుగా ఆరోగ్యం
హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్... ఇలా నగరం, పట్టణం ఏదైనా ఇటీవల అడుగుకో హోటల్ వెలుస్తోంది. ఇంటర్నెట్ పుణ్యమాని దేశవిదేశాల్లో దొరికే ఆహార పదార్థాలన్నీ మన వీధుల్లోకి వస్తున్నాయి.
గాడితప్పిన జీవనశైలిని ఒక్కసారిగా మార్చడం కష్టమే
రోజుకు 10 నిమిషాలతో వ్యాయామం ప్రారంభించాలి
మూడు వారాల్లో 30 నిమిషాలకు పెంచాలి
ఆహార నియమాలకూ అదే సూత్రం
ప్రఖ్యాత వైద్య సంస్థ ‘మయో క్లినిక్’ అధ్యయనంలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్... ఇలా నగరం, పట్టణం ఏదైనా ఇటీవల అడుగుకో హోటల్ వెలుస్తోంది. ఇంటర్నెట్ పుణ్యమాని దేశవిదేశాల్లో దొరికే ఆహార పదార్థాలన్నీ మన వీధుల్లోకి వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా... వద్దువద్దనుకుంటూనే ఇలాంటి ఆహారాన్ని రోజూ తింటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా మధుమేహం, కొలెస్ట్రాల్, రక్తపోటు బాధితులు పెరుగుతున్నారు. ఇవన్నీ నియంత్రణలో ఉండాలంటే క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం తప్పనిసరనేది అందరికీ తెలిసిందే. కానీ అత్యధికుల్లో ఆరంభ శూరత్వం ఉంటుంది. ఎలాగైనా వ్యాయామం చేయాలనే ఆలోచనతో కసిగానే ప్రారంభిస్తారు. వారంపాటు రోజుకు 30-40 నిమిషాలు నడుస్తారు. కొద్దిరోజులకే ఏదో ఒక వంకతో ఆపేస్తారు. చాలామంది ఉప్పు, చక్కెరలను ఉన్నట్టుండి తగ్గించేస్తారు. జిహ్వ చాపల్యం తట్టుకోలేక వారం తిరక్కముందే... మళ్లీ మొదటికొస్తారు. కొన్ని రోజులయ్యాక ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా? ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? హానికరమైన ఆహార పదార్థాల నుంచి, బద్ధకపు జీవన విధానం నుంచి విముక్తి లభించేదెలా... అంటూ మథనపడుతుంటారు. ఇలాంటి వారి కోసమే అమెరికాకు చెందిన ప్రఖ్యాత వైద్య సంస్థ ‘మయో క్లినిక్’ ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించింది. ‘ఆరోగ్యానికి ఒక్కో మెట్టు’పై నిర్వహించిన ఈ అధ్యయన నివేదికను ఇటీవల విడుదల చేసింది. దీర్ఘకాలం వ్యాయామాన్ని కొనసాగించాలంటే... అంచెలంచెలుగా శారీరక శ్రమను పెంచుకుంటూ పోవడమే సరైన మార్గమంది.
మూడు వారాల నుంచి మూడు నెలల ప్రణాళిక
ఆహారం, వ్యాయామం, నిద్ర, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ ఒక దానితో మరొకటి ముడిపడి ఉంటాయి. ఒక్కో దాన్ని నెమ్మదిగా గాడిలో పెట్టుకుంటూ వెళితే దీర్ఘకాల ప్రయోజనాలుంటాయి. మూడు వారాల నుంచి మూడు నెలల్లో మార్పు వచ్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. వీటిని కూడా ముందుగా ఒక వారానికి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ వారంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాక... మరో వారంలో ఇంకో లక్ష్యానికి సిద్ధమవ్వాలి. అలా ఒక్కో వారాన్ని అధిగమించుకుంటూ దీర్ఘకాల లక్ష్యం దిశగా దూసుకెళ్లాలి.
ఉప్పు, చక్కెర, జంక్ఫుడ్నూ ఒకేసారి పూర్తిగా మానొద్దు
అధిక కొవ్వు, ఎక్కువ ఉప్పు, మోతాదుకు మించిన చక్కెర ఉండే జంక్ఫుడ్కు దూరంగా ఉండాలనే లక్ష్యం పెట్టుకుని, తక్షణమే మానేయడం ఇబ్బందే. నిజానికి ఏళ్లుగా తింటున్న ఆ ఆహారమేమీ విషం కాదు. కానీ, ఎక్కువ తీసుకుంటే ముప్పు ఉంటుందనేది నిజం. అందుకే క్రమేణా ఈ అలవాటు నుంచి బయటపడాలి. రోజూ తీసుకునే వాటిని... తొలుత వారంలో రెండు రోజులు తినాలి. ఆ తర్వాత వారంలో ఒక రోజుకు పరిమితం చేయాలి. అనంతరం నెలా, రెణ్నెల్లకోసారి స్వల్ప మోతాదులో తినడం అలవర్చుకోవాలి. రోజుకోరకమైన అనారోగ్య ఆహారాన్ని తగ్గించి.. దాని బదులు పండ్లు, కూరగాయలు వంటివి అలవాటు చేసుకోవాలని అధ్యయనం సూచించింది. బరువు విషయంలోనూ నెల రోజుల్లో 15-20 కిలోలు తగ్గాలనే తరహాలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవద్దని, క్రమంగా తగ్గాలని సూచించింది.
అంచెలంచెల వ్యాయామంతో స్థిరత్వం...
సాధారణంగా వారానికి కనీసం ఐదు రోజులు.. రోజుకు కనీసం 30 నిమిషాలపాటు శారీరక వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే అసలు వ్యాయామమే చేయని వారికి ఇది కూడా ప్రారంభంలో చాలా కష్టమే. అలాంటి వారి కోసం మయో క్లినిక్ అధ్యయనం పలు కీలక సూచనలు చేసింది. తొలుత రోజుకు పది నిమిషాలతో శారీరక వ్యాయామాన్ని మొదలుపెట్టి... రెండు రోజులకోసారి ఐదు నిమిషాల చొప్పున పెంచుకుంటూ.. మూడు వారాల్లో రోజుకు 30 నిమిషాలపాటు శారీరక వ్యాయామం చేసేలా సిద్ధం కావాలని సూచించింది. ఇలా అంచెలంచెలుగా చేస్తే.. స్థిరత్వం ఉంటుందని, దీర్ఘకాలంపాటు వ్యాయామం చేయగలుగుతారంది.
ధూమపానానికి మినహాయింపులే వద్దు
ధూమపానాన్ని మాత్రం వెంటనే ఆపేయాలి. రోజుకు రెండు తగ్గిస్తామంటూ ముందుకెళితే.. ఎప్పటికీ ఆ ఊబిలోంచి బయటపడలేరు. ధూమపానాన్ని ఆపేసిన ఒక ఏడాది వ్యవధిలో దానివల్ల ఎదురయ్యే ముప్పు 50 శాతానికి తగ్గిపోతుంది. రెండేళ్లు ఆపేస్తే సాధారణ ఆరోగ్యం సమకూరుతుంది. ఉన్నట్టుండి సిగరెట్లు ఆపేయడం వల్ల దుష్ఫలితాలు ఎదురైతే.. ప్రత్యామ్నాయంగా నికోటిన్ ప్యాచెస్, గమ్స్ వంటి వాటిని వాడొచ్చని అధ్యయనం సూచించింది.
కంటి నిండా నిద్ర తప్పనిసరి
నిద్ర సరిగా పోకపోతే.. ఆ ప్రభావం మొత్తం దినచర్యపై పడుతుంది. ఆలస్యంగా నిద్రలేస్తే వ్యాయామం చేయడానికి సమయం ఉండదు. కొందరికైతే తినడానికి కూడా సమయం లేకుండా పరుగెత్తాల్సి వస్తుంది. నిద్ర తక్కువైతే... ‘క్రానిక్ స్ట్రెస్ సిండ్రోమ్’ వస్తుంది. దీనివల్ల కీళ్లు, కండరాలు, ఒళ్లు నొప్పులు వేధిస్తుంటాయి. అందుకని రోజుకు కనీసం ఏడు గంటలపాటు నిద్రపోవాలంది.
గుండె సహా అన్నింటికీ మేలు
నెమ్మదిగా మొదలుపెట్టి... ఆహార, వ్యాయామాల్లో స్థిరత్వాన్ని సాధిస్తే గుండె సహా అన్ని అవయవాలకూ మేలు జరుగుతుంది. గుండెకు స్టెంట్ వేయించుకున్నవారు, బైపాస్ శస్త్రచికిత్స చేయించుకున్నవారు కూడా నెమ్మదిగా మొదలుపెట్టి.. క్రమేణా పెంచుకుంటూ వెళ్లాలి. వీళ్లు వ్యాయామాన్ని నడకతో మొదలుపెట్టడం మంచిది. రోజూ కొద్దికొద్దిగా వేగాన్ని, సమయాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. కొంతకాలం తర్వాత.. వీరు టెన్నిస్, గోల్ఫ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి శారీరక వ్యాయామాలను కూడా చేయొచ్చు. మరీ గుండె పంపింగ్ తగ్గిపోతే చేయవద్దని చెబుతాం గానీ.. లేకపోతే చేయొచ్చు. వీరు బరువులు ఎత్తకూడదు. కొండలు, గుట్టలు ఎక్కకూడదు. మరీ వేగంగా పరుగెత్తడం వంటివి చేయొద్దు.
డాక్టర్ ఎ.వి.ఆంజనేయులు, సీనియర్ కార్డియాలజిస్ట్
నీళ్లు తాగే అలవాటును పెంచుకోవాలి
ఆహారంలో పండ్లు, కూరగాయలు, గింజధాన్యాలు తప్పనిసరిగా ఉండాలి. ఒకే రకమైన ఆహారాన్ని కాకుండా అన్ని రకాల ఆహారాలను సమతౌల్యంగా తీసుకోవడం చాలా ముఖ్యం. కొందరు ఆరోగ్యకరమైన ఆహారాల పేరిట వాటిని మోతాదుకు మించి తీసుకుంటారు. ఉదాహరణకు అవిసె గింజలు తింటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుందనే ఆలోచనతో రోజూ గుప్పెడు గుప్పెడు నమిలేస్తుంటారు. ఇది సరైంది కాదు. మన ఎత్తు, బరువుకు సరిపడా ఆహారాన్ని నిపుణుల సూచనల మేరకు తీసుకోవడం మేలు. ఎక్కువమంది 2 లీటర్ల నీళ్లు కూడా తాగరు. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే అమ్మాయిలు, ఆఫీసులకు వెళ్లే మహిళలు చాలా తక్కువ నీళ్లు తాగుతుంటారు. వారికి 35-40 ఏళ్లు వచ్చేసరికి ఇదో అలవాటుగా మారుతుంది. ఇలాంటి వారు ఒకేరోజు 3-4 లీటర్ల నీటిని తాగలేరు. క్రమేణా తాగే నీటి పరిమాణాన్ని పెంచుకుంటూ పోవాలి.
డాక్టర్ లతాశశి, సీనియర్ న్యూట్రిషనిస్ట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది. -
ధరణిలో సవరణలకు ప్రజాభిప్రాయ సేకరణ
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి విస్తృత స్థాయి సంప్రదింపులు చేపట్టాలని, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు.