BHEL: ఆలస్యానికి రూ.460 కోట్ల జరిమానా!
థర్మల్ విద్యుత్కేంద్రాల పనుల్లో జాప్యంపై నిర్మాణ సంస్థ భెల్(బీహెచ్ఈఎల్)కు తెలంగాణ జెన్కో భారీ జరిమానా విధించింది. కాంట్రాక్టు ఒప్పందాల గడువు దాటినా పూర్తిచేయకుండా జాప్యం చేస్తున్నందుకు రూ.460 కోట్లు కట్టాలని భెల్కు స్పష్టంచేసింది.
యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణ పనుల్లో జాప్యానికి రూ.344 కోట్లు
భద్రాద్రికి గతంలోనే రూ.116 కోట్ల విధింపు..
తాజాగా భెల్కు చెల్లింపుల్లో ఈ మొత్తం నిలిపివేసిన తెలంగాణ జెన్కో
యాదాద్రి ప్లాంటుతో ఇప్పటికే నష్టం.. జరిమానా తగదు: భెల్
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రం
ఈనాడు, హైదరాబాద్: థర్మల్ విద్యుత్కేంద్రాల పనుల్లో జాప్యంపై నిర్మాణ సంస్థ భెల్(బీహెచ్ఈఎల్)కు తెలంగాణ జెన్కో భారీ జరిమానా విధించింది. కాంట్రాక్టు ఒప్పందాల గడువు దాటినా పూర్తిచేయకుండా జాప్యం చేస్తున్నందుకు రూ.460 కోట్లు కట్టాలని భెల్కు స్పష్టంచేసింది. నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ కేంద్రం పనుల్లో జాప్యానికి తాజాగా రూ.344 కోట్లు, భద్రాద్రి జిల్లా ఏడూళ్ల బయ్యారం వద్ద చేపట్టిన భద్రాద్రి ప్లాంటు నిర్మాణంలో జాప్యానికి గతంలోనే రూ.116 కోట్ల జరిమానా విధించింది. భెల్కు చెల్లించాల్సిన బిల్లుల నుంచి ఈ నిధులు నిలిపివేసింది. అయితే, ఇలా బిల్లుల చెల్లింపులు నిలిపివేయడం తగదని, యాదాద్రి ప్లాంటు పనుల్లో జాప్యం వల్ల ఇప్పటికే తమ సంస్థకు నష్టం వస్తోందని.. జరిమానా పేరుతో అదనంగా వసూలు తగదని భెల్ సంస్థ తాజాగా జెన్కోకు లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్లాంటు నిర్మాణ గడువును 2025 మార్చి 31 వరకు పొడిగించాలనీ అందులో కోరినట్లు తెలిసింది.
ఆలస్యంతో మరింత భారమై...
యాదాద్రి ప్లాంటు నిర్మాణ అంచనా వ్యయం రూ.17,950 కోట్లని తొలుత భెల్కు 2015 జూన్ ఒకటిన తెలంగాణ జెన్కో ఇచ్చిన లేఖలో తెలిపింది. కానీ, కీలకమైన పర్యావరణ అనుమతి(ఈసీ) 2017 జూన్ 29న రావడంతో నిర్మాణం ప్రారంభంలోనే తీవ్ర జాప్యం జరిగింది. ఈసీ వచ్చిన తర్వాత నిర్మాణ వ్యయం రూ.20,379 కోట్లు అని, నిర్మాణ ప్రారంభతేదీ 2017 అక్టోబరు 10 అని నిర్ణయించి జెన్కో భెల్కు మరో ఉత్తర్వు ఇచ్చింది. ఈ ప్రకారం ప్లాంటులోని మొత్తం 5 యూనిట్లకుగాను 2020 అక్టోబరు నాటికి రెండింటిలో, 2021 అక్టోబరు నాటికి మరో మూడింటిలో విద్యుదుత్పత్తి ప్రారంభించాలి. కానీ, ఇంతవరకూ ఒక్క యూనిట్లోనూ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఆ తర్వాత ధరలు పెరిగాయని అంచనా వ్యయాన్ని రూ.20,444 కోట్లకు పెంచారు. ఈ కాంట్రాక్టు ఒప్పందం చేసుకునే సమయంలో ‘ధరల్లో మార్పు నిబంధన’ (ప్రైస్ వేరియేషన్ క్లాజ్-పీవీసీ)ను పెట్టడానికి జెన్కో అంగీకరించలేదు. దీంతో నిర్మాణం పూర్తయ్యేలోగా ధరలు పెరిగినా వ్యయం పెంచేది లేదని.. రూ.20,444 కోట్లే చెల్లిస్తామని జెన్కో కాంట్రాక్టు ఒప్పందంలో తెలిపింది. నిర్మాణంలో జాప్యం జరిగితే చెల్లింపులపై 5 శాతం సొమ్మును ‘లిక్విడిటీ డామేజెస్’(ఎల్డీ) పేరుతో జరిమానా వేస్తామనే షరతునూ ఒప్పందంలో జెన్కో పెట్టగా భెల్ అంగీకరించింది.
జాప్యంతో ‘యాదాద్రి అప్పు’పై వడ్డీ భారమే రూ.8,745 కోట్లు!
వాస్తవానికి 2021 అక్టోబరు నాటికి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి ప్రారంభం కావాల్సి ఉండగా.. పలుమార్లు గడువు పొడిగించిన జెన్కో చివరగా 2024 డిసెంబరుగా ఖరారు చేసింది. అయితే, ఇది కూడా సరిపోదని.. గడువును 2025 మార్చి 31 వరకూ పొడిగించాలని భెల్ తాజాగా అడిగింది. ఇప్పటికే దీని నిర్మాణ వ్యయం పెరగడంతో మొత్తం రూ.34,450 కోట్లకు చేరింది. పైగా దీనిపై రూ.29 వేల కోట్ల రుణాన్ని తీసుకున్నందున ‘నిర్మాణం జరిగే కాలంలో వడ్డీ’ (ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్-ఐడీసీ)ని జెన్కో చెల్లిస్తోంది. ఐడీసీ భారం 2024 డిసెంబరు నాటికి రూ.8,400 కోట్లకు చేరనుంది. కానీ, భెల్ అడిగినట్లుగా మరోసారి గడువు పొడిగిస్తే ఐడీసీ భారం రూ.8,745 కోట్లకు చేరుతుందని.. ఇంత వడ్డీని విద్యుదుత్పత్తి ప్రారంభానికి ముందే చెల్లించడం వల్ల ప్రజలపై తీవ్ర ఆర్థికభారం పడుతుందని జెన్కో భావిస్తోంది. ప్లాంటు నిర్మాణంలో జాప్యంతో ఇక్కడ ఉత్పత్తయ్యే కరెంటు యూనిట్ ధర రూ.6 దాటుతుందని విద్యుత్ ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘యాదాద్రి’ నిర్మాణంలో జాప్యానికి బాధ్యత వహిస్తూ ఎల్డీ కింద రూ.344 కోట్ల జరిమానాను చెల్లించాలని భెల్కు తాఖీదును జారీచేసింది. గతంలోనూ ఇలాగే భద్రాద్రి ప్లాంటు పనుల్లో జాప్యానికి సంబంధించి రూ.116 కోట్ల ఎల్డీ పేరుతో జరిమానా విధించినా.. ఆ సంస్థ చెల్లించలేదు. దీంతో భెల్కు చెల్లించాల్సిన బిల్లుల నుంచి మొత్తం రూ.460 కోట్లను జెన్కో నిలిపివేసింది. మరోవైపు యాదాద్రి విషయంలో తమ జాప్యం ఏమీ లేదని, ఈ ప్లాంటు పనులు ఆలస్యం కావడానికి అనేక సాంకేతిక కారణాలున్నాయని భెల్ వాదిస్తోంది. ఈ ప్లాంటు నిర్మాణంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ జ్యుడీషియల్ విచారణ జరుపుతున్నందున.. ఆర్థిక భారం అధికంగా పడటానికి బాధ్యులెవరనేది త్వరలో తేలనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది. -
ధరణిలో సవరణలకు ప్రజాభిప్రాయ సేకరణ
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి విస్తృత స్థాయి సంప్రదింపులు చేపట్టాలని, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. -
న్యాయవాదుల సీవోపీ నిబంధనలు సవరించాలి
న్యాయవాదులు తాము ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా ఐదేళ్లకోసారి బార్ కౌన్సిల్కు సమర్పించే సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీవోపీ) నిబంధనలను సవరించాలంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)కి తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. -
అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ హబ్
రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ అందించే కేంద్రాలు ఉన్నా పలు చోట్ల 8 నుంచి 10 ఛార్జింగ్ పాయింట్లు మాత్రమే ఉంటున్నాయి. -
ఛార్జిషీట్ కాపీలు నిందితులకు ఇవ్వండి
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్లో పత్రాల మాయంపై శుక్రవారం నాంపల్లి కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. పోలీసులు కోర్టుకు సమర్పించిన వివరాలు నిందితులకు ఇచ్చిన ఛార్జిషీట్లో లేవని వారి తరఫు న్యాయవాది సురేందర్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
పెరిగిన నర్సింగ్, పారా మెడికల్ ఫీజులు
రాష్ట్రంలో ప్రైవేటు అన్ ఎయిడెడ్ నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల ఫీజులను పెంచుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ సిఫారసుల మేరకు కొత్త ఫీజులను నిర్ధారించినట్లు పేర్కొన్నారు. -
కల్తీ పురుగు మందుల విక్రయాలపై వివరణ ఇవ్వండి
కల్తీ, నకిలీ పురుగు మందుల విక్రయాలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జంతు సంతతి నియంత్రణ(ఏబీసీ) కేంద్రాలు పూర్తిస్థాయిలో పని చేస్తాయని, ప్రత్యేకించి వీధికుక్కల సంతతి నియంత్రణకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచుతామని పురపాలకశాఖ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
నెలాఖరుకు నిండనున్న శ్రీశైలం
కృష్ణా, గోదావరి నదులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కృష్ణా బేసిన్లో అటు ఆలమట్టి, ఇటు తుంగభద్ర నుంచి నీటి విడుదల పెరగడంతో ఈ నెలాఖరుకు శ్రీశైలం నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కాగితాలు దాటని ఆదేశాలు.. ముంపు ముప్పులోనే పట్టణాలు
గత ఏడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో 193 కాలనీలు నీట మునిగాయి.. వేల సంఖ్యలో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.. నీట మునిగిన కాలనీల నుంచి నాలుగైదు వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
మనబడికి సౌరకాంతులేవీ?
‘మనబడి’ పథకం కింద పాఠశాల భవనాలపై సౌరఫలకాల ఏర్పాటు అర్ధంతరంగా నిలిచిపోయింది. ముందుగా పెట్టుకున్న లక్ష్యంలో మూడో వంతు పనులు కాగానే నిధుల్లేవని పనులు ఆపేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?