MLC Kavitha: సాక్షులను బెదిరించారు.. సాక్ష్యాలను చెరిపేశారు
భారాస ఎమ్మెల్సీ కవిత సాక్షులను బెదిరించడంతోపాటు, సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నంచేశారని, అందువల్ల ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు దిల్లీ హైకోర్టుకు విన్నవించారు.
కవిత సాధారణ మహిళ కాదు.. రాజకీయ శక్తి సామర్థ్యాలున్న వ్యక్తి
2 రోజుల్లో 4 ఫోన్లను ఫార్మాట్ చేశారు
బెయిల్ ఇవ్వొద్దు.. దిల్లీ హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
తీర్పు రిజర్వ్.. 30 లేదా 31 తేదీల్లో వెల్లడి
ఈనాడు, దిల్లీ: భారాస ఎమ్మెల్సీ కవిత సాక్షులను బెదిరించడంతోపాటు, సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నంచేశారని, అందువల్ల ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు దిల్లీ హైకోర్టుకు విన్నవించారు. ఈడీ సమన్లు జారీచేసిన రెండురోజుల్లోనే ఆమె నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేసినట్లు చెప్పారు. ఆమె సాధారణ గృహిణికాదని, ఒక రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తి కుమార్తె అని పేర్కొన్నారు. విదేశాల్లో ఫైనాన్స్లో మాస్టర్స్ చేసి వచ్చి రాజకీయాల్లో ఉన్నత స్థానాలు చేపట్టిన వ్యక్తి అని గుర్తుచేశారు. అన్నీ తెలిసి తప్పు చేసిన వారికి బెయిల్ ఇవ్వరాదని పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ నమోదుచేసిన కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత దాఖలుచేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ స్వర్ణకాంతశర్మ ధర్మాసనం ముందు మంగళవారం ఈడీ న్యాయవాది జోయెబ్ హుస్సేన్ ఈమేరకు వాదనలు వినిపించారు. ఈకేసులో నిందితులుగా ఉన్న బుచ్చిబాబు, అరుణ్ పిళ్లైలని బెదిరించి తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకొనేలా కవిత ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో కవిత బినామీగా వ్యవహరించిన అరుణ్ రామచంద్ర పిళ్లై ఈకేసులో ఆమె పాత్ర గురించి 2022 నవంబర్లో ఈడీ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని 118 రోజుల తర్వాత ఉపసంహరించుకున్నట్లు ఈడీ తరఫు న్యాయవాది తెలిపారు. ఈడీ తనను బెదిరించి, అనుచితంగా వ్యవహరించి వాంగ్మూలం నమోదుచేసిందని చెప్పి ఆయన తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారని పేర్కొన్నారు.
ఆయన ఈడీ ముందు చాలా వాంగ్మూలాలు ఇచ్చినా అందులో కేవలం కవిత పేరు ప్రస్తావించిన వాంగ్మూలాన్ని మాత్రమే ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకోవడం వెనక కవిత పాత్ర ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఈ కుంభకోణం సాగిన 10 నెలల్లో హోల్సేల్ వ్యాపారులు మొత్తం రూ.338 కోట్లు నేరపూరితంగా ఆర్జించారని తెలిపారు. అందులో ఇండో స్పిరిట్ సంస్థకు ఒక్కదానికే రూ.192 కోట్లు దక్కిందన్నారు. ఇదే సంస్థలో అరుణ్ పిళ్లై కవిత బినామీగా ఉంటూ ఆమె తరఫున రూ.32 కోట్లు పొందారని పేర్కొన్నారు. ఈ విషయం బుచ్చిబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారని వివరించారు. ఆ రూ.32 కోట్లలో రూ.4.50 కోట్లు కవిత నేతృత్వంలో నడుస్తున్న ఇండియా అహెడ్ సంస్థకు వెళ్లాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన వాట్సప్ చాట్స్ ఉన్నాయన్నారు. కవిత గత ఏడాది మార్చి 21వ తేదీన తొమ్మిది ఫోన్లు దర్యాప్తు సంస్థ అధికారులకు అప్పగించారని... అందులో నాలుగు ఫోన్లు మార్చి 14, 15 తేదీల్లో ఫార్మాట్ చేసిఉన్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఉందన్నారు. ఇలా సాక్ష్యాలను చెరిపేశారన్న కారణంతోనే కింది కోర్టు బెయిల్ తిరస్కరించినట్లు చెప్పారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించి ఆమెను తాము అరెస్టు చేశామన్న వాదనల్లోనూ ఎలాంటి నిజంలేదని... వచ్చే పది రోజులు ఆమెకు సమన్లు జారీచేయబోమని మాత్రమే గత ఏడాది సెప్టెంబర్ 15న ఏఎస్జీ రాజు సుప్రీంకోర్టుకు చెప్పారని, అంతే తప్ప అరెస్టు చేయబోమని చెప్పలేదని పేర్కొన్నారు.
సీబీఐ తరఫు న్యాయవాదీ ఇదే తరహా వాదనలు వినిపించి ఆమె బెయిల్ను వ్యతిరేకించారు. ఈ వాదనలను కవిత తరఫు న్యాయవాది నితేష్ రాణా తోసిపుచ్చారు. ఈకేసులో రూ.192 కోట్ల నేరపూరిత ఆర్జన జరిగినట్లు చెబుతున్నారని, అందులో ఒక్కపైసా కూడా కవితకు చేరలేదన్నారు. బుచ్చిబాబు ఈకేసులో కీలకపాత్ర పోషించినట్లు చెబుతున్నా ఇంతవరకూ ఆయన్ను ఈడీ అరెస్టే చేయలేదని గుర్తుచేశారు. తాము ఫోను ధ్వంసం చేసినట్లు 2023 మార్చిలోనే తెలిసినప్పటికీ అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఆమె సాక్ష్యాలను ధ్వంసం చేయాలనుకుంటే తన ఫోన్లను తనదగ్గర పనిచేసేవారికి ఇవ్వడానికి బదులు వాటిని ధ్వంసం చేసి ఉండేవారన్నారు. అలా కాకుండా ఆమె తన పాతఫోన్లను ఉద్యోగులనుంచి సేకరించి ఇచ్చారని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్చేశారు. ఈనెల 30-31 తేదీల్లో ఏదో ఒక రోజులు వెలువరించనున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!