Kaleshwaram Project: ‘కాళేశ్వరం’ ఇంజినీర్లపై చర్యలకు తర్జనభర్జన
మేడిగడ్డ బ్యారేజీతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో ముందు నుంచి పని చేస్తున్న ఇంజినీర్లను మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తికాకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చిన అంశం ఇటీవల చర్చకు వచ్చినప్పుడు ఆయన ఈ మేరకు స్పందించినట్లు సమాచారం.
మొదటి నుంచి ఉన్న టీమ్ను మార్చాలని సీఎం రేవంత్ ఆదేశం
ఇప్పటికీ శ్రీకారం చుట్టని నీటిపారుదల శాఖ
ఈనాడు, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో ముందు నుంచి పని చేస్తున్న ఇంజినీర్లను మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తికాకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చిన అంశం ఇటీవల చర్చకు వచ్చినప్పుడు ఆయన ఈ మేరకు స్పందించినట్లు సమాచారం. ‘‘మొదటి నుంచి ఉన్న టీమ్ అలాగే కొనసాగుతుంటే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? వారు కీలకమైన అంశాలు వెలుగులోకి రాకుండా చూడటానికే ప్రయత్నిస్తారు తప్ప సమాచారం ఎందుకు ఇస్తారు? అలాంటి వారందరినీ మార్చి ఉత్సాహంగా పని చేయగలిగిన వారిని, ఎక్కువ సర్వీసు ఉన్నవారిని నియమించడం వల్ల ప్రయోజనం ఉంటుంది’’ అని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. అయితే బాధ్యులైన ఇంజినీర్లపై చర్యలకు నీటిపారుదల శాఖ తర్జనభర్జన పడుతోంది. ఎన్డీఎస్ఏ, జ్యుడిషియల్ కమిషన్ నుంచి పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతనే చర్యలు తీసుకోవడం మంచిందంటూ ముఖ్యమంత్రి ఆదేశాల అమలుకు ఇంకా శ్రీకారం చుట్టలేదని తెలిసింది.
ఇదీ నేపథ్యం...
2019 వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజీకి సమస్య ప్రారంభం కాగా, సీసీబ్లాకులు, ఆప్రాన్తో పాటు మరికొన్ని మరమ్మతుల గురించి ఇంజినీర్లు నిర్మాణ సంస్థకు లేఖలు రాశారు. తర్వాత సంవత్సరాల్లో కూడా సమస్యలు పునరావృతం కాగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి లేఖలు రాశారు. అయితే నిర్మాణ సంస్థ మరమ్మతులకు పూనుకోలేదు. గత అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగి ఏడో బ్లాక్లో పియర్స్ దెబ్బతిన్నప్పుడు, తామే బ్యారేజీ పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని ప్రకటించింది. తర్వాత వెనక్కు తగ్గింది. పని పూర్తవడంతోపాటు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ కూడా ముగిసిందని, తాజా పనులకు అనుబంధ ఒప్పందం చేసుకొంటేనే చేస్తామని తెలిపింది. పని పూర్తయినట్లు 2021 మార్చి 15న సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దానిపై ఎస్ఈ కౌంటర్ సంతకం చేశారు. 2020 నవంబరు 11న అప్పటి కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్(రామగుండం) రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ కోసం ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్)కు లేఖ రాశారు. 2020 ఫిబ్రవరి 29నే పని పూర్తయిందని, ప్రభుత్వం వద్ద ఉన్న బ్యాంకు గ్యారంటీలను వెనక్కు ఇవ్వాలని అందులో కోరారు. 2020 ఫిబ్రవరి 29 నుంచే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని, ఈ సమయంలో ఏమైనా లోపాలుంటే చేపడతామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ అండర్ టేకింగ్ ఇచ్చిందని కూడా అందులో పేర్కొన్నారు. అయితే 2021 మార్చి 31న పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఏడాది పాటు ప్రభుత్వం గడువు పొడిగించింది. పునరుద్ధరణ పనులు నిర్మాణ సంస్థ చేయాలా లేక ఖర్చును ప్రభుత్వం భరించాలా అన్నది చర్చనీయాంశం కాగా, నిర్మాణ సంస్థే భరించాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 15న ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఒప్పందం ఇంకా మనుగడలో ఉందని కూడా స్పష్టం చేశారు. పని పూర్తయినట్లు పొరపాటున సర్టిఫికెట్ ఇచ్చానని ఈఈ పేర్కొన్నట్లు తెలిపారు.
ఏజెన్సీకి లేఖ ఎప్పుడు రాశారు?
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్ద వీటన్నిటిపైనా చర్చ జరిగింది. పని పూర్తి కాకుండానే పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని, తర్వాత పని గడువు పొడిగించారని, మరమ్మతుల గురించి రాసినా నిర్మాణ సంస్థ పట్టించుకోనట్లు చెప్తున్నారని... అలాంటప్పుడు క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఎం ప్రశ్నించారు. బాధ్యులైన ఇంజినీర్లపైన కూడా చర్య తీసుకోవాలి కదా అంటూ టీమ్ మొత్తాన్ని మార్చాల్సి ఉందని, లేకుంటే అక్కడి నుంచి సమాచారం కూడా రాదని స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. దెబ్బతిన్న పనుల గురించి ఏజెన్సీకి ముందుగానే లేఖ రాశారా లేక బ్యారేజీ కుంగిన తర్వాత సృష్టించారా అన్న కోణంలో కూడా పరిశీలించాలని చెప్పినట్లు తెలిసింది. కాళేశ్వరంపై వేసే కమిటీల్లో ఎక్కువ సర్వీసు ఉన్నవారిని నియమించాలని, నెలకో రెండు నెలలకో పదవీ విరమణ చేసే వారిని నియమించవద్దని ఆదేశించినట్లు తెలిసింది.
మేడిగడ్డను పరిశీలించిన సీడబ్ల్యూపీఆర్ నిపుణులు
దెబ్బతిన్న పియర్ల వద్ద పరీక్షలపై ఆరా
బుధవారం మేడిగడ్డ బ్యారేజీ దిగువన ఏడో బ్లాక్ ప్రాంతంలో పరిశీలిస్తున్న సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు
మహదేవపూర్, కాళేశ్వరం, న్యూస్టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పుణెకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్(సీడబ్ల్యూపీఆర్) స్టేషన్ నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. నిపుణులు జె.ఎస్.ఎడ్లబాడ్కర్ (జియో టెక్నికల్), డా.ధనుంజయ్ నాయుడు (జియో ఫిజికల్), డా.ప్రకాష్ పాలయ్ (ఎన్డీటీ స్టడీస్) ఈ బృందంలో ఉన్నారు. వారు పుణె నుంచి నేరుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. ఎల్అండ్టీ అతిథి గృహంలో ఇంజినీర్లతో చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో తిరుగుతూ అణువణువునా పరీక్షించారు. ఏడో బ్లాక్ ప్రాంతంలో 20 పియర్ పగుళ్లు, దెబ్బతిన్న గేటును చూశారు. మిగతా గేట్లు, పియర్స్ పరిస్థితులను గమనించారు. దిగువన సీసీ బ్లాక్లు ఏ విధంగా కొట్టుకుపోయాయో అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి పరీక్షలు చేశారో అడగగా ఈఆర్టీ, జీపీఆర్టీ పరీక్షలు చేసినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. బ్యారేజీలో ఎలాంటి పరీక్షలు చేయాలో తెలియజేస్తామని, నాలుగు రోజుల్లో లేదా వారంలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని బృందం సభ్యులు తెలిపారు. ఏడో బ్లాక్ ఏ విధంగా దెబ్బతిందో, ప్రస్తుత పరిస్థితులు ఏమిటో సీఈ సుధాకర్ వివరించారు. మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజీకి చేరుకొని అప్, డౌన్ స్ట్రీమ్లను చూశారు. 28, 35, 38, 44 గేట్ల వద్ద లీకేజీ, సీపేజీలు, చేసిన మరమ్మతులను పరిశీలించారు. బ్యారేజీకి ఎగువన పియర్స్ వద్ద ఇసుక మేటల్ని ఎంత మేర తొలగించిందీ వారికి ఈఈ యాదగిరి వివరించారు. ఈ బృందం బుధవారం రాత్రి కాళేశ్వరంలో బస చేసి గురువారం పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీ పరిశీలనకు వెళ్లనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి