CM Revanth Reddy: ట్యాపింగ్పై సీబీఐ విచారణ కోరడం లేదేం?
ప్రతి విషయంపై సీబీఐ విచారణ కోరే కల్వకుంట్ల కుటుంబం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎందుకు డిమాండ్ చేయడం లేదో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
కల్వకుంట్ల కుటుంబానికి సీఎం రేవంత్రెడ్డి సూటి ప్రశ్న
విరిగింది కాళేశ్వరం పన్ను కాదు.. వెన్ను అని వ్యాఖ్య
రాష్ట్రంలో కరెంటు కోతలేమీ లేవని వెల్లడి
రాష్ట్ర గీతం పూర్తి బాధ్యతలు అందెశ్రీకే అప్పగించినట్లు స్పష్టీకరణ
ఈనాడు, దిల్లీ: ప్రతి విషయంపై సీబీఐ విచారణ కోరే కల్వకుంట్ల కుటుంబం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎందుకు డిమాండ్ చేయడం లేదో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఫోన్ ట్యాపింగ్ లాంటి పనుల జోలికి పోవడం లేదని స్పష్టం చేశారు. జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించడానికి రేవంత్రెడ్డి మంగళవారం దిల్లీకొచ్చారు. ఇక్కడి తుగ్లక్ రోడ్డులో తెలంగాణ సీఎం అధికారిక నివాసంలో జరుగుతున్న మరమ్మతులను పరిశీలించారు. అనంతరం కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశాలుగా మారిన రాష్ట్ర గీతం రూపకల్పన, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కోతలు, ఫోన్ ట్యాపింగ్లపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటివరకు నేను వ్యక్తిగతంగా సమీక్ష చేపట్టలేదు. కేసు దర్యాప్తు విషయంలో పోలీసు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. దర్యాప్తు చేస్తున్న అధికారులు ఎవరి మాటా వినేరకం కాదు. వారు తమ పని తాము చేసుకుపోతున్నారు. అన్నింటికీ సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎందుకు కోరడం లేదో అర్థం కావడం లేదు. అధికార మార్పిడి జరిగిన తర్వాత చోటుచేసుకున్న అధికారుల బదిలీల సమయంలో ఎస్ఐబీ కార్యాలయంలోని కొన్ని వస్తువులు మాయమైనట్లు బయటపడింది. వాటికి సంబంధించిన అంశంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎవరెవరు బాధ్యులో తేల్చే క్రమంలోనే ట్యాపింగ్ వ్యవహారం బయటికొచ్చింది. ఈ కేసులో టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్లు జోడించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కనిపించకుండా పోయిన హార్డ్ డిస్క్లు, ధ్వంసమైన డేటా బ్యాకప్ ఎక్కడ ఉందో దర్యాప్తు చేస్తున్న అధికారులే తేల్చాలి. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదు. అలాంటి పనులు నేను చేయను. తీవ్రవాదులు, జాతివ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగొచ్చు. అందుకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే ఎస్ఐబీ అధికారులు కేంద్ర నిఘా సంస్థలతో నేరుగా మాట్లాడతారు తప్ప నాతో కాదు. ఉగ్రవాదులు, తీవ్రవాదుల గురించి 1980, 1990ల నుంచి సేకరించిన డేటా బ్యాకప్ ఉందా.. దాన్ని కూడా మాయం చేశారా అన్న విషయం దర్యాప్తు తర్వాత అధికారులకు తెలుస్తుంది.
నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరంపై ముందుకు..
కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు సమస్యపై నిపుణుల సూచనలతో ముందుకెళ్తాం. 32 పళ్లలో ఒక పన్ను విరగడం లాంటి సమస్య కాదిది.. మనిషికి వెన్నెముక విరగడం లాంటిది. ప్రాజెక్టులో నీరు నిల్వ చేసి, విడుదల చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే 52 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. దానిపై కట్టిన కరెంటు బిల్లులన్నీ సముద్రంలో వదిలిన నీళ్ల లాంటివే. కాళేశ్వరం వద్ద భూమి లోపల ఏముందన్నది కనిపెట్టడం పెద్ద సమస్య. దాన్ని నిపుణులే తేల్చాలి. జియోఫిజికల్, జియో టెక్నికల్ సర్వే పూర్తి చేసేంతవరకూ భూమి లోపల ఏముందో తేలదు. ఆ సామర్థ్యం మూడు జాతీయస్థాయి సంస్థలకే ఉంది. ఈ పని కోసం రెండు ఏజెన్సీలను తీసుకొని.. డబుల్ చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం.
ఎన్నికలు ముగిశాక కరెంటు విషయాలు చెబుతా..
రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి కరెంటు కోతలు లేవు. చెట్లు పడిపోవడం, విద్యుత్ వినియోగం పెరగడంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వల్ల సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడింది. పునరుద్ధరణకు కొంత సమయం పట్టి ఉండొచ్చు. అంతేతప్ప ఎక్కడా కొరత లేదు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతస్థాయిలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగా సరఫరా చేస్తూ ఎక్కడా సమస్యలు రాకుండా చూస్తున్నాం. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత విద్యుత్కు సంబంధించిన అన్ని విషయాలు చెబుతా.
తెలంగాణ తల్లి విగ్రహం, గీతం, చిహ్నం రూపకల్పనలో నా జోక్యం లేదు..
తెలంగాణలో రాచరిక వ్యవస్థకు తావులేదు. తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది త్యాగాలు, పోరాటాలే. అందుకే ఆ త్యాగాలు, పోరాటాలకు చిహ్నంగా తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతం, చిహ్నాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర గీత రూపకల్పన పూర్తి బాధ్యతలను రచయిత అందెశ్రీకే అప్పగించాం. ఏ సంగీత దర్శకుడిని ఎంచుకొని ఆ గీత స్వరకల్పన చేస్తారన్నది ఆయన ఇష్టం. తెలంగాణ చిహ్నం రూపకల్పన బాధ్యతలను నిజామాబాద్ వ్యక్తికి ఇచ్చాం. ఈ మూడు పనులను ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికే పూర్తిగా అప్పగించి స్వేచ్ఛనిచ్చాం. ఇందులో నా జోక్యం లేదు. అది నా పని కూడా కాదు.
పారదర్శకంగా ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. ఏ వ్యవస్థనూ దుర్వినియోగం చేయలేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అధికారులను మార్చారు, తెలంగాణలో ఎంతమందిని మార్చారన్నది అందరికీ తెలుసు. ఒకవేళ అధికారులు మాకు అనుకూలంగా పనిచేసి ఉంటే ప్రతిపక్షాలు చూస్తూ కూర్చోవు కదా! ఎన్నికల సమయంలో ఏ ఒక్క అధికారిపైనా ఆరోపణలు రాలేదు’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ