CM Revanth Reddy: ధ్యానాన్ని పనిలా కాదు.. పనిని ధ్యానంతో చేయాలి
‘దేశంలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెరిగిపోతున్నాయి... ఉద్వేగాలు, స్పర్థలు పెంచేలా వాతావరణం కలుషితమవుతోంది... ఈ సమయంలో బుద్ధుడి సందేశాలను ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
తథాగతుడి సందేశం దేశానికి అత్యవసరం
బుద్ధ పూర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్రెడ్డి
బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని గురువారం సికింద్రాబాద్లోని ‘మహాబోధి బుద్ధవిహార’లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు బౌద్ధ సన్యాసులు తథాగతుడి విగ్రహాన్ని బహూకరించారు.
ఈనాడు, హైదరాబాద్: ‘దేశంలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెరిగిపోతున్నాయి... ఉద్వేగాలు, స్పర్థలు పెంచేలా వాతావరణం కలుషితమవుతోంది... ఈ సమయంలో బుద్ధుడి సందేశాలను ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తెలంగాణలో బౌద్ధ భిక్షువులకు తగిన గౌరవం ఉంటుందన్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా గురువారం సికింద్రాబాద్లోని ‘మహాబోధి బుద్ధవిహార’లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే ఆహ్వానితులతో నిర్వహించే కార్యక్రమాలకు అండగా ఉంటామన్నారు. సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనను ఇతరులకు పంచాలని, బుద్ధవిహారలో ఓ పాఠశాలను ఏర్పాటు చేసి బోధనలు చేస్తే బాగుంటుందని సూచించారు.
ధ్యాన మందిర నిర్మాణం...
అన్ని మతాలు కలిపితేనే బౌద్ధమతమని, ధ్యానాన్ని ఒక పనిగా కాకుండా ప్రతి పనినీ ధ్యానంతో చేయాలని బుద్ధుడు బోధించారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘‘రాజ్యం, అధికారం ఉండి కూడా వాటిని కాదని 29 ఏళ్ల వయసులో శాంతి ద్వారా సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో బుద్ధుడు ఈ మార్గాన్ని అనుసరించారు. రెండు వేల ఏళ్లుగా ఆయన సిద్ధాంతం ప్రపంచానికి ఆదర్శంగా ఉందంటే ఆ సంకల్పం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్రెడ్డి, చంద్రబాబునాయుడు బుద్ధ విహార కోసం సహకారం అందించారు. ఆ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది. ధ్యాన మందిర నిర్మాణం కోసం ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయి ఆర్థిక సహకారం అందిస్తాం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రతిపాదనలు పంపితే పరిశీలించి నిధులు మంజూరు చేస్తాం’’ అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా బుద్ధ విహారలోని బౌద్ధ భిక్షువులు సీఎం రేవంత్రెడ్డితో కలిసి సంయుత్త నికాయ వాల్యూమ్-4, అష్టాంగమార్గం పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి, అదనపు డీజీపీ శివధర్రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, భూపతిరెడ్డి, సంజీవరెడ్డి, కాంగ్రెస్ నేత శ్రీగణేశ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
తెలంగాణలోని ఇసుక క్వారీల్లో లోడింగ్ పేరుతో లారీల నుంచి గుత్తేదారులు చేస్తున్న అక్రమ వసూళ్లను నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర లారీ యజమానుల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. -
పెద్దపల్లి ఘటనను సుమోటోగా తీసుకున్న బాలల హక్కుల కమిషన్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన ఘటనపై తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించిన కమిషన్ ఈ కేసును సమోటోగా తీసుకుంది. -
ఆర్టీసీ ఐ-టిమ్స్ టెండర్లలో కుంభకోణం
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయకుండా... గత ఆరు నెలల పాలనలో వరస కుంభకోణాలకు పాల్పడిందని భారాస పేర్కొంది. మద్యం, బియ్యం, ఫ్లైయాష్, తాజాగా ఆర్టీసీ ఐ-టిమ్స్ టెండర్ల భారీ కుంభకోణం జరిగిందని భారాస నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. -
విచారణ నుంచి తప్పుకోండి
‘మీ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదు, ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతోంది. విచారణ కమిషన్ ఛైర్మన్ బాధ్యతల నుంచి మీరే స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా విన్నవిస్తున్నాను’ అని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ ఘాటుగా లేఖ రాశారు. -
ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు
రాష్ట్రంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. -
20 జిల్లాలకు కొత్త కలెక్టర్లు
రాష్ట్రంలో 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 30 మంది అధికారులకు స్థానచలనాలు జరిగాయి. ప్రస్తుతం కలెక్టర్లుగా పనిచేస్తున్న పది మందికి పోస్టింగ్లు ఇవ్వలేదు. -
నాన్న గుండె ఉప్పొంగిన రోజు
పిల్లలు తమ కన్నా గొప్పగా ఎదగాలని.. ఉన్నత స్థానాల్లో ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. అలాంటి ఒక తండ్రి ఆశయం నెరవేరి దేశంలో అత్యున్నత సర్వీసు అయిన ఐఏఎస్ సాధించిన కుమార్తె తాను పని చేస్తున్న చోటుకే శిక్షణ కోసం అడుగుపెడితే ఎలా ఉంటుంది.. -
ఓఆర్ఆర్ యూనిట్గా విపత్తు నిర్వహణ
ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న నగరాన్ని ఓ యూనిట్గా తీసుకొని విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్ఠంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్ణయం గత ప్రభుత్వ ముఖ్యులదే
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలన్న నిర్ణయం గత ప్రభుత్వంలోని ముఖ్యులదేనని నిపుణుల కమిటీలోని కొందరు సభ్యులు న్యాయ విచారణ కమిషన్ ఎదుట చెప్పినట్లు తెలిసింది. -
ఉద్యోగుల బదిలీలకు మోక్షమెన్నడు?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో చివరిసారిగా 2018లో సాధారణ బదిలీలు జరిగాయి. ప్రక్రియ పూర్తవగానే అప్పట్లోనే బదిలీలపై నిషేధం విధిస్తూ నాటి ప్రభుత్వం జీవో 81ని జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ దళాలకు ఎదురుదెబ్బ.. 8 మంది సైనికులు మృతి
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/06/24)
-
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
-
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!