CR Foundation: మలిసంధ్యలో మరో ప్రపంచం
వారంతా వయసులో ఉండగా... మరో ప్రపంచం కోసం కలలుగన్నారు... ప్రజల కష్టాలనే తమ కష్టాలుగా స్వీకరించారు... జనస్వామ్యం సాకారానికి ఉద్యమాలు చేశారు... విజయాలు సాధించారు... అనుభవాలను ప్రోది చేసుకున్నారు... కాలం కరిగిపోయి, వయసు పైబడింది!
వయోధికుల గౌరవానికి వేదికగా ‘సీఆర్ ఫౌండేషన్’
ఈ ఏడాది రజతోత్సవాలు
ఈనాడు - హైదరాబాద్
వారంతా వయసులో ఉండగా... మరో ప్రపంచం కోసం కలలుగన్నారు...
ప్రజల కష్టాలనే తమ కష్టాలుగా స్వీకరించారు...
జనస్వామ్యం సాకారానికి ఉద్యమాలు చేశారు...
విజయాలు సాధించారు... అనుభవాలను ప్రోది చేసుకున్నారు...
కాలం కరిగిపోయి, వయసు పైబడింది!
ఇప్పుడూ మరో ప్రపంచం కోసమే శ్రమిస్తున్నారు...
తమలాంటి వయోధికుల జీవితాలకు మార్గదర్శనం
చేసే బాటలో పయనిస్తున్నారు...!
వీరందరినీ అమ్మలా ఆదరిస్తోంది... సీఆర్ ఫౌండేషన్!
అసలేమిటీ ఫౌండేషన్..దాన్ని ఎవరి ఆశయాల కోసం..ఎవరు స్థాపించారు. దాని కార్యకలాపాలు ఏమిటి? దాని ఆధ్వర్యంలో నడిచే ఆశ్రమంలో చేరిన వారు ఆనందమయ జీవనం గడపడానికి దోహదం చేసే పరిస్థితులు అక్కడేం ఉన్నాయి. ఇలా ప్రతి అంశమూ ఆసక్తికరమే.. ఆదర్శప్రాయమే. ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొండాపూర్లో ఏర్పాటు చేసిన ఆశ్రమం ఈ ఏడాది రజతోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో...
కొన్ని వృద్ధాశ్రమాలకు వెళితే అక్కడి పరిస్థితులు మనల్ని నిరాశా, నిస్పృహలకు గురిచేస్తాయి. వైరాగ్యాన్ని కలిగిస్తాయి. కానీ, హైదరాబాద్ కొండాపూర్లోని సీఆర్ ఫౌండేషన్ ఆశ్రమం అందుకు పూర్తి భిన్నం. తాము వదిలేసి వచ్చిన సమాజం కోసం ఇంకేదో చేయాలని తపిస్తున్న వారు అక్కడ కనిపిస్తారు. ఎనిమిది పదుల వయసును భారంగా కాకుండా అనుభవాల సారంగా స్వీకరించిన వారు తారసపడతారు. శరీరం సహకరించకున్నా... భావితరాలకు మార్గదర్శనం చేయడానికి ఒక్కో అక్షరాన్ని కూడదీసుకుని పుస్తకాలు రాస్తున్న ఆదర్శమూర్తులు మనకు చెప్పకనే పాఠాలు చెబుతారు. వారి మదినిండా ఉన్న అనుభవాలు, జ్ఞాపకాలు.... అక్కడి 80 వేల గ్రంథాల విజ్ఞాన భాండాగారంతో పోటీ పడుతుంటాయి. ఈ ఏడాది రజతోత్సవాలు జరుపుకోనున్న ఆశ్రమంలో ప్రస్తుతం 140 మంది ఉండగా... వారిలో 82 మంది మహిళలే. 23 జంటలున్నాయి. ఆశ్రమంలో సగం మంది 80 ఏళ్లు దాటినవారే.
సీఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమం
చండ్ర మదిలో ఆలోచనలకు జీవం
క్యారమ్స్ ఆడుతున్న ఆశ్రమవాసులు
కమ్యూనిస్టు అగ్రనేత చండ్ర రాజేశ్వరరావు తన చివరి రోజుల్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన అభిమానులు కమిటీ వేసుకొని మరీ ఆయనకు సేవలందించారు. అయితే, తనలా దేశం కోసం పోరాడిన ఎందరో చరమాంకంలో ఇబ్బందులు పడుతూ గౌరవంగా బతకలేకపోతున్నారని ఆయన ఆవేదన చెందేవారు. ఆ ఆలోచనలతోనే 1994 ఏప్రిల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. తమను నడిపించిన ఆదర్శమూర్తి ఆశయం నెరవేర్చడానికి కమ్యూనిస్టు నాయకులు అదే ఏడాది సీఆర్ ఫౌండేషన్ను ఏర్పాటుచేశారు. ఫౌండేషన్ కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొండాపూర్లో ఐదెకరాల స్థలాన్ని కేటాయించింది. 1999 అక్టోబరు 2న ఐదుగురు వృద్ధులతో ఆశ్రమ భవనాన్ని ప్రారంభించారు. స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు, కవులు, జర్నలిస్టులు, కళాకారుల్లాంటి వారిని ఆశ్రమంలో చేర్చుకున్నారు. తొలుత ఫౌండేషన్ నుంచే నిర్వహణ ఖర్చులు భరించారు. సభ్యుల సంఖ్య పెరగడంతో వారినుంచీ రుసుం తీసుకోవడం ప్రారంభించారు. ఆశ్రమంలోని సభ్యులు ప్రస్తుతం ప్రతినెలా రూ.9 వేలు చెల్లిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేనివారికి ఉచితంగానే వసతి కల్పిస్తున్నారు. గతంలో శని, ఆదివారాలొస్తే వృద్ధుల కుటుంబ సభ్యులొచ్చి ఇళ్లకు తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులే వచ్చి ఇక్కడ ఉండిపోతున్నారు. వారికోసం గెస్ట్హౌస్ కూడా నిర్మించారు. మలిసంధ్యలో వృద్ధులకు గౌరవప్రద జీవితం కల్పిస్తున్న ఆశ్రమానికి రాష్ట్ర ప్రభుత్వం 2019లో ‘వయో శ్రేష్ఠ సమ్మాన్’ పురస్కారాన్ని ప్రకటించింది.
అందుబాటులో వైద్యం..
ఆశ్రమంలోనే జనరల్ ఫిజీషియన్తోపాటు ఇద్దరు నర్సులు 24 గంటలు అందుబాటులో ఉంటారు. గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను అభ్యసించి ఇరాన్లో కొంతకాలం పనిచేసి వచ్చిన వైద్యుడు డా.మండవ గోపీనాథ్ వైద్య సేవలందిస్తున్నారు. ఎల్.వి.ప్రసాద్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా క్లినిక్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు 5 పడకలతో ఐసీయూ ఉంది. అంతకుమించి చికిత్స అవసరమైతే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తారు. కుటుంబ సభ్యులు లేనివారిని నిమ్స్లో చేర్పించి ఆశ్రమ నిర్వాహకులే పర్యవేక్షిస్తారు. ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్లను అందుబాటులోకి తెచ్చారు. మూడు అంతస్తుల్లోనూ ప్రత్యేక భోజనశాలలు ఉన్నాయి. 110 గదులతోపాటు 3 డార్మెటరీల్లో వసతి సదుపాయం ఉంది. వృద్ధుల సంక్షేమంపై ఆఫీస్ బేరర్లు సురవరం సుధాకర్రెడ్డి, డి.రాజా, డా.కె.నారాయణ, అజీజ్పాషా, జల్లి విల్సన్, పల్లా వెంకట్రెడ్డి, చెన్నమనేని వెంకటేశ్వరరావు, పి.జె.చంద్రశేఖర్రావు, మానం ఆంజనేయులు, వి.చెన్నకేశవరావు, పిడికిటి సంధ్యాకుమారి తరచూ సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటారు. ‘సీఆర్ ప్రోత్సాహంతో జర్మనీలో మెడిసిన్ చేశాను. ఆశ్రమంలో ఉన్నవారంతా ఏదో రూపంలో సమాజానికి సేవ చేసినవారే. అందుకే 2003 నుంచి అలాంటివారికి సేవలందిస్తున్నా..’ అని హెల్త్సెంటర్ డైరెక్టర్ డా.రజని తెలిపారు.
రుచి.. శుచి.. ఆరోగ్యం...
అంతా వృద్ధులే కావడంతో రుచి.. శుచి.. ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఉదయం 6 గంటలకు టీ/కాఫీ/పాలు.. 8.30 గంటలకు అల్పాహారంతోపాటు ప్రతిరోజూ గుడ్డు, దోర అరటిపండు.. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం.. 3 గంటలకు స్నాక్స్తోపాటు టీ.. రాత్రి 7 గంటలకు డిన్నర్ ఇస్తున్నారు.
సాంస్కృతిక సౌరభాలకు వేదిక
ఆశ్రమంలో దాదాపు అందరూ సాంస్కృతిక, ఉద్యమ నేపథ్యం ఉన్నవారే కావడంతో నిత్యం పుస్తకాలపై చర్చలు జరుగుతుంటాయి. ఆశ్రమం ఆవరణలోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో వారానికి 1-2 సార్లు పాత సినిమాలు ప్రదర్శిస్తుంటారు. తరచూ సాంస్కృతిక ప్రదర్శనలు నడుస్తుంటాయి. పండగల వేళ.. అంతా కలిసి వేడుక చేసుకుంటారు. కొవిడ్ సమయంలోనూ ఆశ్రమాన్ని తెరిచే ఉంచారు.
ముదిమిలోనూ పుస్తక రచనలు
డా.రంగనాయకి, ప్రొఫెసర్ వేణుగోపాల్
ఆయనకు 95.. ఆమెకు 88.. ఆ వయసులోనూ ఆ దంపతులు పుస్తకరచనలో తలమునకలై ఉన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గొప్పత]నం గురించి విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు తెలియజెప్పే యజ్ఞంలో నిమగ్నమయ్యారు. సంస్కృతంలో ఉన్న ఉపనిషత్తులను ఏళ్ల తరబడి ఔపోసన పట్టి.. వాటిని సరళమైన ఆంగ్లంలోకి అనువదించే క్రతువును భుజానికెత్తుకున్నారు. వినికిడి సమస్య ఉన్న ఆయనకు పుస్తక రచనలో ఊతకర్రగా నిలుస్తున్నారామె. అనురాగానికి ఆదర్శంగా నిలుస్తున్న ఆ దంపతులే ప్రొఫెసర్ వేణుగోపాల్, డా.రంగనాయకి. ఆయన గతంలో ఎస్వీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తే.. ఆమె విద్యాశాఖలో హిందీపండిట్గా సేవలందించారు. ఉద్యోగ విరమణ అనంతరం 1991లో అమెరికాలో ఉన్న కుమార్తె వద్ద కొన్నేళ్లున్నారు. 12 ఏళ్లపాటు ఉపనిషత్తుల గురించి అధ్యయనం చేశారు. పుస్తకరచన నిమిత్తం 2000లో హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి 24 ఏళ్లుగా హోంనే ఇల్లుగా మలుచుకున్నారు. 12 పుస్తకాలు రచించారు. ‘మాకొచ్చే పింఛను డబ్బులతో హాయిగా కాలక్షేపం చేయొచ్చు. కానీ మన దేశ సంస్కృతి గురించి విదేశాల్లోని భారతీయులు తెలుసుకోవాలనే తపన మమ్మల్ని నిలవనీయలేదు. అందుకే మావంతు కర్తవ్యంగా పుస్తకాలు రచిస్తున్నాం’ అని సమాజంపై బాధ్యతను చాటుకున్నారా దంపతులు.
కుటుంబ సభ్యులు దగ్గర లేరన్న బాధలేదు
‘మాది బీబీనగర్ సమీపంలోని బ్రాహ్మణపల్లి. 1951 నుంచి 55 వరకు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నా. మల్లు స్వరాజ్యం వద్ద శిక్షణ తీసుకొని అజ్ఞాతంలోకి వెళ్లి ఆయుధం పట్టా. పోరాటంలోనే పరిచయమైన ఎస్వీకే ప్రసాద్ను పెళ్లి చేసుకున్నా. తర్వాత ఆయన వరంగల్ జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేశారు. సోదరుడు కొమ్మిడి నర్సింహారెడ్డి భువనగిరి ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేశారు.16 ఏళ్ల కిత్రం ఆశ్రమానికి వచ్చాను. పిల్లలను మిస్సవుతున్నానన్న బాధ లేదు. కమ్యూనిస్టు నేతలు ఇక్కడికి వచ్చి కలిసిపోతుంటారు’ అని 87 ఏళ్ల తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఎస్వీకే సుగుణ తెలిపారు.
కమ్యూనిటీ లివింగ్ అనేది మా నినాదం
నిరాదరణ అనే పదానికి చోటులేకుండా చేయాలన్నదే మా ఉద్దేశం. ప్రైడ్ లివింగ్.. కమ్యూనిటీ లివింగ్ అనే నినాదంతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఫౌండేషన్ ఏర్పాటు సమయంలో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు సహకారం మరువలేనిది. తొలుత చిన్నగా ప్రారంభించాలనుకున్నాం. కానీ కమ్యూనిస్టు దిగ్గజం పేరిట ఏర్పాటయ్యే ఫౌండేషన్ గొప్పగా ఉండాలని రామోజీరావు ఆర్థిక తోడ్పాటు అందించారు.
హోం డైరెక్టర్ చెన్నకేశవరావు
80 వేల పుస్తకాలు డిజిటలైజ్ చేయబోతున్నాం
కొండాపూర్ ఆశ్రమంలో ప్రస్తుతం ఆసుపత్రి, గ్రంథాలయం, మహిళా శిక్షణ కేంద్రం నిర్వహణలో ఉన్నాయి. ఆసుపత్రికి రోటరీ క్లబ్ నిర్వాహకులు రూ.కోటి విలువైన సామగ్రిని అందించారు. ఆశ్రమ లైబ్రరీలోని 80 వేల పుస్తకాల్ని డిజిటలైజ్ చేయబోతున్నాం. ప్రస్తుతం ఇక్కడ 140 మంది ఉన్నారు. మరో 300 వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వారందరికీ అవకాశం కల్పించలేకపోతున్నాం. అందుకే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం సీఆర్డీఏలో కేటాయించిన స్థలంలో మరో ఆశ్రమం నిర్మించాలనే యోచన ఉంది.
డా.కె.నారాయణ, ఫౌండేషన్ అధ్యక్షుడు, సీపీఐ సీనియర్ నేత
ఇక్కడికొచ్చాక మెరుగైన ఆరోగ్యం
నాకు ఇద్దరు అమ్మాయిలు. వేర్వేరు రంగాల్లో స్థిరపడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ఆశ్రమంలో ఉంటున్నా. ఇక్కడంతా దాదాపు ఒకే వయసు వాళ్లుండటంతో సులభంగా రోజులు గడిచిపోతుంటాయి. ఇక్కడ చేరిన తర్వాతే చాలామంది ఆరోగ్యం మెరుగవు తోంది.
అరుణ, సభ్యురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?