Crop Canals: కడగండ్ల కాలువలు
వానాకాలం ఏరువాకకు రైతులు సిద్ధమవుతున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తూ విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. సాగునీటి కాలువల్లో ప్రవాహానికి ముందే మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేయాల్సిన నీటిపారుదలశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది.
వానాకాలం సమీపిస్తున్నా మరమ్మతుల ఊసులేదు
ప్రతిపాదనల దశ దాటని పలు పనులు
నిధులున్నా ఏళ్లుగా పూర్తికాని మరికొన్ని నిర్మాణాలు
నీటిపారుదలశాఖ తీరుతో ప్రశ్నార్థకంగా పంటల సాగు
లైనింగ్, బెడ్ ఛిద్రమైన ఈ కాలువ ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెంవాగు ప్రాజెక్టు పరిధిలోది. కాలువ పొడవునా ఇదే పరిస్థితి. దీని కింద 7,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలో మరమ్మతులకు రూ.80 లక్షలకు ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు.
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే యంత్రాంగం: వానాకాలం ఏరువాకకు రైతులు సిద్ధమవుతున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తూ విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. సాగునీటి కాలువల్లో ప్రవాహానికి ముందే మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేయాల్సిన నీటిపారుదలశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ప్రాజెక్టులు, చెరువుల కింద ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. కాలువల గండ్లు పూడ్చలేదు. మత్తళ్లకు మరమ్మతులు చేయలేదు. డిస్ట్రిబ్యూటరీల్లోని పొదలు అలాగే ఉన్నాయి. వర్షాలకు దెబ్బతిన్న లైనింగ్, కోతకు గురైన గట్లు, కట్టలను పటిష్ఠంచేసే పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. ప్రతి ఆర్థిక సంవత్సరం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్(ఓ అండ్ ఎం) పనులకు రూ.300 కోట్ల వరకు కేటాయిస్తున్నా విడుదలలో జాప్యం జరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండో బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ నిధులు రూ.45 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి పనుల బిల్లులు రూ.80 కోట్లు బకాయి ఉన్నట్లు అంచనా. ఎన్నికల కోడ్లను ముందుగా అంచనా వేసి అత్యవసర పనులపై నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరికి 2నెలల క్రితం 120 పనులకు మినహాయింపు కోరుతూ ప్రతిపాదనలు పంపగా ఈసీ ఇటీవలే అనుమతించింది. కొద్ది రోజుల్లోనే వర్షాలు రానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం...
నాగర్కర్నూల్ జిల్లా మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల(ఎంజీకేఎల్ఐ) పథకం కింద ఎల్లూరు జలాశయం నుంచి సింగోటం జలాశయం అంకిరావుపల్లి గేటు వరకు కాలువ లైనింగ్ సగం నిర్మించి వదిలేశారు. ఇదే తీరులో జొన్నలబొగుడ జలాశయం నుంచి గుడిపల్లి జలాశయానికి వెళ్లే ప్రధాన కాలువకు రెండేళ్లుగా లైనింగ్ పనులు చేయడం లేదు. వర్షాలకు మట్టి కట్టలు కరిగి కాలువలో పూడిక పెరుగుతోంది.
నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం ఎల్బీనగర్ సమీపంలో సాగర్ కింద ఉన్న జాన్పహాడ్ మేజర్ కాలువ లైనింగ్ మరమ్మతులకు 2021లో రూ.52 కోట్లు మంజూరయ్యాయి. ఒప్పందం పూర్తయినా మూడేళ్లుగా పనులు ప్రారంభం కాలేదు. నేరేడుచర్ల మండలం ఆర్3 మేజర్ కాలువ కట్ట కూడా కోతకు గురైంది.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ఉన్న హల్దీ ప్రాజెక్టు కాలువ కింద 2,900 ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఏటా కనీసం 400 ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదు. కాలువల్లో పూడిక పేరుకుపోయింది. మరమ్మతులకు రెండేళ్ల క్రితం రూ.20 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు. నీరు పారేదారి లేక రైతులే ప్రాజెక్టులో మోటార్లు పెట్టి తోడుకుంటున్నారు.
గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టు కింద 34, 35 డిస్ట్రిబ్యూటరీ కాలువలు, తూములు, వాటి లైనింగ్ శిథిలావస్థకు చేరాయి. వీటి కింద 10 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువలు సక్రమంగా లేకపోవడంతో నెట్టెంపాడు ఎత్తిపోతల కింద యాసంగిలో 20 వేల నుంచి 30 వేల ఎకరాలకు నీరందని దుస్థితి నెలకొంది.
జనగామ జిల్లా లింగాల ఘణపూర్ మండలంలో నవాబుపేట జలాశయం కాలువ ద్వారా రెండు మండలాల్లోని వందల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. అయితే, చాలా ఏళ్లుగా గేట్లు ఏర్పాటు చేయడం లేదు. దీంతో నీళ్లు వదిలితే లింగాలఘణపూర్ మండలానికి బదులుగా పాలకుర్తి వైపు వెళ్తున్నాయి.
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో జూరాల ప్రాజెక్టు కింద మోట్లంపల్లి శివారులో ఉన్న ఆరో డిస్ట్రిబ్యూటరీ ఇది. ఏటా మరమ్మతులకు ప్రతిపాదనలు పంపడమే తప్ప నిధులు రావడం లేదు. ఈ ఏడాది కూడా రూ.6 లక్షలకు ప్రతిపాదనలు పంపారు.
పొదలతో నిండి ఉన్న ఈ కాలువ వికారాబాద్ జిల్లా కోటిపల్లి జలాశయం పరిధిలోది. ఈ జలాశయం కింద 10 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 1967 నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు పూర్తిస్థాయి మరమ్మతులు లేవు. కాలువలు, తూములు, డిస్ట్రిబ్యూటరీలు దెబ్బతిన్నాయి. జలాశయ పునరాకృతి, మరమ్మతులకు 2023లో ప్రాజెక్టు ఇంజినీర్లు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు పంపితే రూ.37.50 కోట్లు మంజూరయ్యాయి. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.110 కోట్లతో మరోమారు ప్రతిపాదనలు పెట్టగా మంజూరీపై స్పష్టత లేదు.
- సంగారెడ్డి జిల్లాలోని అందోలు మండలంలో డాకూరు, నాద్లాపూర్ గ్రామాల వద్ద సింగూరు కాలువపై 2020లో తూములు నిర్మించారు. వాటికి ఇప్పటికీ గేట్లు పెట్టలేదు. ప్రాజెక్టు నుంచి నీటిని వదిలితే వృథాగా వెళ్లిపోతున్నాయి. 6 వేల ఎకరాలకు అందాల్సిన సాగునీరు 3 వేల ఎకరాలకే పరిమితమవుతోంది.
- ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం లక్నవరం జలాశయం ప్రధాన కాలువకు గత వానాకాలంలో గండి పడగా ఇసుక బస్తాలతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. యాసంగిలో మళ్లీ కోతకు గురవగా ఆ ఇసుక బస్తాలపై కవర్లు కప్పి సరిపెట్టారు.
- వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టు కుడి తూము షెట్టర్ పనిచేయడం లేదు. వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు వెళ్లిపోతోంది. మరమ్మతులకు గతేడాది రూ.10 లక్షలకు ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు. వానాకాలం సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
- సిద్దిపేట జిల్లా గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలోని చెరువులకు గోదావరి నీటిని తరలించేందుకు నిర్మించిన కొండపోచమ్మసాగర్ ప్రధాన కాలువకు గజ్వేల్ మండలం కొలుగూరు వద్ద 2022 అక్టోబరులో గండి పడింది. 150 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తాత్కాలికంగా కాంక్రీట్ పోసి మరమ్మతులు చేసి వదిలేశారు. ఇక్కడ తూము పునర్నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
- మూడేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం జలాశయం మత్తడి ఉద్ధృతికి కట్ట దెబ్బతిని ఆప్రాన్ పగుళ్లు బారింది. దీంతో రూ.2 కోట్లతో మరమ్మతులు చేపట్టినా పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ జలాశయం కింద 5100 ఎకరాల ఆయకట్టు ఉంది.
- జయశంకర్ జిల్లా మల్హర్ మండలం బొగ్గులవాగు ప్రాజెక్టు మత్తడి గతేడాది భారీ వర్షాలకు ధ్వంసమైంది. ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ