Kaleshwaram Project: కాళేశ్వరం బ్యారేజీలలో సీపేజీ
‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో దిగువ భాగాన రాఫ్ట్ పునాదుల వద్ద సీపేజీని గుర్తించాం. దానిని అరికట్టడానికి ఇసుక, సిమెంటును వినియోగించి చర్యలు తీసుకోవాలి’ అని మరో నిపుణుల కమిటీ సూచించింది.
రాఫ్ట్ పునాదుల వద్ద గుర్తించాం
అరికట్టేందుకు చర్యలు తీసుకోండి
సూచించిన న్యాయ కమిషన్ నిపుణుల కమిటీ
ఈనాడు, హైదరాబాద్
మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ ప్రాంతంలో పియర్ను పరీక్షిస్తున్న సీఎస్ఎమ్ఆర్ఎస్ బృందం
‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో దిగువ భాగాన రాఫ్ట్ పునాదుల వద్ద సీపేజీని గుర్తించాం. దానిని అరికట్టడానికి ఇసుక, సిమెంటును వినియోగించి చర్యలు తీసుకోవాలి’ అని మరో నిపుణుల కమిటీ సూచించింది. మేడిగడ్డ కుంగిన సంఘటనతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరుపుతున్న న్యాయ కమిషన్కు సహాయపడేందుకు గత నెల 22న నీటిపారుదల శాఖ నిపుణుల కమిటీని నియమించింది. వరంగల్ ఎన్.ఐ.టి. ప్రొఫెసర్ రమణమూర్తి, ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ రాజశేఖర్, విశ్రాంత ఎస్ఈ సత్యనారాయణ తదితరులతో కూడిన కమిటీ ఈ నెల 1న బ్యారేజీలను సందర్శించింది. వెంట ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్కుమార్, కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ సుధాకర్రెడ్డి కూడా ఉన్నారు. ఈ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం చర్య తీసుకోవాలని సంబంధిత ఇంజినీర్లకు ఈఎన్సీ సూచించారు. ఇప్పటికే నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్డీఎస్ఏ) ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫార్సుల ప్రకారం పనులు చేస్తున్నారు. తాజాగా ఈ కమిటీ కొన్ని పనులు సూచిస్తూ వేగంగా చేయాలని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఆ సూచనల్లో పలు అంశాలు ఇలా ఉన్నాయి.
- మూడు బ్యారేజీలలోనూ దిగువ వైపు ఆప్రాన్ దెబ్బతింది. పక్కకు వెళ్లిపోయిన బ్లాక్లను వెంటనే అమర్చే పనిని పూర్తిచేసేలా నిర్మాణ సంస్థలకు సూచించాలి.
- సీసీ బ్లాక్ల కింద రాఫ్ట్ పునాదుల వద్ద సీపేజీ ఉంది. మూడు బ్యారేజీలలోనూ ఈ సమస్య ఉంది. ఇసుక, సిమెంటు కలిపి సీపేజీని అరికట్టాలి.
- బ్యారేజీలకు ఎగువన సీకెంట్పైల్ పొడవునా సిమెంట్, బెనోటైన్ మిక్స్తో గ్రౌటింగ్ చేయాలి. సీకెంట్పైల్కు మూడు మీటర్ల దూరంలో ఇసుకబెడ్ వద్ద ఈ మిక్సింగ్తో గ్రౌటింగ్ చేయాలి.
- మేడిగడ్డలో ఏడవ బ్లాక్ వద్ద పడిన బుంగలు పూడ్చే కార్యక్రమం కొనసాగుతోంది. కాంక్రీట్ లేదా ఎపాక్సీ కోటింగ్తో బీటలను పూడ్చాలి. రాఫ్ట్ దిగువన ఉన్న స్థలంలోకి నీరు నేరుగా ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం సీకెంట్ పైల్స్, రాఫ్ట్ స్లాబ్ బ్యారేజీ ఎగువన, దిగువన సీల్ చేయాలి.
- గేట్లు ఎత్తేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. గేట్లు ఎత్తే మెకానిజాన్ని అన్ని రకాలుగా సిద్ధం చేసుకోవాలి.
- మోడల్ స్టడీస్కు తగ్గట్లుగా బ్లాక్ల వారీగా గేట్ల నిర్వహణకు ‘స్కాడా’ కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి.
- గ్రౌటింగ్ పని పూర్తయిన వెంటనే బ్యారేజీ రాఫ్ట్ మీద డ్రిల్లింగ్ కోసం వేసిన రంధ్రాలను పూడ్చివేయాలి.
- అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో పునరుద్ధరణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. వాటి వేగాన్ని పెంచాలి. వర్షాలు వచ్చేలోగా అన్ని పనులు పూర్తి చేయాలి.
- మోడల్ స్టడీస్కు తగ్గట్లుగా బ్యారేజీల ఎగువన, దిగువన నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించాలి.
రేపటి నుంచి జస్టిస్ పీసీ ఘోష్ పర్యటన
కాళేశ్వరంపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 7, 8 తేదీల్లో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఈ నెల 20 వరకు హైదరాబాద్లో ఉండి విచారణను పూర్తి చేయనున్నట్లు తెలిసింది. జూన్ ఆఖరు లోగా నివేదిక ఇవ్వాల్సి ఉండటంతో ఈ లోగా విచారణ పూర్తి చేయనున్నట్లు తెలిసింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి 7న మేడిగడ్డ బ్యారేజీలో మరమ్మతులను పరిశీలించనున్నారు.
మేడిగడ్డలో సీఎస్ఎమ్ఆర్ఎస్ బృందం పరీక్షలు
మహదేవపూర్, న్యూస్టుడే: మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్ పరిధిలో బుధవారం దిల్లీకి చెందిన సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చి స్టేషన్(సీఎస్ఎమ్ఆర్ఎస్) నిపుణుల బృందం పరీక్షలు ప్రారంభించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) కమిటీ సూచనల మేరకు నిపుణులు పరీక్షలు చేసి నివేదిక ఇవ్వనున్నారు. దీని ఆధారంగా తాత్కాలిక, శాశ్వత మరమ్మతులు చేపడతారు. సీఎస్ఎమ్ఆర్ఎస్కు చెందిన హరిదేవ్ నేతృత్వంలో ఏడుగురు నిపుణుల బృందం కొన్ని పరీక్షలను అక్కడికక్కడే చేస్తుండగా మరికొన్ని నమూనాలను సేకరిస్తోంది. దెబ్బతిన్న ఏడో బ్లాక్ పరిధిలో పలు చోట్ల బుధవారం 25 అడుగుల మేర డ్రిల్లింగ్ చేసి అందులో నుంచి నమూనాలను సేకరించింది. పియర్లను డ్రిల్ చేసి కూడా పరీక్షించింది. ఈ బృందం జియో ఫిజికల్, జియో టెక్నికల్, కాంక్రీట్ పరీక్షలను వారం రోజుల పాటు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఈఈ తిరుపతిరావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్