Self Medication: సొంత వైద్యం.. మానేస్తే మేలు
అర్హులైన వైద్యుడిని సంప్రదించి, సరైన రీతిలో ఔషధాలను వాడడమే అన్ని విధాలా శ్రేయస్కరం. దీనిపై అవగాహన లేకపోవడంతో అత్యధికులు కొత్తగా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
ఇటీవల పెరుగుతున్న ప్రమాదకర ధోరణి
యాంటీబయాటిక్స్, దగ్గు, జలుబు, నొప్పి నివారణ మాత్రలతో ముప్పు
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన
ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు
అర్హులైన వైద్యుడిని సంప్రదించి, సరైన రీతిలో ఔషధాలను వాడడమే అన్ని విధాలా శ్రేయస్కరం. దీనిపై అవగాహన లేకపోవడంతో అత్యధికులు కొత్తగా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. సాధారణ జలుబు, దగ్గు మొదలుకొని గొంతునొప్పి, జ్వరం, ఒళ్లు, మోకాళ్ల నొప్పులు, తలనొప్పి తదితరాలకు సొంతంగా ఔషధాలను వినియోగించే ప్రమాదకర ధోరణి ఇటీవల కాలంలో పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాల కారణంగా ఆరోగ్యంపై కొంత అవగాహన పెరగడం, ఇంటర్నెట్లో అన్ని జబ్బులకూ ఔషధాల సమాచారం లభ్యమవడం, గతంలో ఇదే జబ్బుకు వైద్యుడు రాసిచ్చిన చీటీ¨ అందుబాటులో ఉండడం, ప్రైవేటులో వైద్యుడి సంప్రదింపులు మరీ ఖరీదు కావడం... ఇలా కారణాలేమైనా సొంతంగా మందుల్ని కొనుక్కోవడం మాత్రం ఎక్కువైంది. ఔషధ దుకాణాలు కూడా నిబంధనలు భేఖాతరు చేస్తూ.. వైద్యుడి చీటీ లేకుండానే యథేచ్ఛగా మందులిచ్చేస్తున్నాయి. ఫలితంగా దీర్ఘకాలంలో రోగుల ప్రాణాల మీదకొస్తోంది. ఇలా సొంతంగా మందుల వాడకం వారి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని, మొత్తంగా ప్రజారోగ్యమే ప్రమాదంలో పడే అవకాశాలెక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. వైద్యుడి సలహాలు, సూచనలు లేకుండా ఎవరికి వారే మందులు వాడితే కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందని పేర్కొంటూ... డైరెక్టర్ ఆఫ్ జనరల్ హెల్త్ సర్వీసెస్ ప్రొఫెసర్ డాక్టర్ అతుల్ గోయల్ తాజాగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, వైద్యారోగ్య శాఖ కార్యదర్శులకు లేఖ రాశారు. అన్ని రకాల మాధ్యమాల ద్వారా ప్రజల్లో ఈ అంశంపై చైతన్యం పెంపొందించాలని, ఇప్పటికే ఈ తరహాలో మందులు వాడుతున్న వారు... ఈ ధోరణి నుంచి బయటపడాలనుకుంటే.. వైద్యారోగ్య శాఖ తరఫున వారికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఈ లేఖలో పలు అంశాలను వివరంగా ప్రస్తావించారు.
‘మత్తు’గా దగ్గు మందు
కొన్ని రకాల దగ్గు మందు ద్రావణాలను మత్తు కోసం కూడా కొందరు వినియోగిస్తున్నారు. వైద్యుని చీటి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించకూడని దగ్గు మందును... కొన్ని ఔషధ దుకాణాలు ఇష్టానుసారంగా విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకొని వీటి అమ్మకాలను జోరుగా కొనసాగిస్తున్నాయి. అడపాదడపా చేసే తనిఖీలే తప్ప పటిష్ఠ నిఘా లేకపోవడం ఔషధ దుకాణాలకు వరంగా మారింది.
వ్యాధి నిర్ధారణలో జాప్యం
లక్షణాలు కనిపించగానే సొంతంగా మందులు వాడితే... సమస్య తాత్కాలికంగా తగ్గినట్లు అనిపించినా... కొన్నిసార్లు అసలైన వ్యాధిని గుర్తించడంలో ఆలస్యమై జబ్బు ముదురుతుంది. సరైన చికిత్స అందక వ్యాధి ముదిరి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడవచ్చు.
ఔషధ దుష్ఫలితాలు
ప్రతి ఔషధానికి ఒక లక్ష్యమంటూ ఉంటుంది. ఏ జబ్బు కోసం ఎంత మోతాదులో వాడాలనేది చాలా ముఖ్యం. వయసు, బరువు, లక్షణాల తీవ్రతను బట్టి మోతాదుల్లో మార్పులు ఉంటాయి. అందుకే ఔషధాల డోసు తగ్గినా... పెరిగినా దుష్ఫలితాలు తలెత్తుతాయి. డ్రగ్ రియాక్షన్ అయితే, జీవన్మరణ సమస్యలూ తలెత్తుతాయి.
మందుల సమ్మిళితం
వైద్యుడి సలహా లేకుండా.. వేర్వేరు రకాల ఔషధాలను ఒకేసారి వేసుకునే సందర్భాల్లో కొన్నిసార్లు ప్రతికూలత ఎదురవుతుంది. ఎందుకంటే ఒకరికి పనిచేసిన ఔషధం అందరికీ పనిచేస్తుందని చెప్పలేం. వ్యక్తులు, జబ్బులకు కారణాలను బట్టి ఔషధాలు మారుతుంటాయి. వీటిని గ్రహించకుండా వినియోగిస్తే ప్రమాదమే. అలాంటప్పుడు ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు.
యాంటీ బయాటిక్స్ నిరోధకత
అవసరం లేకపోయినా యాంటీ బయాటిక్స్ను తరచూ వినియోగిస్తే శరీరంలో వాటికి నిరోధకత పెరుగుతుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల బారినపడితే... అప్పుడు యాంటీ బయాటిక్స్ వేసుకున్నా పనిచేయవు. ఫలితంగా ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగి తీవ్ర అనారోగ్యానికి దారితీసి, అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది. ఉదాహరణకు జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్కు యాంటీ బయాటిక్స్ను తరచూ వినియోగించడం, పూర్తిస్థాయి కోర్సు వాడకుండా.. లక్షణాలు తగ్గగానే మానేయడం వంటి చర్యలతో భవిష్యత్లో ఆ యాంటీ బయాటిక్స్ పనిచేయవు. నొప్పినివారణ మాత్రలను తరచూ వాడితే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటాయి. జీర్ణకోశంలో అల్సర్లు ఏర్పడి రక్తస్రావం జరుగుతుంది.
వాడక తప్పని బలహీనత
నొప్పి నివారణ, నిద్ర లేమి, అలర్జీలు తదితరాల నివారణ మందులను దీర్ఘకాలం వాడితే కొత్త అనర్థాలు ఏర్పడుతాయి. వాటిని వాడకపోతే రోజు గడవని బలహీనతను ఎదుర్కోవాల్సి వస్తుంది. మందు వాడితేనే నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది. గోళీ వేసుకుంటేనే నిద్ర వస్తుంది. లేకపోతే నిద్రలేని రాత్రుళ్లు గడపాల్సి వస్తుంది. దీర్ఘకాలంలో ఈ దుస్థితి ఆరోగ్యానికి చేటు చేస్తుంది.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్