EAPCET: ఎప్సెట్ ఇంజినీరింగ్లో 74.98% ఉత్తీర్ణత
టీఎస్ ఎప్సెట్-2024 ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు.
అగ్రికల్చర్-ఫార్మసీలో 89.66%..
ఏపీకి చెందిన జ్యోతిరాదిత్య, ప్రణీతలకు తొలి ర్యాంకులు
ఇంజినీరింగ్ టాప్ 10లో 9 మంది బాలురే.. అగ్రికల్చర్లోనూ ఏడుగురు వారే
ఎప్సెట్ సీడీని ఆవిష్కరిస్తున్న కట్టా నర్సింహారెడ్డి, బుర్రా వెంకటేశం,
లింబాద్రి, డీన్ కుమార్, శ్రీరాం వెంకటేష్, విజయకుమార్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: టీఎస్ ఎప్సెట్-2024 ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్ మొదటి పది ర్యాంకుల్లో తొమ్మిది, అగ్రికల్చర్ విభాగంలో మొదటి పదిలో ఏడు ర్యాంకులను బాలురు సొంతం చేసుకున్నారు.రెండు విభాగాల్లో తొలి ర్యాంకును ఏపీ విద్యార్థులే దక్కించుకున్నారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, కార్యదర్శి శ్రీరాం వెంకటేష్, జేఎన్టీయూహెచ్ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి, కన్వీనర్ డీన్కుమార్, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు విడుదలచేశారు. ఎప్సెట్ కో కన్వీనర్ కె.విజయకుమార్రెడ్డి, పరీక్ష సమన్వయకర్తలు ఎస్.తారాకల్యాణి, ఎన్.దర్గాకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్లో శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య 160కి 155.63 మార్కులు సాధించి ప్రథమ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అగ్రికల్చర్ విభాగంలో అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన అలూరు ప్రణీత 146.44 మార్కులు పొంది అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది వరకు ఈ పరీక్షను ఎంసెట్గా పిలవగా... మెడికల్ సీట్ల కోసం నీట్ ఉన్నందున ఆ స్థానంలో ఫార్మసీ విభాగాన్ని చేర్చి ఈ ఏడాది ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష- ఈఏపీసెట్)గా మార్చిన సంగతి తెలిసిందే.
ఇంజినీరింగ్లో ఉత్తీర్ణత తగ్గుతోంది..
గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఇంజినీరింగ్ విభాగంలో ఉత్తీర్ణత శాతం తగ్గుతోంది. 2022లో 80.41 శాతం మంది కనీస మార్కులు (40) సాధించి కన్వీనర్ కోటా (కౌన్సెలింగ్)లో సీట్లు పొందేందుకు అర్హత సాధించారు. 2023లో ఆ శాతం 80.33కి తగ్గింది. తాజాగా 74.98 శాతానికి పడిపోయింది. 160 మార్కులకు 25 శాతం అంటే 40 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులవుతారు (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కనీస మార్కుల నిబంధన వర్తించదు). అగ్రికల్చర్ విభాగంలో గత రెండేళ్లతో పోల్చుకుంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2022లో 88.34 శాతం ఉండగా.. 2023లో 86.31, ప్రస్తుతం 89.66 శాతం మంది పాసయ్యారు. ప్రశ్నపత్రం కఠిన స్థాయిని బట్టి ఉత్తీర్ణత శాతంలో పెరుగుదల, తగ్గుదల ఉంటాయని ఎప్సెట్ అధికారులు చెబుతున్నారు.
అమ్మాయిలదే పైచేయి
టాపర్లలో అబ్బాయిలు సత్తా చాటుతున్నా ఉత్తీర్ణత శాతంలో మాత్రం అమ్మాయిలు పైచేయి సాధిస్తున్నారు. ఇంజినీరింగ్లో అబ్బాయిలు, అమ్మాయిలు వరుసగా 74.38, 75.85 శాతం మంది పాసయ్యారు. అగ్రికల్చర్లో అబ్బాయిలు, అమ్మాయిలు వరుసగా 88.25, 90.18 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య తొలి ర్యాంకు సాధించి సత్తా చాటాడు. ఐఐటీలో సీటు సాధించడమే తన లక్ష్యమని ‘న్యూస్టుడే’కు తెలిపాడు. తల్లిదండ్రులు హైమావతి, మోహనరావు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులని, వారి ప్రోత్సాహంతో ఈ విజయం సాధించినట్లు చెప్పాడు.
- బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్లో ఇంజినీరింగ్ చేయాలనేది తన లక్ష్యమని 2వ ర్యాంకు సాధించిన కర్నూలు విద్యార్థి జి.ఎల్.హర్ష తెలిపాడు. నాన్న సూర్యకుమార్ విశాఖ పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్ విభాగం ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారని, తల్లి సుహాసిని గృహిణి అని, ప్రణాళికాబద్ధంగా చదివించారని వెల్లడించాడు.
- కంప్యూటర్ సైన్స్లో ఇంజినీరింగ్ చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మూడో ర్యాంక్ సాధించిన హైదరాబాద్ అల్వాల్కు చెందిన రుషిశేఖర్ శుక్లా తెలిపాడు. తల్లిదండ్రులు ఇస్రో శాస్త్రవేత్తలు కావడంతో స్ఫూర్తినిచ్చారని వెల్లడించాడు.
నీట్ ర్యాంకులు సాధించి వైద్యులమవుతాం
అగ్రి-ఫార్మసీ విభాగంలో మొదటి ర్యాంకు రావడం సంతోషంగా ఉందని అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన అలూరు ప్రణీత చెప్పారు. దిల్లీ ఎయిమ్స్లో వైద్య విద్య చదివి గుండె వైద్యురాలిగా సేవలందించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. నాన్న శ్రీకర్ హోమియో వైద్యులు, అమ్మ కల్యాణి ప్రైవేటు పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలని వారి స్ఫూర్తితో ఈ విజయం సాధ్యమైందని చెప్పారు.
- నీట్ రాసి మంచి ర్యాంకు సాధించి కార్డియాలజిస్టు కావాలన్నదే తన అభిమతమని 2వ ర్యాంకర్, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేటకు చెందిన నాగు దాసరి రాధాకృష్ణ తెలిపాడు. తల్లిదండ్రులు నారాయణరావు, కృష్ణవేణి, తాతయ్య జగన్నాథరావు ప్రోత్సాహంతో ఈ విజయం సాధించినట్లు వెల్లడించాడు.
- హనుమకొండ రెడ్డికాలనీకి చెందిన గడ్డం కన్నయ్య, లావణ్య దంపతుల కుమార్తె గడ్డం శ్రీవర్షిణి రాష్ట్రస్థాయి మూడో ర్యాంకు సాధించింది. డాక్టర్ కావడమే తన లక్ష్యమని, ఇటీవల నీట్ కూడా బాగా రాశానని, మంచి ర్యాంకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ