Engineering Counselling 2024: జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్/బీఈ సీట్ల భర్తీకి జూన్ 27వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
బీటెక్ సీట్ల భర్తీకి మూడు విడతల ప్రవేశాలు
చివరి విడత తర్వాత కన్వీనర్ ఆధ్వర్యంలోనే స్లైడింగ్
ఈసారి బ్రాంచి మారినా బోధనా రుసుములకు అర్హులే
ఎప్సెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్/బీఈ సీట్ల భర్తీకి జూన్ 27వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. తొలి విడత కౌన్సెలింగ్ జులై 16వ తేదీకి, రెండో విడత అదే నెల 26వ తేదీకి, చివరి విడత ఆగస్టు 7కి ముగియనుంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక బ్రాంచి నుంచి మరో బ్రాంచికి విద్యార్థులు మారేందుకు కన్వీనర్ ఆధ్వర్యంలోనే అంతర్గత స్లైడింగ్ జరగనుంది. ఈ మేరకు ఎప్సెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో కమిటీ ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, కన్వీనర్, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ఆయా ఇంజినీరింగ్ కళాశాలలకు జూన్ 10వ తేదీకి అనుమతులు జారీ చేస్తుంది. ఆ తర్వాత ఆయా విశ్వవిద్యాలయాలు వాటికి అనుబంధ గుర్తింపు జారీ చేయాల్సి ఉంటుంది. వాటిని మాత్రమే కౌన్సెలింగ్లో చేరుస్తారు. ఆ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేయాలని, ఆ తర్వాత జూన్ 27 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుపెట్టాలని కమిటీ నిర్ణయించింది. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు జాయింట్ సీట్ ఎలకేషన్(జోసా) కమిటీ కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 10 నుంచి ప్రారంభమవుతుంది. అది 30 లేదా 35 రోజులు జరుగుతుంది. అంటే జులై రెండో వారం నాటికి ముగుస్తుంది. ఆ తేదీలను పరిగణనలోకి తీసుకొని ఎప్సెట్ రెండో విడత కౌన్సెలింగ్ను జులై 19 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. మొత్తానికి ఆగస్టు 8 నాటికి చివరి విడత కౌన్సెలింగ్... 17 నాటికి అంతర్గత స్లైడింగ్ ప్రక్రియ ముగుస్తుంది.
యాజమాన్యాల అక్రమాలకు చెక్
ఇప్పటివరకు చివరి విడత కౌన్సెలింగ్ తర్వాత జరిగే అంతర్గత స్లైడింగ్ను ఆయా కళాశాలలే నిర్వహించేవి. ఇతర చోట్ల సీట్లు వచ్చిన వారు వెళ్లగా.. భర్తీ కాకుండా మిగిలిన సీట్లలో డిమాండ్ ఉన్నవి చూపకుండా స్లైడింగ్ నిర్వహిస్తున్నారని, తర్వాత వాటిని స్పాట్ కౌన్సెలింగ్లో రూ.లక్షలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈక్రమంలో స్లైడింగ్ దందాకు కళ్లెం పడేనా? అనే శీర్షికన శుక్రవారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎప్సెట్ కన్వీనర్ బుర్రా వెంకటేశం ఈసారి నుంచి స్లైడింగ్ను కన్వీనర్ ద్వారా జరపాలని ఎప్సెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. కొందరు అభ్యంతరం చెప్పినా వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన భావించి ఆమోదం తెలిపినట్లు సమాచారం. స్లైడింగ్లో బ్రాంచి మారినా వారికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. బీ కేటగిరీ సీట్లపైనా చర్చించినా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. సమావేశంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేష్, జేఎన్టీయూహెచ్ రెక్టార్ ఆచార్య విజయకుమార్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య కె.వెంకటేశ్వర్రావు, ఎప్సెట్ కన్వీనర్ ఆచార్య డీన్కుమార్, ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మరికొన్ని ముఖ్య నిర్ణయాలు ...
- రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత విద్యార్థులు స్వయంగా వెళ్లి కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. ఒరిజనల్ టీసీ ఇవ్వాలి. రిపోర్ట్ చేయకుంటే చివరి విడతలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి వీలుండదు. కొత్తగా రిజిస్ట్రేషన్కు కూడా అనుమతించరు.
- అంతర్గత స్లైడింగ్ తర్వాత సీటు పొందిన వారు చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం, సీటును రద్దు చేసుకోవడం చేయరాదు. ఒకవేళ చేసినా ఆ సీట్లను స్పాట్లో భర్తీ చేయడానికి అనుమతించరు. వాటిని తర్వాత విద్యా సంవత్సరం ఈసెట్ ద్వారా వచ్చే పాలిటెక్నిక్ విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ(రెండో ఏడాది)లో భర్తీ చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి